హైదరాబాద్ : ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజు కొనసాగుతున్నది. ఈ దీక్ష హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరుగుతుంది. బుధవారం ఉదయం దీక్షా శిబిరంలో వివిధ దిన పత్రికలు జాగృతి అధ్యక్షురాలు చదివినారు.



వెలుగుమట్ల బాధితులతో కలిసి సోమవారం ఖమ్మం జెడ్పీ సెంటర్ లో భారీ ఆందోళన చేసిన కవిత, డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తదితరులు. అదే రోజు కవిత సహా పలువురి అరెస్టు. 41 సీ ఆర్ పీసీ నోటీసులు ఇచ్చి విడుదల చేసిన పోలీసులు. అనంతరం ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన జాగృతి అధ్యక్షురాలు.


Also Read-
మంగళవారం ఉదయం కవిత సహా దీక్ష చేస్తున్న నాయకుల అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. అప్పటినుంచి హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కల్వకుంట్ల కవిత.
