हैदराबाद: जीएचएमसी शहर तेज़ी से बढ़ रहा है। देखते ही देखते नई कॉलोनियां बस रही हैं। आबादी बढ़ रही है। लेकिन, इन नई कॉलोनियों में ट्रांसपोर्ट की सही सुविधा नहीं है। मुख्य रूप से कई इलाकों में आरटीसी की बस सुविधा नहीं है। इस वजह से लोगों को मजबूरन निजी वाहनों का सहारा लेना पड़ रहा है। इससे उन पर भारी आर्थिक का बोझ पड़ रहा है।
इसी क्रम में, आरटीसी को कई दिनों से नई बनी कॉलोनियों में भी बस सुविधा उपलब्ध कराने के आवेदन मिल रही है। इस बारे में आरटीसी ने अहम फैसला लिया है। नई कॉलोनियों में भी बेहतर ट्रांसपोर्ट सुविधा देने का प्लान बनाया है। इस फैसले से नई कॉलोनियों में भी आरटीसी की बसें चलेंगी।
शहर में तेज़ी से बढ़ रही नई कॉलोनियों के लोगों को ट्रांसपोर्टेशन की दिक्कतों से निपटने के लिए आरटीसी प्रबंधन आगे आया है। नई कॉलोनियों के लोगों को भी बेहतर पब्लिक ट्रांसपोर्टेशन देने के मकसद से आरटीसी ने ‘हैदराबाद कनेक्ट’ नाम का प्रोग्राम शुरू किया है। इसके ज़रिए आरटीसी ने कुल 373 नई कॉलोनियों में बस की सुविधा उपलब्ध कराने का फैसला लिया है। इसी अंतर्गत आरटीसी के कर्मचारी पिछले कुछ दिनों से कॉलोनियों में जाकर उनकी पहचान कर रहे हैं। ट्रांसपोर्ट सर्विस का पहला चरण अगले 2 महीनों में सबसे ज़्यादा भीड़भाड़ वाली कॉलोनियों में दी जाएगी।
इसके लिए हैदराबाद इलाके की 243 और सिकंदराबाद इलाके की 130 नई कॉलोनियों को चुना गया है। अधिकारियों का मानना है कि इन इलाकों में सबसे पहले बस की सुविधा देने से 7,61,200 यात्रियों को फ़ायदा होगा। बसें उन इलाकों से चलाई जाएंगी जहाँ कर्मचारियों की संख्या ज़्यादा है, जैसे उप्पल, गाचीबोवली, हाईटेक सिटी और फाइनेंशियल डिस्ट्रिक्ट।
हैदराबाद रीजन
दिलसुखनगर में 55 (सबसे ज़्यादा) कॉलोनियां, राजेंद्रनगर में 51, मिधानी में 42, बंडलागुडा में 34, मेहदीपट्टनम में 17, इब्राहिमपट्टनम में 14, हयातनगर-1 में 12, हयातनगर-2 में 10, फलकनुमा में 7, महेश्वरम में 1 कॉलोनी है।
सिकंदराबाद रीजन
जीडिमेटला में सबसे ज़्यादा 36 कॉलोनियां हैं, चेंगिचेर्ला में 25, कुकटपल्ली में 21, मेडचल में 10, उप्पल में 10, एतसीयू में 8, मियापुर-2 में 7, कैंटोनमेंट में 6, रानीगंज में 4, कुशाईगुडा में 3 कॉलोनियां हैं।
इन कॉलोनियों में अगले दो महीनों में बस की सुविधा उपलब्ध कराई जाएगी। पता चला है कि इन नई कॉलोनियों में इलेक्ट्रिक बसें चलाई जाएंगी। इसमें महिलाओं के लिए फ्री यात्रा की सुविधा है। उम्मीद है कि इससे आरटीसी को और फ़ायदा होगा।
यह भी पढ़ें-
నగరంలోని కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్ : నగరం శరవేగంగా విస్తరిస్తోంది. చూస్తుండగానే కొత్త కాలనీలు పుట్టుకొస్తున్నాయి. జనావాసాలు పెరుగుతున్నాయి. అయితే ఈ కొత్త కాలనీలకు సరైన రవాణా సౌకర్యం లేదు. చాలా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. దీంతో జనాలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. దీనివల్ల వారిపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది.
ఈక్రమంలో కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలకు కూడా బస్సు సౌకర్యం కల్పించాలని చాలా రోజులగా ఆర్టీసీకి వినతులు వస్తున్నాయి. ఈక్రమంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కాలనీలకు కూడా మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం కోసం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నిర్ణయం వల్ల కొత్త కాలనీల్లో కూడా ఆర్టీసీ బస్సులు పరుగులు తీయనున్నాయి.
నగరంలో వేగంగా విస్తరిస్తోన్న కొత్త కాలనీల వాసులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ యాజమాన్యం ముందుకు వచ్చింది. కొత్త కాలనీల వాసులకు కూడా మెరుగైన ప్రజా రవాణా అందించాలనే ఉద్దేశంతో ఆర్టీసీ ‘హైదరాబాద్ కనెక్ట్’ పేరుతో ఓ కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా మొత్తం 373 కొత్త కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గత కొన్ని రోజులుగా ఆర్టీసీ సిబ్బంది ఆయా కాలనీల్లో పర్యటించి.. బస్సుల అవసరం ఉన్న కాలనీలను గుర్తించారు. మరో 2 నెలల్లో రద్దీ అధికంగా ఉండే కాలనీల్లో మొదటి దశ రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ రీజియన్లో 243, సికింద్రాబాద్ రీజియన్లో 130 కొత్త కాలనీలను ఎంపిక చేశారు. ముందుగా ఈ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా 7,61,200 మంది ప్రయాణికులకు లబ్ధి చేకూరనుందని అధికారులు భావిస్తున్నారు. ఉప్పల్, గచ్చిబౌలి, హైటెక్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఉద్యోగులు అత్యధికంగా ఉండే ప్రాంతాల నుంచి బస్సులను నడపనున్నారు.
హైదరాబాద్ రీజియన్
దిల్సుఖ్నగర్ 55 (అత్యధికం) కాలనీలు, రాజేంద్రనగర్ 51, మిధాని 42, బండ్లగూడ 34, మెహిదీపట్నం 17, ఇబ్రహీంపట్నం 14, హయత్నగర్-1లో 12, హయత్నగర్-2లో 10, ఫలక్నుమా 7, మహేశ్వరం 1 కాలనీ ఉన్నాయి.
సికింద్రాబాద్ రీజియన్
అత్యధికంగా జీడిమెట్లలో 36 కాలనీలు ఉండగా, చెంగిచెర్ల 25, కూకట్పల్లి 21, మేడ్చల్ 10, ఉప్పల్ 10, హెచ్సీయూ 8,
మియాపూర్-2లో 7, కంటోన్మెంట్ 6, రాణిగంజ్ 4, కుషాయిగూడ 3 కాలనీలు ఉన్నాయి.
మరో రెండు నెల్లలో ఆయా కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించనున్నారు. అయితే ఈ కొత్త కాలనీలకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతారని తెలుస్తోంది. దీనిలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. దీంతో ఆర్టీసీకి మరింత లబ్ధి చేకూరనుందని భావిస్తున్నారు.
