हैदराबाद : टी20 विश्व कप 2026 से 12 टीमें बाहर हो चुकी हैं। सुपर-8 में 8 टीमों को जगह मिली है। इन 8 टीमों के बीच आज से मुकाबले शुरू हुए। सुपर-8 का पहला मैच पाकिस्तान और न्यूजीलैंड के बीच कोलंबो के आर प्रेमदासा स्टेडियम पर खेला जाना था।

यह भी पढ़ें-
पाकिस्तान ने टॉस जीता था, लेकिन बारिश के कारण यह मैच रद्द हो गया है। दोनों टीमों के एक-एक अंक दे दिए गए हैं। इसी क्रम में 22 फरवरी को इंग्लैंड बनाम श्रीलंका के बीच पल्लीकेले में दोपहर 3 बजे से और भारत बनाम साउथ अफ्रीका के बीच अहमदाबाद में शाम 7 बजे से खेले जाएंगे। 23 फरवरी को जिम्बाब्वे बनाम वेस्टइंडीज के बीच मुंबई में शाम 7 बजे से खेला जाएगा।
పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు
హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు ఆదిలోనే అనూహ్య షాక్ తగిలింది. హైఓల్టేజ్ నడుమ జరగాల్సిన పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ, మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే వరుణుడు ఆటంకం కలిగించాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం వల్ల మైదానం చిత్తడిగా మారడంతో, అంపైర్లు కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్-8 మ్యాచ్లకు రిజర్వ్ డే లేకపోవడంతో, రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ పరిణామం ఇరు జట్ల సెమీఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సెమీస్ రేసులో నిలవాలంటే కివీస్, పాక్ జట్లు తమ తదుపరి రెండు మ్యాచుల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టోర్నీలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. (ఏజెన్సీలు)
