हैदराबाद : एयरलाइन इंडिगो बीते चार दिनों से उड़ानों में लगातार देरी और रद्द होने की घटनाओं ने यात्रियों का गुस्सा चरम पर पहुंचा दिया है। गुरुवार को अकेले 1000 से अधिक उड़ानें रद्द हुईं। इससे दिल्ली, हैदराबाद, गोवा और मुंबई जैसे बड़े एयरपोर्ट पर हंगामा हो गया।
मीडिया में प्रसारित और प्रकाशित रिपोर्ट के मुताबिक दिल्ली एयरपोर्ट पर हजारों बैग बिखरे पड़े पाये गये। कई यात्री जमीन पर सोते नजर आए और हर तरफ नारेबाजी देखी गई और अफरा-तफरी का माहौल उत्पन्न हो गया। इस बीच दिल्ली एयरपोर्ट से आज सुबह से 200 से ज्यादा इंडिगो की फ्लाइट कैंसिल हो चुकी है। इसमें आने और जाने वाले फ्लाइट शामिल हैं।
इंडिगो ने स्वीकार किया कि नए नियमों के बाद क्रू की जरूरत का गलत आकलन हुआ है। इसके अलावा सर्दियां, तकनीकी दिक्कतें और स्टाफ की कमी के कारण उड़ाने बुरी तरह प्रभावित हो गये है। पायलट-क्रू ड्यूटी के नए नियमों को फिलहाल वापस ले रहे हैं। रात की ड्यूटी सुबह 5 बजे तक थी। अब इसे सुबह 6 बजे तक बढ़ाया था। इसे वापस लिया गया। रात में दो लैंडिंग की सीमा भी अस्थायी रूप से हटाई गई।
यह भी पढ़ें-
इंडिगो ने स्पष्ट किया कि शेड्यूल सामान्य होने में कम से कम 2–3 दिन और लग सकते हैं। 8 दिसंबर से एयरलाइन ने उड़ानों का शेड्यूल कम कर दिया है ताकि अव्यवस्था को रोका जा सके। इंडिगो के सीईओ पीटर एल्बर्स ने कर्मचारियों को संदेश दिया कि समय पर उड़ानें चालू करना आसान नहीं होगा। हम पूरी ताकत से स्थिति सुधारने में लगे हैं।
दूसरी ओर एअर इंडिया यात्रियों के मजबूरी का फायदा उठाने में जुट गई है। खबरें आ रही है कि टिकटों के दाम तीन से चार गुना बढ़ा दिया है। (एजेंसियां)
ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులు గురువారం నానా ఇక్కట్లు
హైదరాబాద్ : ఒకే రోజు 1000కి పైగా విమానాలు క్యాన్సిల్ కావడంతో ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులు గురువారం నానా ఇక్కట్ల పాలయ్యారు. మీడియా వేదికగా తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. తమకు నరకం కనిపించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ లగేజీని వెనక్కు తెచ్చుకోలేక, కనీసం తిండి, తాగడానికి నీరూ లేక ఇక్కట్ల పాలయ్యామని పలువురు వాపోయారు. దీంతో, దేశంలోని వివిధ ఎయిర్పోర్టుల్లో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, అకస్మాత్తుగా ప్రయాణాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయారు. కొందరు నేలపై పడుకుని నిద్రించారు. కౌంటర్లల్లో ఇండిగో సిబ్బంది కానరాక, ఎవరిని ప్రశ్నించాలో తెలియక ఇబ్బందుల పాలయ్యారు. ఢిల్లీ ఎయిర్పోర్టు టర్మినల్లో వేల కొద్దీ సూట్కేసులు పోగుబడి కనిపించాయి. కొందరు ప్రయాణికులు నిరసనకు దిగారు. సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది తమకు నిజంగా మెంటల్ టార్చర్ అని ఓ ప్రయాణికుడు వాపోయాడు. 12 గంటలుగా ఎయిర్పోర్టులోనే ఉన్నా తనకు సంస్థ నుంచి ఎలాంటి వివరణ అందలేదని అన్నాడు. అడిగిన ప్రతిసారీ మరో గంట లేటవుతుందని సిబ్బంది చెప్పారని వాపోయారు. మరికొందరేమో తాము ఏకంగా 14 గంటల నుంచీ వెయిట్ చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ఎయిర్పోర్టుల్లో దాదాపు ఇవే దృశ్యాలు కనిపించాయి.
సిబ్బంది కొరతతో సతమతమవుతున్న ఇండిగో సంస్థ నేడు కూడా ఫ్లైట్ సర్వీసుల రద్దు కొనసాగుతుందని తెలిపింది. పైలట్ల షెడ్యూల్కు సంబంధించి కొత్త నిబంధనల విషయంలో పొరపాటు పడ్డామని, ఫలితంగా సిబ్బంది కొరత తీవ్రంగా మారిందని డీజీసీఏకు వివరణ ఇచ్చింది. నిబంధనల నుంచి తాత్కాలిక మినహాయింపును ఇవ్వాలని కూడా కోరింది. డిసెంబర్ 8 నుంచి పరిస్థితులు అదుపులోకి వస్తాయని తెలిపింది. పరిస్థితి చక్కదిద్దేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నామని వివరించింది.
విమాన పైలట్లకు అధిక విశ్రాంతిని ఇచ్చేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనలు ఇటీవలే పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల మేరకు డ్యూటీ కేటాయింపు కోసం అవసరమైన సంఖ్యలో పైలట్లు లేకపోవడం, శీతాకాలంలో అవాంతరాలు మరింత పెరగడంతో ఇండిగో పలు ఫ్లైట్ సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. (ఏజెన్సీలు)
