@కొడంగల్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ పాయింట్స్… కేంద్రం కవితను, రాష్ట్రం బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్టు చేయడంలేదు?

Hyderabad: “టీఆరెస్ పాలనలో కొడంగల్ కు తుప్పు పట్టింది. డ్రామారావు దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి తప్ప టీఆరెస్ కు ఏ ప్రాజెక్టుతో సంబంధం లేదు.అవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదు? 2019 జనవరి 1 నుంచి కొడంగల్ కు టీఆరెస్ ఎమ్మెల్యే ఉన్నారు. నాలుగేళ్ళ కాలంలో ఏం అభివృద్ధి చేశారో కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలి.” అని అన్నారు రేవంత్ రెడ్డి .

రేవంత్ రెడ్డి మాట్లాతూ… “కొడంగల్ అభివృద్ధికి నిధులు వచ్చే వరకు ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. కొడంగల్ కు అభివృద్ధికి నిధులు వచ్చుడో శాసన సభ్యుడు సచ్చుడో తేలాలి. అసెంబ్లీలో కొడంగల్ అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రకటన జరగాలి. లేకపోతే గ్రామ గ్రామాన తిరిగి… టీఆరెస్ తీరును ఉతికి ఆరేస్తాం. గాంధీ కుటుంబమే విచారణ సంస్థలను గౌరవించింది. కానీ టీఆరెస్, బీజేపీ నేతలు ఎందుకు తపించుకు తిరుగుతున్నారు. రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారు. కేంద్రం కవితను, రాష్ట్రం బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్టు చేయడంలేదు? కాంగ్రేస్ ను దెబ్బతీసేందుకే టీఆరెస్, బీజేపీ ల కుట్ర.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X