बाघ के शावकों को लेकर वन अधिकारियों में नया तनाव, अगर वैसे हुआ तो…

हैदराबाद : ज्ञात हो कि नंद्याला जिले के कोत्तापल्ली मंडल के पेद्दागुम्मडापुरम में बाघ के शावक पाये गए हैं। नेशनल टाइगर कंजर्वेशन अथॉरिटी (NTCA) और स्टैंडिंग ऑपरेटिंग प्रोसीजर (SOP) के विशेषज्ञों के निर्देश के चलते प्रोजेक्ट टाइगर एफडी श्रीनिवास रेड्डी ने वन क्षेत्र का दौरा किया।

चार बाघ शावक जहां मिले थे उस एरिया की ट्रैप कैमरों से निगरानी की गई। चार शावकों की मां की पहचान टी-108 के रूप में की गई है। दो दिन बीत जाने पर भी टी108 पता नहीं चलने से वन अधिकारी सोच में पड़ गये हैं। इसके चलते ट्रैप कैमरों की संख्या बढ़कर शावकों की मां का पता लगाने का अधिकारियों को निर्देश दिया गया है। वन क्षेत्र में बेस कैंप, ट्रेंच, सॉसर पिट आदि का क्षेत्रों का गहन निरीक्षण किया जाए।

बाघ के पैरों के निशान की खोज असफल रही। जरूरत पड़ने पर ड्रोन कैमरे के इस्तेमाल पर भी विचार कर रहे हैं। फिलहाल तिरुपति जूपार्क के पशु चिकित्सकों की देखरेख में चार शावक है। ये शावक मां के लिए तड़प रहे है। शावकों की मां की पहचान होने के बाद उसी क्षेत्र में एक छोटे से बाड़े में रखा जाएगा। अगर मां उन्हें देखती और करीब आती है तो शावकों को बाड़े से छोड़ दिया जाएगा।

संबंधित खबर:

పెద్ద పులి పిల్లల విషయంలో అటవీశాఖ అధికారుల్లో కొత్త టెన్షన్, అదే జరిగితే…

హైదరాబాద్ : నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురంలో పెద్దపులి పిల్లలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. NTCA(నేషనల్ టైగర్ కన్సర్వే షన్అథారిటీ), Sop(స్టాండింగ్ఆపరేటింగ్ ప్రొసీజర్)నిపుణుల సూచనలతో ఆపరేషన్ తల్లి పులి కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో ప్రాజెక్ట్ టైగర్ ఎఫ్.డి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు.

నాలుగు పెద్ద పులి పిల్లలు లభ్యమైన ప్రాంతంలో అమర్చిన ట్రాఫ్ కెమెరాల పరిశీలించారు. నాలుగు పులిపిల్లల తల్లిని టీ-108గా గుర్తించారు. రెండు రోజులు గడుస్తున్న T108 ఆచూకీ లభ్యం కాకపోవడంతో తర్జన భర్జనలో ఉన్నారు అటవీశాఖ అధికారులు. ట్రాఫ్ కెమెరాల సంఖ్యను పెంచి తల్లి పులి జాడను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. అటవీ ప్రాంతంలో బెస్ క్యాంపులు, ట్రెంచ్, సాసర్ పిట్ తదితర ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.

పులి పాదముద్రల కోసం గాలించినా ఫలితం లేకపోయింది. అవసరమైతే డ్రోన్‌ కెమెరాను కూడా వాడాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు పులికూనలకు తిరుపతి జూపార్క్‌ పశువైద్యుల పర్యవేక్షణలో సపర్యలు చేస్తున్నారు. తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి. అలాగే తల్లి పులిని గుర్తించిన తరువాత ఒక చిన్నపాటి ఎన్‌క్లోజర్‌లో పులి కూనలను అదే ప్రాంతంలో ఉంచుతారు. తల్లి వాటిని గుర్తించి దగ్గరగా వస్తే కూనలను ఎన్‌క్లోజర్‌ నుంచి వదులుతారు.

అలాగే పెద్ద పులులు సాధారణంగా ఒక కాన్పులో మూడు పిల్లలకు జన్మనిస్తాయి. వీటిలో మగ, ఆడ కూనలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం నాలుగు ఆడ కూనలు కావడం విశేషం. అంతేకాదు పుట్టిన వాటిలో కూడా రెండు మాత్రమే బతికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే పెద్దపులి తమ పిల్లల విషయంలో చిత్రంగా ప్రవర్తిస్తాయి. కూనల్ని మనిషి తాకితే తల్లి తిరిగి తమ దగ్గరకు రానీయవు. ఇక్కడ కూడా పులి కూనలను స్థానికులు పట్టుకుని ఫొటోలు తీసుకున్నారు. అందుకే ఈ పులి కూనలను తల్లి పులి అక్కున చేర్చుకునే అవకాశం ఉండదేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు పిల్లలను తల్లి దగ్గరకు చేర్చలేకపోతే ఇంకా ఆలస్యం అయితే తల్లి వాటిని మర్చిపోయే అవకాశం కూడా ఉందంటున్నారు. అలాగే మనిషి స్పర్శను పోగొట్టేందుకు అటవీ అధికారులు పులి పిల్లల మూత్రాన్ని సేకరించి.. పులి పిల్లల వంటిని తడపనున్నారు. అలాగే అన్ని సందర్భాల్లో తల్లి కూనల్ని అక్కున చేర్చుకోకుండా ఉండదంటున్నారు అధికారులు. పులి కూనలను క్షేమంగా తల్లి వద్దకు చేరుస్తామని అధికారులు అంటున్నారు. మొత్తం మీద పెద్ద పులి పిల్లల విషయంలో ఉత్కంఠ అందరిలో కొనసాగుతోంది. అటవీశాఖ అధికారులు తల్లి పులిని కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X