సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన రైల్వే బోర్డు చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశాలు

హైదరాబాద్ : రైల్వే బోర్డు చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సి.ఈ.ఓ) సతీష్ కుమార్ జూలై 4న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సమయంలో ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.

సతీష్ కుమార్ సికింద్రాబాద్ స్టేషన్ దక్షిణ వైపున వారి తనిఖీని ప్రారంభించారు. అక్కడ పునరుద్ధరించిన స్టేషన్ ముఖద్వారాన్ని మరియు ప్రవేశ మార్గాన్ని పరిశీలించారు. ఆయన స్టేషన్‌లోని గ్రౌండ్, మొదటి మరియు రెండవ అంతస్తులలో పూర్తయిన పనులను పరిశీలించడంతో పాటు, అక్కడ నూతనంగా ఏర్పాటుచేసిన భూగర్భ (అండర్ గ్రౌండ్) పార్కింగ్ సదుపాయాన్ని కూడా తనిఖీ చేశారు.

అధికారులు చైర్మన్‌ కి మొత్తం ప్రణాళికలు మరియు పనుల పురోగతి గురించి వివరించారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్మాణ ప్రదేశాలలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రధాన మౌలిక సదుపాయాల మార్పులతో కూడిన పునరాభివృద్ధి పనుల సమయంలో ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని కనిష్ట స్థాయికి తగ్గించాలని కూడా ఆయన సూచించారు.

అధికారులు చైర్మన్‌కు మొత్తం ప్రణాళికలు మరియు పనుల పురోగతి గురించి వివరించారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్మాణ ప్రదేశాలలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఉదయం సతీష్ కుమార్ హైదరాబాద్‌లోని మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో, దాని ఉత్పత్తితో సహా, సమగ్ర తనిఖీ నిర్వహించారు.

Also Read-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X