क्रोधित प्रेमी ने आधी रात को प्रेमिका के परिवार पर किया तलवार से हमला, युवती के माता-पिता की मौत और…

हैदराबाद: तेलंगाना के वरंगल जिले के चंद्ररावपेट मंडल के पदहारूचिंताला तांडा में पति-पत्नी की निर्मम हत्या कर दी गई। एक युवक ने एक ही परिवार के दोनों की बेरहमी से हत्या कर दी। गुस्से में युवक ने बाहर सो रहे छह लोगों पर तलवार से हमला कर दिया। उसने यह दावा करते हुए अपनी प्रेमिका पर अंधाधुंध हमला किया कि उसे उससे छीन लिया गया है। इस घटना में लड़की के माता-पिता की जान चली गई।

पुलिस और स्थानीय लोगों के अनुसार, चंद्ररावपेट मंडल के गिरनीबाई गांव निवासी नागराजू और पदहारुचिंताला तांडा की एक युवती को प्यार हो गया। युवती के बुजुर्ग लोग उनकी शादी के लिए राजी नहीं हुए। इसके चलते दोनों घर से भाग शादी कर ली। वे घर से दूर चले गए और तीन महीने तक साथ रहे। इसी बीच लड़की के माता-पिता बानोतु श्रीनिवास-सुगुना ने नागराजू के खिलाफ पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। शिकायत में कहा गया कि नागराजू उनकी बेटी को जबरन ले गया।

इसके बाद युवती समेत नागराजू की पहचान कर थाने में पंचायत करायी गयी। बड़े-बुजुर्गों की मौजूदगी में समझौता होने पर युवक और युवती अपने-अपने घर चले गये। फिर भी क्रोधित नागाराजू ने बानोथु श्रीनिवास और सुगना उसकी प्रेमिका को अलग करने का आरोप गया। उसने पूरे परिवार को खत्म करने की योजना बनाई।

बुधवार आधी रात के बाद युवती के घर गया और सो रहे परिवार के सदस्यों पर तलवार से हमला किया। हमले में श्रीनिवास की मौके पर ही मौत हो गई, जबकि सुगना ने अस्पताल में दम तोड़ा। इस हमले में गंभीर रूप से युवती और उसके भाई का इलाज जारी है। गांव में दोनों की हत्या से मातम छा गया है। खबर है कि आरोपी नागराजू को गिरफ्तार किया गया। मगर पुलिस ने इसकी आधिकारिक घोषणा नहीं की है।

यह भी पढ़ें-

ప్రేయసి తల్లిదండ్రుల దారుణ హత్య

హైదరాబాద్‌ : తెలంగాణలోని వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలం పదహారు చింతల తండాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ కత్తి పడగ విప్పింది. ఓ కుటుంబంలోని ఇద్దర్ని బలి తీసుకుంది. ప్రేమోన్మాది రెచ్చిపోయి ఆరు బయట నిద్రిస్తున్న కుటుంబంపై తల్వార్‌తో దాడి చేశాడు. ప్రేయసిని తనకు దూరం చేశారని కక్ష పెంచుకొని విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోగా.. ప్రేమించిన అమ్మాయితో పాటు ఆమె తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే… చంద్రరావుపేట మండలం గిర్నిబాయికి చెందిన నాగరాజు, పదహారు చింతల తండాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవటంతో ఇంట్లో నుంచి పారిపోయారు. ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయి ఓ మూడు నెలల పాటు సహజీవనం చేశారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్, సుగుణ పోలీసు స్టేషన్‌లో నాగరాజుపై ఫిర్యాదు చేశారు. నాగరాజు తమ కూతుర్ని బలవంతంగా తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ తర్వాత నాగరాజుతో పాటు యువతిని గుర్తించి పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ పెట్టారు. పెద్దల సమక్షంలో కాంప్రమైజ్ కావటంతో ఎవరింటికి వారు వెళ్లిపోయారు. తాను ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని బానోతు శ్రీనివాస్, సుగణలపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని అంతమెుందించాలని ఫ్లాన్ వేశాడు. అదును చూసి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత యువతి ఇంటికి వెళ్లాడు. ఆరు బయట నిద్రిస్తున్న అమ్మాయి తల్లిదండ్రులపై విచక్షణారహితంగా తల్వార్‌తో దాడి చేశాడు. అడ్డొచ్చిన అమ్మాయి, ఆమె తమ్ముడిపై కూడా దాడికి పాల్పడ్డాడు. యువతి కుటుంబం గాఢ నిద్రలోఉండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనలో బానోతు సుగణ తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

శ్రీనివాస్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా.. స్థానికులు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ కూడా చనిపోయాడు. యువతితో పాటు ఆమె తమ్ముడు మదన్ (18) తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు నాగరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవటం, పిల్లలిద్దరూ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరటంతో తండాలో విషాదం అలుముకుంది. మృతుల బంధువుల కన్నీరు మున్నీరుగా విలపించటం అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X