బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ

హైదరాబాద్ : నేరవేరని కాంగ్రెస్ గ్యారంటీలపై వినతి పత్రం సమర్పించేందుకు రాహుల్ గాంధీతో అపాయింట్‌మెంట్ కోరిన రాంచందర్ రావు. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం స్పందించడంలో మరియు అపాయింట్‌మెంట్ కల్పించడంలో విఫలమైతే, అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మరియు ఇక్కడి ప్రజలకు చేసిన తీవ్ర ద్రోహాన్ని స్పష్టం చేస్తుంది.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, నెరవేరని గ్యారంటీలపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి వినతి పత్రాన్ని సమర్పించేందుకు ఆయనతో అపాయింట్‌మెంట్ కల్పించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఒక బహిరంగ లేఖ రాశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ మరియు శ్రీమతి ప్రియాంక గాంధీ వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు, గ్యారంటీల ఆధారంగానే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచారని ఎన్. రాంచందర్ రావు ఆ లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, వృద్ధులు, వ్యవసాయ కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఇచ్చిన పలు కీలక హామీలు ఇంకా నెరవేరని విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. మహిళలు నెలకు రూ.2,500 అందుతుందని ఆశించిన ఆర్థిక సహాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారని, అలాగే రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 లభిస్తుందని రైతులు ఇంకా వేచి చూస్తూనే ఉన్నారని రాంచందర్ రావు పేర్కొన్నారు. కౌలు రైతులు, రైతు కూలీలు మరియు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు కూడా నిరాశే ఎదురవుతోందని అన్నారు.

ఇది కూడ చదవండి-

విద్యార్థులు మరియు యువత పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, విద్యా భరోసా పథకం కింద ఇస్తామన్న రూ.5 లక్షల సహాయం ఇంకా కార్యరూపం దాల్చలేదని రాంచందర్ రావు అన్నారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారని, నిరుద్యోగులు రాహుల్ గాంధీ పదేపదే హామీ ఇచ్చిన నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి కోసం ఇంకా ఎదురుచూస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా, వృద్ధులు నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ఇంకా వేచి చూస్తుండగా, ఒంటరి మహిళలు మరియు దివ్యాంగులకు ఆర్థిక సహాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ, అది ఇప్పటికీ అమల్లోకి రాలేదని పేర్కొన్నారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలు కూడా తమకు ఇస్తామన్న ఉచిత స్కూటర్ల కోసం ఇంకా వేచి చూస్తున్నారని, నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ మరియు ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నిరాశ పెరుగుతోందని ఎన్. రాంచందర్ రావు చెప్పారు. తెలంగాణ ప్రజల ఆందోళనలను, సమస్యలను నేరుగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా, వీలైనంత త్వరగా ఆయనతో అపాయింట్‌మెంట్ కల్పించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఆయన కోరారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం స్పందించడంలో మరియు అపాయింట్‌మెంట్ కల్పించడంలో విఫలమైతే, అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మరియు ఇక్కడి ప్రజలకు చేసిన తీవ్ర ద్రోహాన్ని మాత్రమే రుజువు చేస్తుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X