హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను లోక్ భవన్లో డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయా కృష్ణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో అక్టోబర్ నెలలో నిర్వహించనున్న 27వ స్నాతకోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

Also Read-
స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను గవర్నర్కు వైస్ ఛాన్సలర్ మరియు చక్రపాణి, రిజిస్ట్రార్ విజయా కృష్ణా రెడ్డి వివరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి హాజరు కావడానికి అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.
