హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) బ్యాండ్ బృందం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల భాగంగా 9 ఆగస్టున కాచిగూడ రైల్వే స్టేషన్లో 12 మంది సభ్యులతో కాచిగూడ రైల్వే స్టేషన్లో అద్భుతమైన సంగీత ప్రదర్శనను నిర్వహించింది.

Also Read-



భారత స్వాతంత్ర్య దినోత్సవ 80వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా, ఈ బ్యాండ్ బృందం అనేక దేశభక్తి గీతాలతో పాటు ప్రజాదరణ పొందిన పాటలను ప్రదర్శించి, స్టేషన్ ప్రాంగణంలోని ప్రయాణికులను మరియు ప్రేక్షకులను అలరించింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి, ప్రదర్శనకారుల కృషిని అభినందించారు.
