త్వరలో.. మీ ముందుకు ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ సంచలనాత్మకమైన ఆత్మకథ, అందులో ఏముందంటే…?

హైదరాబాద్ : ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఆత్మకథ ‘ఉరి’ (ఒక బహుజన ఆత్మకథ) హిందీలో రాసిన తాను అటోగ్రాఫ్ పుస్తకంను తెలుగు అనువాదం దాదాపు పూర్తయింది, ముద్రణ కోసం పంపించబడింది. 2018లో ‘ఉరి’ ఆవిష్కరణ జరిగినప్పుడు, అనేక వక్తలు దీని తెలుగు అనువాదం అవసరమని నొక్కి చెప్పారు. ప్రముఖ విప్లవ రచయిత, సాహిత్యకారుడు అల్లం రాజయ్య ఈ అనువాదం కోసం ముందుకొచ్చారు, కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇప్పుడు పాఠకులు ఈ తెలుగు పుస్తకంలో ఆయన ఆలోచనలను తెలుసుకోగలరు.

గత ఏడేళ్లుగా సాహిత్య ప్రేమికులు ఈ తెలుగు సంస్కరణ గురించి నిరంతరం అడుగుతూ వచ్చారు. ఇప్పుడు ఈ పుస్తకం తెలుగులో రానుంది. ప్రముఖ విప్లవ కవి నిఖిలేశ్వర్ పర్యవేక్షణలో సవరణ పని జరిగింది, స్థానిక సంపాదకుడు డి. చంద్రశేఖర్ రెడ్డి (ఎమెస్కో పబ్లికేషన్స్) సంపాదకీయ బాధ్యతలు నిర్వహించారు. ఈ ఇద్దరు సాహిత్యకారుల ఆలోచనలు పాఠకులకు అందనున్నాయి. అనువాదకుడు డాక్టర్ కారం శంకర్ ఈ పుస్తకాన్ని తెలుగులో అనువదించారు, ఆయన తనదైన శైలిలో అనువాదిస్తూ చేసిన వ్యాఖ్యాలు చట్టం గురించి చాలా విషయాలు తెలుస్తాయి.

‘ఉరి’ రచయితను ‘రియల్ హీరో’ అన్న ‘నిర్దేశం’ సంపాదకుడు యాటకర్ల మల్లేష్ ఆలోచనలూ ఈ పుస్తకంలో ఉన్నాయి.

Also Read-

‘ఉరి’ రచయిత కె. రాజన్న సామాజిక జీవితంలో అనేక ఒడిదుడుకులు చవిచూశారు. బంధుత్వాలు తెగిపోవడం, పొరుగువారు సాయం చేయడం, హత్య నేరారోపణ, పోలీసుల వైఖరి, కోర్టు ఉరిశిక్ష, ముషీరాబాద్ జిల్లా జైలు డిప్యూటీ జైలర్ మోజెస్ సలహాతో అప్పీల్ చేయడం, జైలు జీవితం, జైలు హింసలు, నక్సలైట్లతో పరిచయం, సంస్కరణ కేంద్రం (జైలు) లో ఉన్నత చదువు, జైలులో పండిత గంగారామ్‌తో మొదటి సమావేశం, ‘దక్షిణ సమాచార్’ సంపాదకుడు మునీంద్ర పరిచయం, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ క్షమాభిక్ష ప్రసాదం, డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీఆర్ఓ విశ్వేశ్వర్ రెడ్డి, దివంగత వైస్ ఛాన్సలర్ ఆర్.వి.ఆర్. చంద్రశేఖర్ రావు ద్వారా రోజువారీ వేతన ఉద్యోగం వంటి భావోద్వేగ, వేదన, సునిశీత సంఘటనల గురించి పాఠకులు తెలుసుకుంటారు.

ఒక ముస్లిం కుటుంబం ఉరి శిక్ష పడిన ఖైదితో పెళ్లి చేయడానికి హిందు అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించడం రచయిత జీవితంలో పెద్ద మలుపు, మార్పు.. ఆ అమ్మాయితో తల్లి-తండ్రులు మరియు గ్రామస్తులు ఏం చెప్పారు, ఆమె ఒక మాజీ ఉరిశిక్ష ఖైదీని ఎలా వివాహం చేసుకుంది వంటి విషయాలు కూడా తెలుస్తాయి.

‘డైలీ హిందీ మిలాప్’ సంపాదకులు వినయ్ వీర్, సదాశివ్ శర్మ ఉద్యోగ అవకాశం ఇచ్చారు. ఈ మహానుభావుల సహాయంతో రచయిత తన కుమార్తె, కుమారుడికి ఉన్నత విద్య అందించగలిగారు. ప్రస్తుతం వారి పిల్లలు ఏం చేస్తున్నారు? రచయితతో కలిసిన వ్యక్తుల వ్యక్తిత్వం, ఆసక్తికర విషయాలు కూడా పాఠకులకు తెలుస్తాయి.

ప్రధానంగా, ‘ఉరి’ పుస్తం జీవితంలో ఒడిదుడుకుల్లో ఎన్నడూ కుంగిపోకుండా ముందుకు సాగాలనే సందేశాన్ని సమాజానికి ఇస్తుంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో పేదవారు ఎలా బతుకుతారు, ఎలా చనిపోతారు, ఎలా చంపబడతారో తెలియజేస్తూ రచయిత ఈ ఆత్మకథ రాశారు. పుస్తకం చదివేటప్పుడు కొన్నిసార్లు అనాయాసంగా కన్నీళ్లు వస్తాయి, కొన్నిసార్లు సమాజంపై కోపం కలుగుతుంది. కొందరు అధికారులు రచయితపై దయ, కరుణ చూపిస్తారు. మహారాష్ట్ర జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రొబేషన్ అధికారులు క్షమాపణ దరఖాస్తుపై వెంటనే విడుదల చేయాలని సిఫారసు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.

ప్రతి బహుజనడు ఈ పుస్తం చదవాలని సిఫారసు చేస్తున్నాము, ఎందుకంటే ఇందులో వారి జీవిత యాత్ర ఉంది. సత్యాసత్యాలను బయటపెట్టే, నీళ్లకి నీ, పాలకి పాలు చేసే ఈ తెలుగు పుస్తం త్వరలో పాఠకుల చేతికి అందనుంది. అధిసంఖ్యక తెగుగు పాఠకులు చదవవలసిన పుస్తకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X