BJP: రేపు ఖమ్మంలో జరగాల్సిన బహిరంగ సభను వాయిదా, ఇది కారణం

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు…

రేపు ఖమ్మంలో జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేశాం. గుజరాత్, మహారాష్ట్రలో భారీ ఎత్తున వర్షాలు వస్తుండటంతో బహిరంగ సభను వాయిదా వేశాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 24 గంటలపాటు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నందున అనివార్య కారణాలవల్ల బహిరంగ సభకు రాలేకపోతున్నారు.

ఎన్డీఆర్ఎఫ్ దళాలను ఇప్పటికే తుఫాన్ బాధిత ప్రాంతాలకు పంపారు. రైళ్లన్నీ రద్దు చేశారు. దాదాపు 50 వేల మందిని ఆ ప్రాంతాల నుండి తరలించారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని రేపటి పరిస్థితిని అంచనా వేశాం. ఈ విపత్కర సమయంలో బహిరంగ సభ నిర్వహించడం సముచితం కాదనే నిర్ణయానికి వచ్చాయం.

వాస్తవానికి బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. పార్టీ సీనియర్ నేతలంతా అక్కడే మకాం వేశారు. పెద్ద ఎత్తున జనం వచ్చేందుకు సిద్ధమని తెలిపారు. అతి త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించడం ఖాయం. కార్యకర్తలెవరూ నిరాశ పడొద్దు. ప్రజలను కలవండి. అతి త్వరలోనే ఖమ్మంలోనే బహిరంగ సభ నిర్వహిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X