బీహార్, జూబ్లీహిల్స్ ఎన్నికలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందన

హైదరాబాద్ : బీహార్ లో ఎన్డీయే ప్రభంజనం కనబడుతోంది. బీహార్ ప్రజలు జంగిల్ రాజ్ మళ్లీ రావొద్దని కోరుకున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధికి ప్రజలు పట్టం గట్టారు. రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని వద్దనుకుని అభివృద్ధిని.. కోరుకున్నారు. నరేంద్రమోదీ గారి నాయకత్వంలో.. నితీశ్ కుమార్ గారి నేతృత్వంలోని ప్రభుత్వం ద్వారా జరుగుతున్న పురోగతి ఇకపైనా కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఎన్డీయేకు బంపర్ మెజారిటీ ఇచ్చారు. సర్వే సంస్థలు కూడా ఎన్డీయే ప్రభుత్వం ఈ స్థాయిలో సీట్లు గెలుస్తుందని ఊహించలేదనుకుంటాం.

మోదీ గారి నాయత్వంలో దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో ముందుకెళ్తోంది. దీని ఫలితమే.. బిహార్ ఎన్నికల ఫలితాలు. హర్యాణా, తర్వాత మహారాష్ట్ర, ఇప్పుడు బిహార్ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రజలు మంగళం పాడేశారని నిరూపితమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఇప్పుడున్న 3 రాష్ట్రాలు కూడా.. చేజారిపోవడం ఖాయం.

ఎన్నికల కమిషన్ ను విమర్శిస్తే.. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడవనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేశంలో అక్రమంగా ఉన్న ఓట్లను తొలగించడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ ఈ పద్దతే సరైనదని ప్రజలు అంగీకరించారు. SIR ను మోదీ చేయరు.. ఆయా జిల్లాల కలెక్టర్లు, తర్వాత క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్లు ఈ ప్రక్రియలో భాగస్వాములవుతారు. దీనికి మోదీ గారికి సంబంధేమేంటి? రాహుల్ గాంధీకి చాలా విషయాలు తెలియక అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల అధికారులకు, దేశ ప్రజలకు ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలి.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేం ఏనాడూ గెలవలేదు. కార్పొరేటర్ ఎన్నికల్లోనూ మేం ఈ ప్రాంతంలో గెలవలేదు. అయినా మేం ప్రయత్నం చేస్తున్నాం. బీజేపీ ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుంది కాబట్టి.. బాధ్యత తీసుకుని ఎక్కువ కష్టపడ్డాం. రాజకీయ పార్టీగా మేం చేయాల్సిన పనిని చేశాం. ఫలితాన్ని మేం సమీక్షించుకుంటాం. మరింత కష్టపడి పనిచేస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలుచుకునే దిశగా పనిచేస్తాం.

Also Read-

మజ్లిస్ అండతో కాంగ్రెస్ గెలిచింది. సహజంగా ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది రేవంత్ పాలనకు రెఫరెండం కాదనే విషయాన్ని ఎన్నికలకు ముందే చెప్పాను. బీజేపీ ఇండిపెండెంట్ గానే ఉంటుంది.. ఎవరితోనూ కలవదు. తప్పుడు ప్రచారం చేసి సాధించేది ఏమీ ఉండదు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు కోట్ల కొద్ది రూపాయలను పంచాయి. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. పోలింగ్ బూత్ ముందు.. ఎన్నికలకు ఒకరోజు ముందు కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. దీనికి బాధ్యులెవరో తెలియదా. డబ్బులు పంపిణీ చేసినందుకే కాంగ్రెస్ గెలిచింది.

రేవంత్ రెడ్డి ఏం చేశాడని, జూబ్లీ హిల్స్ ఓటర్లు ఓటేయాలి. ఈ నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నందుకు రేవంత్ కు జనాలు ఓటేశారా? కాదు.. డబ్బులిచ్చి. కాంగ్రెస్ గెలిచింది. ఈవీఎంలు బిహార్లో పనిచేయలేదా? లేక జూబ్లీహిల్స్ లో మాత్రమే సరిగ్గా పనిచేశాయా? అనే ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాలి.

బీజేపీకి రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇందులో సందేహం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో.. 8 అసెంబ్లీ సీట్లు గెలిచిన మేం.. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి.. 8 ఎంపీ స్థానాల్లో గెలిచాం. మా విశ్లేషణ ప్రకారం.. పార్లమెంటు ఎన్నికల ఫలితాల ఆధారంగా.. 57 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. మూడింట్లో రెండుచోట్ల గెలిచాం. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లోని యువత, టీచర్లు కలిసి మమ్మల్ని గెలిపించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ మరింతగా విస్తరిస్తుంది.

మరోవైపు బిజెపి బీహార్ ఎన్నికలలో విజయం సాధించడం పట్ల బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సంబరాల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బిజెపి శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X