आवारा कुत्तों के हमले दो साल के बच्चे की मौत पर CM ने जताया दुख, अधिकारियों को दिए अहम निर्देश और सुझाव

हैदराबाद: मुख्यमंत्री रेवंत रेड्डी ने हैदराबाद के जवाहर नगर में आवारा कुत्तों के हमले में दो साल के बच्चे की मौत की घटना पर दुख व्यक्त किया है। उन्होंने कहा कि इस घटना ने उन्हें झकझोर कर रख दिया है। अधिकारियों को भविष्य में ऐसी घटनाओं की पुनरावृत्ति रोकने के लिए आवश्यक कदम उठाने और कार्रवाई करने का निर्देश दिया है। मुख्यमंत्री ने अधिकारियों से कहा कि ऐसी घटनाएं शहर के साथ तेलंगाना में कई बार हो रही हैं। इस बात को ध्यान में रखते हुए आवारा कुत्तों के खतरे को रोकने के लिए सभी उपाय किये जाये।

सीएम ने जिन क्षेत्रों में आवारा कुत्तों की समस्या है, वहां लोगों से शिकायत प्राप्त करने के लिए एक कॉल सेंटर या टोल-फ्री नंबर स्थापित किया जाये और तत्काल कार्रवाई करने का आदेश दिया है। उन्होंने कहा कि हर साल शिशुओं और बच्चों पर आवारा कुत्तों के हमलों के लिए जलवायु परिस्थितियों या मौसमी कारणों के मुद्दे का अध्ययन करने के लिए पशु चिकित्सकों और ब्लू क्रॉस जैसे स्वैच्छिक संगठनों के प्रतिनिधियों के साथ एक विशेषज्ञ समिति का गठन किया जाये।

अधिकारियों को सलाह दी गई कि वे आवारा कुत्तों के टीकाकरण या अन्य राज्यों में अपनाई जाने वाली पद्धतियों पर ध्यान दें। मुख्यमंत्री ने चिकित्सा एवं स्वास्थ्य विभाग को राज्य के जीएचएमसी के अंतर्गत आने वाले सभी शहरी स्वास्थ्य केंद्रों, सभी प्राथमिक स्वास्थ्य केंद्रों और अस्पतालों में कुत्तों के हमले की स्थिति में आवश्यक दवाएं तुरंत उपलब्ध कराने का निर्देश दिया है। सीएम ने जीएचएमसी और नगरपालिका अधिकारियों को पर्याप्त सावधानी बरतने और ऐसी घटनाओं को रोकने के लिए सभी बस्तियों, कॉलोनियों और संबंधित वार्ड समितियों का सहयोग लेने का सुझाव दिया है।

परिजन और स्थानीय लोगों का आंदोलन

उधर, बच्चे के परिजन और स्थानीय लोगों ने गुस्सा जाहिर किया। स्थानीय विकलांग कॉलोनी में पहुंचे जवाहर नगर नगर निगम आयुक्त मोहन रेड्डी को पद से हटाने की मांग की। स्थानीय लोगों ने आक्रोश जताया है कि जवाहर नगर की गलियों में कुत्तों के आतंक को रोकने के लिए नगर निगम कार्यालय में बार-बार शिकायत करने पर भी आवश्यक कदम नहीं उठाया गया है। उन्होंने बच्चे के परिवार के साथ न्याय करने की मांग की है।

संबंधित खबर-

హైదరాబాద్‌లో రెండేళ్ల బాలుడిని చంపేసిన వీధి కుక్కలు, అధికారులకు CM కీలక ఆదేశాలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో వీధి కుక్కలు దాడి చేసి రెండేళ్ల బాలుడిని చంపేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని అన్నారు. భ‌విష్యత్‌లో ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.

వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప‌సి కందులు, చిన్నారులపై ప్రతి ఏటా వీధి కుక్కల దాడులకు వాతావ‌ర‌ణ ప‌రిస్థితులా, లేక సీజ‌న‌ల్ కార‌ణాల అనే అంశంపై అధ్యయనానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.

వీధి కుక్కలకు టీకాలు వేయటం, లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో కుక్కలు దాడులు చేస్తే తక్షణం అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యా రోగ్య శాఖను సీఎం ఆదేశించారు. ఇలాంటి సంఘటనలను నివారించడానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.

కుటుంబ సభ్యులు, స్థానికుల ఆందోళన

మరోవైపు, మేడ్చల్ పరిధిలోని జవహర్ నగర్ లో మంగళవారం వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు విహన్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక దివ్యాంగుల కాలనీకి వచ్చిన జవహర్ నగర్ మున్సిలప్ కార్పొరేషన్ కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డిని నిలదీశారు. జవహర్ నగర్ లోవీధి కుక్కల బెడద నివారించాలని గతంలో ఎన్నిసార్లు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేరశారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  

వీధి కుక్కల బెడద ఉందని పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ పాలకులు అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రెండు నెలల క్రితమే వికలాంగుల కాలనీకి వచ్చినట్లు బాలుడు తండ్రి భరత్ తెలిపారు. రాత్రి ఆడుకుంటూ బయటికి వచ్చిన క్రమంలో ఒక్కసారిగా పదుల సంఖ్యలో కుక్కలు దాడి చేసి చాలా దూరం ఈడ్చుకెళ్ళినట్లు తెలిపారు. వీధి కుక్కల స్వైర విహారం కారణంగా బయటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోయారు. వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని వీధి కుక్కల బెడద నుండి రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని వికలాంగుల కాలనీలో మంగళవారం ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు విహాన్ పై విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. బాలుడిని ముండ్ల పొదల్లోకి ఈడ్చుకెళ్లి వీధి కుక్కలు తీవ్రంగా గాయపర్చాయి.  విహాన్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వీధి కుక్కల దాడిలో బాలుడి తల భాగంలో, ఒంటిపై తీవ్ర గాయాయ్యాయి. శరీరం ఇన్ఫెక్షన్ కు గురై మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X