तेलंगाना में भारी बारिश, हैदराबाद के लिए ऑरेंज और जिलों में रेड अलर्ट, मौसम विभाग की अपडेट रहने का सुझाव व चेतावनी

हैदराबाद: तेलंगाना के विभिन्न जिलों में भारी बारिश जारी हो रही है। हैदराबाद में रात भर भारी बारिश की आशंका है। भारतीय मौसम विभाग रविवार को शहर के लिए ऑरेंज अलर्ट जारी किया है। वहीं तेलंगाना के कई जिले रेड अलर्ट जारी किया है। सूर्यापेट में 250 मिमी की भारी बारिश दर्ज की गई है। जबकि नलगोंडा, महबूबाबाद, खम्मम, मुलुगु, कामारेड्डी वरंगल और जनगांव में भी लगातार बारिश हो रही है। मुख्यमंत्री रेवंत रेड्डी ने मुख्य सचिव शांति कुमार से भारी बारिश के चलते सभी विभागों के अधिकारियों को सतर्क रहने का आदेश दिया है।

भारी बारिश के पूर्वानुमान के मद्देनजर अधिकारियों ने जन सामान्य से सावधानी बरतने और अनावश्यक यात्रा से बचने का सुझाव दिया हैं। भारी बारिश के कारण हैदराबाद के विभिन्न हिस्सों में जलभराव और महत्वपूर्ण व्यवधान होने की संभावना है। इससे दैनिक जीवन और परिवहन प्रभावित हो सकता है। मौसम विभाग ने यातायात की भीड़, फिसलन भरी सड़कें और पेड़ और बिजली के खंभे गिरने की चेतावनी दी है।

जन सामान्य को सलाह दी गई है कि वे मौसम विभाग की आधिकारिक अपडेट के माध्यम से अवगत रहें तथा प्रतिकूल मौसम की स्थिति में सुरक्षा सुनिश्चित करने के लिए सभी आवश्यक सावधानियां बरतें। साथ ही भारी बारिश के कारण हैदराबाद का जनजीवन अस्थव्यस्त हो गया है। शहर के अनेक हिस्सों में ट्रैफिक जाम हो गया है। नीचले इलाकों में भारी भर गया है। उप्पल, रामनगर, अंबरपेट, बंजारा हिल्स, जुबली हिल्स. अमीरपेट और अन्य इलाकों में ट्रैफिक जाम हो गया है। इसी क्रम में सरकार ने सोमवार को स्कूलों को छुट्टी घोषित की है। हालांकि कॉलेज खुले रहेंगे।

विजयवाड़ा राष्ट्रीय राजमार्ग के नंदीगामा में नदी उफान पर

हैदराबाद-विजयवाड़ा राष्ट्रीय राजमार्ग के कोदाडा में भारी वाहन फंसे हुए हैं। नंदीगामा में नदी उफान पर आ गई और राजमार्ग पर पानी भर गया। परिणामस्वरूप, हैदराबाद से विजयवाड़ा की ओर जाने वाले वाहनों को खम्मम और नारकटपल्ली-अद्दंकी रोड की ओर मोड़ दिया गया। फिलहाल कोदाडा और जग्गैयापेट के बीच भारी ट्रैफिक जाम है। यात्री परेशान हो गये क्योंकि उन्हें नहीं पता कि गाड़ियां क्यों रुकी हैं।

संबंधित खबर-

తెలంగాణలో దంచికొడుతున్న వానలు

హైదరాబాద్ : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవే పైకి వరదనీరు చేరింది. దీంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు, నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపైకి మళ్లించారు. ప్రస్తుతం కోదాడ – జగ్గయ్యపేట మధ్య భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వాహనాలు ఎందుకు ఆగిపోయాయో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. నందిగామ వద్ద వాగు పొంగడంతో వరదనీరు.

భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్‌ శాంతికుమారితో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తే పరిస్థితి వస్తే దిగువ ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలన్నారు.

మరోవైపు తెలంగాణగా వర్షాలు దంచికొడుతున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ఉత్తర జిల్లాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్నిజిల్లాల్లో వాగుల ఉధృతికి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.జనజీవనం స్థంభించిపోయింది. మరోవైపు తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతుంది.

బంగాళాఖాతాంలోవాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవ హిస్తున్నాయి. లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల రోడ్లు తెగి రాకపోకలు బంద్ అయ్యాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక సిటీలో ఉదయం నుంచి ముసురు వర్షం కురుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం స్థంభించింది.ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మహబూ బాబాద్ జిల్లాలో మున్నేరువాగుకి భారీగా వరద చేరుకుంటుంది. బయ్యారం పెద్ద చెరువు, మాదన్నపేట, పాకాల చెరువులు మత్తడిపోస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది.

