BJYM ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి

యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఊరుకోం, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తాం

సెవెళ్ళ మహేందర్ (Bjym రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ)

హైదరాబాద్ : 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి BJYM రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ పిలుపునిచ్చిన సందర్భంగా భారీ ఎత్తున బీజేవైఎం నాయకులు కార్యకర్తలతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సెవెళ్ళ మహేందర్ మాట్లాడుతూ తెలంగాణాలో మార్పు రావాలి అంటే- కాంగ్రెస్ రావాలని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ కమిషన్లు తింటున్నాడు అన్ని పేర్కొనడం జరిగింది. గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ(HCU)కి సంబంధించిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని వెంటనే నిలిపివేయాలని BJYM డిమాండ్ చేస్తుంది అన్ని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ భవనాలకు సొంతంగా కట్టించే దమ్ము లేదు కానీ ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ ఢిల్లీకి సూట్ కేసులు మోయడానికి మాత్రం రేవంత్ రెడ్డి గారు ముందుంటారు అన్ని పేర్కొన్నారు.

ముల్కీ రూల్స్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీని కేటాయించడం జరిగింది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2300 ఎకరాల స్థలాన్ని యూనివర్సిటీకి కేటాయిస్తే ఆనాడు రాళ్లు గుట్టలు చెట్లు జంతువులతో ఉన్నటువంటి స్థలం దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే ప్రఖ్యాతి కలిగిన యూనివర్సిటీగా ఈ దేశంలో టాప్ ఫోర్త్ ర్యాంక్ యూనివర్సిటీగా పేరు పొందింది HCU తెలంగాణకే తలమానికం అలాంటి యూనివర్సిటీ స్థలాన్ని వేలం వేసి వెంచర్ చేసి రియల్ ఎస్టేట్ మాఫియా కు కట్టబెట్టాలని ఆ తద్వారా ఆదాయం పొందాలని రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను బీజేవైఎం ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు అసెంబ్లీ ముట్టడి చేసినటువంటి బిజెపి యువమోర్చా నాయకులను పిడుగులు బుద్ధి అనేక పోలీస్ స్టేషన్లో తిప్పుతూ అరెస్టు చేయడం సిగ్గుచేటు.

గతంలో TRS సర్కార్ యూనివర్సిటీ స్థలాన్ని కట్టబెట్టడం రోడ్డు వేయడం లాంటి కార్యక్రమాలు చేసింది ఈనాడు అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి వచ్చి ఫుట్బాల్ ఆడి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాన్ని చూసి ఈరోజు కబ్జా చేయడానికి పన్నాగం పండుతున్నాడు దీన్ని ముమ్మాటికి బిజెపి వ్యతిరేకిస్తుంది. రాష్ట్రంలో యూనివర్సిటీలను వసతులను గాలికి వదిలేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంచే నడుస్తున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలను భూములను కొల్లగట్టేయత్నాన్ని ముమ్మాటికి ఎండగడుతాం అన్ని పేర్కొనడం జరిగింది. Hcu లోపల 220 రకాల పక్షులు 400కు పైన జింకలు 300 కు పైన నెమళ్లు కుందేళ్లు ఇతర వనమూలికలు ఉన్నాయి వాటి అన్నింటితో పాటు న్యాచురల్ గా ఏర్పడినటువంటి మష్రూమ్ రాక్ పీకాక్ లేక్ బఫెలో లేక్ వంటి చెరువులు పొల్యూట్ చేసి లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా పిలవబడుతున్న నేచర్ ను దెబ్బతీసే కుట్ర రేవంత్ సర్కార్ చేస్తుంది అన్ని తక్షణమే తన నిర్ణయానికి వీనికి తీసుకోవాలి అన్ని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోనాలు చేసి యూనివర్సిటీ భూములను కాపాడుకుంటాం అన్ని పేర్కొన్నారు.

Also Read-

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్, చిత్తరంజన్, కుమార్ యాదవ్, తరుణ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గణేష్, సామల పవన్, రాష్ట్ర కార్యదర్శులు ప్రవీణ్, అశోక్, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి అరవింద్, అనిత రెడ్డి, అధికార ప్రతినిధులు శివచంద్రగిరి, కుశాల్ గౌడ్, కోమలి నాయక్, ఇంద్రాప్రియాంక,గోవర్ధన్, రాఘవేందర్, జిల్లా అధ్యక్షులు భరత్, ప్రధాన కార్యదర్శులు అవినాష్, ఆయుష్, శ్రవణ్ రాఘవేందర్ సునీల్ కుమార్, గణేష్, బిట్టు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X