Hyderabad: మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఏఐసీసీ అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీన బోయినిపల్లి గాంధీ ఐడియాలజి కేంద్రంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ శిబిరంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు వచ్చి పాల్గొనవలసిందిగా మనవి.

అలాగే రాజీవ్ గాంధీ భీమా కింద ఏదైనా ప్రమాదంలో మరణించిన కాంగ్రెస్ సభ్యులకు చెక్ ల పంపిణీ, మధ్యాహ్న భోజనం తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి.
