हैदराबाद : बेंगलुरू में एक और चौंकाने वाली घटना घटी है। बेंगलूरू के हुलीमायु पुलिस थाना क्षेत्र के डोड्डाकम्मनहल्ली में एक फ्लैट में एक महिला की लाश सूटकेस में मिली है। पुलिस का कहना है कि महिला की हत्या उसी के पति ने की। इतना ही नहीं आरोपी पति ने बेहद बेरहमी से पहले पति की हत्या की फिर शव के टुकड़े कर उसे सूटकेस में भरा फिर फ्लैट में ताला लगाकर पुणे भाग गया। पुलिस उपायुक्त सारा फातिमा ने यह जानकारी दी। उन्होनें कहा कि मामले में सभी पहलुओं से जांच की जा रही है।
पुलिस के अनुसार, मृतक महिला की पहचान गौरी खेडकर और आरोपी पति का नाम राकेश राजेंद्र खेडकर है। दोनों महाराष्ट्र के रहने वाले हैं। पुलिस उपायुक्त सारा फातिमा ने बताया कि महिला और उसका पति बीते महीने बंगलूरू शिफ्ट हुए थे। उन्होंने बताया कि गौरी ने मास मीडिया में स्नातक की पढ़ाई की थी। वहीं उसका पति एक निजी फर्म में काम करता है। इस समय वह वर्क फ्रॉम होम कर रहा था। वहीं, कुछ रिपोर्ट्स में यह भी दावा किया जा रहा है कि हत्या को आंजाम देने के बाद आरोपी पति राकेश राजेंद्र ने अपने सास-ससुर को भी फोन किया था और फोन पर उन्हें बताया था कि उसने अपनी पत्नी की हत्या कर दी है और उसका शव सूटकेस में है। सारा फातिमा ने आगे बताया कि मामले की जांच चल रही है। इन विवरणों की पुष्टि के बाद ही कोई बात बताई जा सकती है।
ये मामला तब सामने आया जब मकान मालिक ने शाम करीब 5.30 बजे पुलिस कंट्रोल रूम को सूचना दी। इसके बाद पुलिस मौके पर पहुंची और घटनास्थल का जायजा लिया। पुलिस ने बताया कि महिला का शव सूटकेस में ठूंसा हआ था और उसके शरीर पर चाकू के घाव थे। जिसके बाद फोरेंसिक विशेषज्ञों को बुलाया गया उन्होंने मौके से नमूने एकत्र किए हैं। हत्या को अंजाम देने के बाद राकेश राजेंद्र खेडकर पुणे भाग गया, जहां से उसे हिरासत में लिया गया है। पुलिस उपायुक्त सारा फातिमा ने कहा कि आरोपी को पुणे में हिरासत में लिया गया है और उसे बंगलूरू लाया जा रहा है। उससे पूछताछ के बाद हत्या के पीछे का मकसद का खुलासा हो जाएगा। (एजेंसियां)
यह भी पढ़ें-
బెంగుళూరులో పెళ్లాన్ని నరికి చంపి సూట్ కేసులో పెట్టాడు వ్యక్తి
హైదరాబాద్ : బెంగుళూరులో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి డెడ్ బాడీని సూట్ కేసులో కుక్కి పారిపోయాడు. పోతు పోతూ మీ బిడ్డను చంపేశానని భార్య తల్లి తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చి పారిపోయాడు. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన రాకేష్ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ హిటాచీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతడి భార్య గౌరీ అనిల్ సాంబేకర్ (32)తో కలిసి కర్నాటకలోని హులిమావు పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్డకన్నహళ్లిలో రెండు నెలలుగా నివాసం ఉంటున్నారు. గతంలో మాస్ మీడియా, కమ్యూనికేషన్ విభాగంలో పని చేసిన గౌరీ ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. గత కొంతకాలంగా రాకేష్, గౌరీల మధ్య విభేదాలు తలెత్తాయి.
ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేది. ఈ క్రమంలోనే 2025, మార్చి 26న రాకేష్, గౌరీ మధ్య మరోసారి వాగ్వాదం తలెత్తింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాకేష్ భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం భార్య డెడ్ బాడీని సూట్ కేసులో కుక్కి బాత్రూంలో పెట్టి పారిపోయాడు. ఈ విషయాన్ని తన భార్య గౌరీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘మీ బిడ్డను చంపేశా’నని చెప్పాడు. మృతురాలి తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు హుటాహుటిన రాకేష్ నివాసానికి వెళ్లారు. రాకేష్ ఇంట్లో బాత్రూంలో సూట్ కేసులో గౌరీ మృతదేహాన్ని గుర్తించారు. గౌరీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రాకేష్ను కాల్ డేటా ఆధారంగా పుణెలో అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ ఈస్ట్) సారా ఫాతిమా మాట్లాడుతూ మార్చి 27 సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే హులిమావు స్టేషన్ పోలీసులు రాకేష్ ఇంటి వెళ్లారు. ఇంటికి డోర్ వేసి ఉండటంతో పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బాత్రూంలో ఒక సూట్కేస్లో మహిళ డెడ్ బాడీ కనిపించిందని తెలిపారు. మృతురాలి పేరేంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. రాకేష్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పరారయ్యాడు.
దర్యాప్తు అధికారులు కాల్ డేటా ఆధారంగా ట్రాక్ చేసి నిందితున్ని పుణెలో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రాకేష్ తన భార్య డెడ్ బాడీని ముక్కులు చేయలేదని తెలిపారు. పోస్ట్ మార్టం తర్వాత గౌరీ మరణానికి గల కారణమేంటన్న దానిపై స్పష్టత వస్తోందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుగుతోందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు డీసీపీ ఫాతిమా. (ఏజెన్సీలు)