ర్రుపాలెం మండలంలో కుండపోతవానలకు… నర్సింహాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మధిర నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. మధిర మున్సిపాలిటీలో మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. ఇళ్లలోకి వరదనీరు రావడంతో జనం ఇబ్బందిపడ్డారు. కృష్ణాపురం దగ్గర పాలవాగు ఉధృతికి పంటపొలాలు నీటమునిగాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాలలో ఏడు మెలికల వాగు ఉధృతికి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. మిర్యాలగూడలో రోడ్లపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వర్షానికి రహదారులు, లోత ట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గ్రామాల్లో చెరువులు,కుంటలు అలుగుపారుతున్నాయి. త్రిపురాం మండలం బాబుసాయి పేట దగ్గర కుక్కడం – త్రిపురరాం ప్రధాన రోడ్డుపై వరద నీరుప్రవహిస్తుంది. దీంతో 4 మండలాలకు రాకపోకలు నిలిచిపోవడంతో అవస్థలు పడ్డారు జనం. కోదాడ వద్ద హైదరాబాద్ , విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కుండపోత వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఊట్కూరు మండలం మల్లేపల్లిలో వరద ప్రవాహంలో కారు చిక్కుకుపోయింది. జడ్చర్లలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణమంతా వరద నీటి మయమైంది. ఆస్పత్రిలోకి వెళ్లడానికి వీలు లేకుండా ఉల్లివాగు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. నారాయణపేట జిల్లాలో సింగారం వాగు మత్తడి పోస్తోంది. అటు నాగర్ కర్నూల్ జిల్లాలోని ధన్వాడ మండలం పాతపల్లిలో రోడ్లపై వరద ఉప్పొంగుతోంది. సిరసవాడ దగ్గర దుందుభి వాగు ఉధృతికి రాకపోకలు బంద్ అయ్యాయి. ధన్వాడలో ఇవాళ ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న వాగును దాటికి స్కూళ్లకు వెళ్లారు విద్యార్థులు.

హైదరాబాద్ సిటీలోనూ ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. ఇవాళ ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ఏరియాల్లో చిరుజల్లులు కురిశాయి. సికింద్రాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి, బేగంబజార్ ఏరియాల్లో మోస్తరు వానకురిసింది. సిటీ శివార్లలోనూ వర్షం పడింది. కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, దుండిగల్, గండిమైసమ్మ, జీడిమెట్ల సహా పలు ఏరియాల్లో మోస్తరు వర్షం పడింది.రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ లో తంగడపల్లి వెంకిర్యాల వాగు ఉధృతికి రాకపోకలు స్థంభించాయి. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో మోస్తరు వానకురిసింది. మేడ్చల్ జిల్లాలోనూ అక్కడక్కడ వర్షం కురిసింది.

తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కృష్ణానదిపై ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చిచేరుతుంది. జూరాల నుంచి శ్రీశైలంకు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. 3లక్షల 26 వేల 481 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. 8గేట్లు ఎత్తి 3లక్షల 499 క్యూసెక్కుల నీటిని సాగర్ కు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. శ్రీశైలంనీటిమట్టం, నీటినిల్వ సామర్థ్యం పూర్తిస్థాయికి చేరింది. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగావరద పోటెత్తుతుంది.దీంతో ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. సాగర్ కు ప్రస్తుతం 3లక్షల 35 వేల 596 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో 26గేట్లు ఎత్తి 3లక్షల 35 వేల 586 క్యూసెక్కుల వాటర్ ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు.సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312టీఎంసీలుకాగా ప్రస్తుతం308.7టీఎంసీల నీరుంది.

హైదరాబాద్ సిటిలో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండావర్షంపడుతోంది..లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించి పోయింది..వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం( ఆగస్టు 31) సాయంత్రం ఉప్పల్ ప్రాంతంలో మేడిపల్లి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు వరంగల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర రెండు వైపు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. ఉప్పల్ నుంచి వరంగల్ హైవే లో ఫ్లై ఓవర్ నిర్మాణపనులు జరుగుతుండటంతో , వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ లో వాహనాలు ఎటు పోలేని పరిస్థితి నెలకొంది.. పైనుంచి వర్షం పడుతోంది.. మరో వైపు ట్రాఫిక్ సమస్యతో వాహనాలు నానా ఇబ్బందులు పడ్డారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X