
Hyderabad : మహాపరినిర్వాన్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ డా. బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులర్పించారు. బాబాసాహెద్ అంబేద్కర్ వర్థంతి నేపథ్యంలో న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లాన్స్లో ప్రధాని మోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్ కర్, స్పీకర్ ఓం బిర్లా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు.

రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేత్కర్ వర్ధంతి సందర్భంగా గాంధి భవన్ లో నివాళులు అర్పించిన టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, కుమార్ రావ్, అధికార ప్రతినిధి కల్వ సుజాత, అల్లం భాస్కర్ తదితరులు.

Dr B R Ambekar Open University: రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేత్కర్ వర్ధంతి సందర్భంగా గాంధి భవన్ లో నివాళులు అర్పించిన అధికారులు, కార్మికులు.


Dr B R ambedkar వర్ధంతి సందర్బంగా చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేన రెడ్డి .బీజేపీజాతీయ కార్యదర్శి sc మోర్చా.ఎస్. కుమార్.రావుల రాజేందర్
నాయకులు పాపారావు తదితరులు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలు స్మరించుకున్నారు.

నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో “డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాని”కి పూలమాల వేసి, నివాళి అర్పించిన తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు & కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష, ఇతర ముఖ్య నేతలు.
