अलविदा : पूर्व पीसीसी अध्यक्ष धर्मपुरी श्रीनिवास का निधन, परिजनों ने बताई यह वजह

हैदराबाद: पूर्व पीसीसी प्रमुख और वरिष्ठ कांग्रेस नेता धर्मपुरी श्रीनिवास (डीएस) 75 का निधन हो गया। परिवार के सदस्यों ने बताया कि पिछले कुछ समय से बीमार चल रहे डीएस का शनिवार अलसुबह 3 बजे हैदराबाद स्थित उनके आवास पर दिल का दौरा पड़ने से निधन हो गया।

27 सितंबर 1948 को जन्मे डीएस निज़ाम कॉलेज से अपनी डिग्री पूरी की। 1989 में वह पहली बार कांग्रेस पार्टी से निज़ामाबाद शहरी से विधानसभा के लिए चुने गए। 1999 और 2004 में विधायक के रूप में जीते। 1998 में उन्हें संयुक्त आंध्र प्रदेश पीसीसी के अध्यक्ष के रूप में नियुक्त किया गया था।

डीएस ने 2004 और 2009 में संयुक्त एपी में मंत्री और पीसीसी के अध्यक्ष के रूप में काम किया। 2014 के बाद वह बीआरएस में शामिल हो गए और राज्यसभा के सदस्य के रूप में चुने गए। बाद में वह दोबारा कांग्रेस में शामिल हो गये।

वर्तमान में उनके दूसरे बेटे धर्मपुरी अरविंद निज़ामाबाद के सांसद हैं। सबसे बड़े बेटे संजय पहले निज़ामाबाद के मेयर के रूप में कार्यरत थे। परिजनों ने बताया कि डीएस का अंतिम संस्कार निजामाबाद में रविवार को किया जाएगा। आज शाम को उनके पार्थिव शरीर को निजामाबाद लेकर जाएंगे।

यह भी पढ़ें-

గుండెపోటుతో మాజీ పీసీసీ చీఫ్ డీఎస్ కన్నుమూత

హైదరాబాద్ : మాజీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్(75) (ధర్మపురి శ్రీనివాస్) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్ హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో ఇవాళ (జూన్ 29) తెల్లవారుజామున 3 గంటలకు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

1948 సెప్టెంబర్ 27న జన్మించిన డీఎస్‌ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఉమ్మడి ఏపీలో 2004, 2009లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 తర్వాత బీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు.

ప్రస్తుతం ఆయన రెండో కొడుకు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కొడుకు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. (ఏజెన్సీలు)

ధర్మపురి అర్వింద్ ఎమోషనల్ నోట్

రాజకీయ దిగ్గజం, కాంగ్రెస్ సీనియర్ నేత డీ. శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆస్పత్రి తరలిస్తుండగానే డీఎస్ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, తండ్రి డీఎస్ మృతి పట్ల కొడుకు, ఎంపీ ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. అన్నా అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇకలేరు ఐ విల్ మిస్ యూ డాడీ! నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నా లోనే ఉంటావు’ అని బరువెక్కిన గుండెతో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు తండ్రి డీఎస్‌తో ఉన్న తన ఫొటోను ఎంపీ అర్వింద్ షేర్ చేసారు.

సంతాపం

పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి

మాజీ PCC అధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

పొన్నం ప్రభాకర్,రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి

మాజీ మంత్రి,ఏపీ పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అకాల మరణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి గా, పిసిసి చీఫ్ గా చేసిన సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం పార్టీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. డిఎస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థించారు.

కోరిక తీరకుండానే కన్ను మూసిన డీఎస్

డీఎస్ శ్రీనివాస్ కూడా కోరిక తీరకుండానే శనివారం తెల్లవారు జామున కన్ను మూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను శాసించిన నేతగా ఆయనకు పేరుంది. రెండు పర్యాయాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యం. ఏదో ఒకరోజు సీఎం కావాలనేది డీఎస్ కోరిక. కానీ మారిన రాజకీయాలలో ఆయన సీఎం కాలేక పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X