రవీంద్ర భారతిలో ఘనంగా 144 వ హెలెన్ కిల్లర్ జయంతి వేడుకలు, మంత్రి సీతక్క మాట్లాడుతూ…

దేశంలోనే మొదటిసారిగా హెలెన్ కిల్లర్ విగ్రహావిష్కరణ

ముఖ్య అతిధులుగా పంచాయితి రాజ్, శిశు, మహిళా సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క, శాఖా సెక్రటరి వాకాటి కరుణ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ము త్తి నేని వీరయ్య

హైదరాబాద్ : మలక్ పేట్ వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హెలెన్ కిల్లర్ విగ్రహ ఆవిష్కరణ చేయటం జరిగిందీ. రవీంద్ర భారతిలో హెలెన్ కిల్లర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ శాఖ సీతక్కకి ఘన స్వాగతం పలికారు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ము త్తి నేని వీరయ్య మంత్రి సీతక్కని శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ హెలెన్ కిల్లర్ పుట్టిన రోజు అంటే సమస్త వికలాంగులు& మానవతా వాదుల పుట్టిన రోజు అన్నారు. గత ప్రభుత్వం వికలాంగులను పూర్తీగా విస్మరించి ఓక కోటి రూపాయలు మాత్రమే బడ్జెట్ ఇస్తే నేటి ప్రభుత్వం 75 కోట్ల బడ్జెట్ ఇచ్చింది అన్నారు. వికలాంగులను బాధ్యతగా చూడలేని వారు, వికలాంగులను స్వార్థ ప్రయోజనాల కోసమే వాడుకునే వారు నిజమైన వికలాంగులు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చాక ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నిన్ననే వికకంగులకి ఉన్నత విద్య లో 5% రిజర్వేషన్, 5Years వయస్సు సడలింపు ఇచ్చామని అన్నారు. ఈ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కి కట్టుబడి ఉందని అన్నీ సంక్షేమ పథకాలు లో 5%, ఉద్యోగాలలో 4%రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పారు.

यह भी पढ़ें-

వికలాంగులకు కోసం ప్రత్యేకంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు వికలాంగుల పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన వెబ్సైట్ ను విడుదల చేసిన అనంతరం వివిధ రంగాలలో ప్రతిభ చూపిన వికలాంగుల కి మెమొంటులోలు ఇచ్చి హెలెన్ కిల్లర్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి వికలాంగులకు తినిపించారు. ఈ సందర్భంగా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ము త్తినేని వీరయ్య ను శాలువాతో సత్కరించారు.

వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ CMగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల్లోనే వికలాంగ సోదరి రజినీకి ఉద్యోగం ఇచ్చారని, కోర్టు ఉద్యోగాలలో వికలాంగులకు 4%రిజర్వేషన్ ఇచ్చారని గత ప్రభుత్వము హయాంలో సదరం స్లాట్ కి వికలాంగులు చాలా ఇబ్బందులు పడే వారని కానీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని సదరం స్లాట్ నీ సులభతరం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకి పెద్దన్న లెక్క నిలబడ్డాడు అన్నారు.

రాబోయే కాలంలో త్వరలోనే వికలాంగులకు సంబంధించి అన్నీ సంక్షేమ కార్యక్రమాలు అధ్బుతంగా జరుగుతాయని,వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో ను సంపూర్ణంగా అమలు పరుస్తామని తెలియజేశారు. ఈ ప్రభుత్వం వికలాంగులకు సంక్షేమమే ధ్యేయంగా పనీ చెసే ప్రభుత్వము అన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ సెక్రటరి వాకాటి కరుణ, డైరెక్టర్ శైలజ, వికలాంగ సంఘాల నాయకులు, వివిధ రంగాలలో ప్రతిభ ఉన్న వికలాంగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X