“రాజకీయ దురుద్ధేశంతోనే ఎమ్మెల్సీ కవితపై కేసు”

కవిత ధైర్యంగా ఉన్నారు

ఫాసిస్టు విధానాలపై పోరాటం కొనసాగిద్దామన్నారు

ఢిల్లీ లిక్కర్ కేసులో పీఎంఎల్ఏ వర్తించబోదు

పాలసీ అమల్లో పాల్గొన్న వారంతా నేరస్తులే అయితే కేంద్రం కూడా నేరం చేసినట్లే

మూడు రైతు నల్ల చట్టాలు ఎవరి ప్రయోజనం కోసం తెచ్చి ఉపసంహరించుకున్నారు? అవి తెచ్చినందుకు మోదీని కూడా అరెస్టు చేయాలి కదా ?

ఇలాంటి కేసులకు అదిరేది బెదిరేది లేదు

బీఆర్ఎస్ పార్టీని బెదిరించాలనుకుంటే అది బిజెపి భ్రమనే అవుతుంది

ఎమ్మెల్సీ కవితతో ములాఖాత్ అనంతరం బిఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాల్క సుమన్ వ్యాఖ్యలు

హైదరాబాద్ : కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టారని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. న్యాయవాదికి నోటీసులు ఇవ్వకుండానే జైలులోఉన్న కవితను సీబీఐ అరెస్టు చేసిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పై విచారణ జరుగుతుండగానే రాత్రికి రాత్రికి జడ్జిని మార్చారంటే ఏ విధంగా వేధించాలని ప్రయత్నిస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. శుక్రవారం నాడు ఢిల్లీలోని తిహార్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ములాఖత్ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ…

ఏ రాష్ట్రమైన, దేశమైన ఆదాయాన్ని పెంచుకోవడానకి రకరకాల పాలసీలు చేస్తుంటాయని, ఆ క్రమంలో ఆదాయం పెంచుకోవడం కోసం ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీ తీసుకొచ్చిందని, ఆ పాలసీల అమలులో పాల్గొన్న ప్రతి ఒక్కరు నేరస్తులవుతే కేంద్ర ప్రభుత్వం కూడా నేరం చేసినట్లు అవుతుంది కదా అని అడిగారు. “కేంద్రం రైతులకు సంబంధించి మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చింది. ఆరు నెలల తర్వాత ఉపసంహరించుకున్నారు. మరి ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి ప్రయోజనాల కోసం ఆ చట్టాలను తీసుకొచ్చారు ? మోదీని అరెస్టు చేయాలి కదా ?” అని ప్రశ్నించారు. నిర్దోషిగా నిందితులే నిరూపించుకోవాలని, అంత వరకు జైలులో పెట్టవచ్చన్న పీఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 50లో ఉన్న చిన్న నిబంధను అడ్డంపెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులను గొంతు నొక్కే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు.

“టెర్రసిస్టులకు ఆర్థిక వనరులు చేరడం, డ్రగ్స్ రవాణాకు నిధుల వినయోగం, దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలించే చర్యలకు పీఎంఎల్ఏ చట్టం వర్తిస్తుంది.” అని అన్నారు. ఈ కేసులో ఎక్కడా డబ్బు దొరకలేదని గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న రూ. 100 కోట్లు ఎక్కడ అని అడిగారు. డబ్బు స్వాధీనం చేసుకోకుండా వ్యక్తిని ఎళా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అలాంటప్పుడు కేసుకు పీఎంఎల్ఏ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. అంచం డిమాండ్ చేసినట్లు కూడా ఈ కేసులో లేనప్పుడు అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తింపజేశారని అడిగారు. సహనిందుల నుంచి, అప్రూవర్ల నుంచి బలవంతంగా వాంగ్మూళాలను తీసుకొని కవితను నిందితులుగా చేశారని అన్నారు. అన్ని వ్యవస్థలను తన నియంత్రణలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని అన్నారు.

ఇది కూడా చదవండి

కేసులో ఇతరులను ఇరికివ్వడానికి వాళ్ల పేర్లను చెప్పాలని, వీళ్ల పేర్లను చెప్పాలని దర్యాప్తు సంస్థలు ఒత్తిడి చేసినట్లు కవిత తమకు చెప్పారని వెల్లడించారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఛగన్ భుజబల్, ప్రఫుల్ పటేల్ వంటి వారిపై ఉన్న కేసులు ఎందుకు ముందుకు సాగలేదని ప్రశ్నించారు. బీజేపీలో చేరిన వారి కేసులు ముందుకు సాగబోవడం లేదని, బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తని వారో వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కోర్టులను కూడా భయపెట్టిస్తున్నదని ఆరోపణ చేశారు.

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ… కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇలాంటి కేసులతో బెదిరిస్తారనుకుంటే అది బీజేపీ భ్రమనే అవుతుందని స్పష్టం చేశారు. కవిత గారు ధైర్యంగా ఉన్నారని, ఇలాంటి కేసులను అదిరేది, బెదిరేది లేదని తేల్చిచెప్పారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై , ఫాసిస్టు విధానాలపై ఇంకా గట్టిగా పోరాడుదామని కవిత గారు అన్నారని వెల్లడించారు. న్యాయపరంగా కేసులను ఎదర్కొంటామని ప్రకటించారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించామని, తప్పకుండా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

దేశంలో ఫాసిస్టు, దుర్మార్గమైన ప్రభుత్వం ఉందని, దళితులు, రైతులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళల సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడని బీజేపీ పార్టీ… ప్రతిపక్ష నాయకులపై సీబీఐ, ఈడీ దాడులతో భయపెట్టి లొంగదీసుకొన నయా నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింటుందని, ఈ ఎన్నికల్లో బీజేపికి 200-220 సీట్లు మించబోదని, రాబోయేది సంకీర్ణ యుగమని అన్నారు. ప్రతిపక్ష పార్టీల గొంతులు నొక్కి, కేసులు పెట్టి రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ భావించిందని, అదే వాళ్లకు నష్టం జగరబోతుందని అన్నారు. కేసులను ఎదర్కొంటూ, ఎంతటి నిర్భందాన్ని అయినా భరిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం నిబలడుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X