Apsara Murder Case: अप्सरा हत्याकांड में एक और अपडेट, पुजारी ने यह बात भी बताई

हैदराबाद: सरूर नगर की युवती अप्सरा की निर्मम हत्या मामले में पुलिस ने जांच तेज कर दी है। आरोपी साईकृष्णा को हिरासत में लेकर पिछले कुछ दिनों से पूछताछ कर रही है। पुलिस ने पुजारी साईकृष्णा को आज दो दिन की हिरासत पूरी करने के बाद शनिवार को अदालत में पेश किया। अदालत उसे रिमांड पर जेल भेजे जाने की संभावना है।

इसी क्रम में हिरासत के तहत पुलिस ने साईकृष्णा से हत्या से जुड़े मामले के बारे में पूछताछ की। साथ ही, शमशाबाद के उस इलाके में ले गई जहाँ उसने अप्सरा की हत्या की थी। इसके बाद उसे सरूरनगर के मैनहोल के पास लेकर गई जहां शव को फेंका गया और मिट्टी से ढक दिया गया था। इस दौरान साईकृष्ण कार में ही बैठा रहा। पुलिस मात्र मामले को सीन-टू-सीन रिकन्स्ट्रशन किया। इस मौके पर पुलिस ने कई अहम सबूत जुटाए।

साईकृष्णा ने पुलिस को बताया कि उसने ही अप्सरा की हत्या की क्योंकि वह शादी करने के लिए दबाव डाल रही थी। अप्सरा के उत्पीड़न को सहन नहीं कर सका। उसने पुलिस को यह भी बताया कि अगर उसके साथ शादी नहीं की, तो उसकी इज्जत को बाजार में खींचेगी। अप्सरा की इस इरादे से हत्या की कि अगर उसके विवाहेतर संबंध के बारे में खुलासा किया तो उसकी प्रतिष्ठा मिट्टी में मिल जाएगी। साईकृष्णा ने पुलिस को बताया कि योजना के अनुसार ही उसने अप्सरा की हत्या कर दी और मैनहोल में फेंक दिया।

पुलिस ने पाया कि साईकृष्णा ने 15 दिन पहले ही हत्या की योजना बनाकर शव को ढकने के लिए बंगारू मैसम्मा मंदिर के पीछे अस्पताल के पास 20 फीट का गड्ढा भी खोदा। लेकिन जब अस्पताल के स्टाफ ने पूछा कि गड्ढा क्यों खोदा जा रहा है तो फिर से उसने गड्ढे को मिट्टी से बुझा दिया। पुलिस जल्द ही कस्टडी रिपोर्ट कोर्ट में पेश करने की संभावना है।

संबंधित खबर:

ఆప్సర హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్, కస్టడీలో కీలక విషయాలు బయటపెట్టిన పూజారి

హైదరాబాద్: సరూర్ నగర్ యువతి అప్సర దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తోన్నారు. నిందితుడు సాయికృష్ణను కస్టడీలోకి తీసుకుని గత కొద్దిరోజులుగా ప్రశ్నిస్తున్నారు. నేటితో రెండు రోజుల కస్టడీ పూర్తి కావడంతో పూజారి సాయికృష్ణను శనివారం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అతడిని రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించే అవకాశముంది.

అయితే కస్టడీలో భాగంగా హత్యకు సంబంధించిన విషయాల గురించి సాయికృష్ణను పోలీసులు ఆరా తీశారు. అలాగే హత్య చేసిన శంషాబాద్ పరిధిలో ప్రాంతంతో పాటు అప్సరను చంపేసిన తర్వాత సరూర్‌నగర్‌లోని ఒక మ్యాన్‌హోల్‌లో మృతదేహాన్ని పడేసి మట్టి కప్పేసిన స్థలానికి కూడా తీసుకెళ్లారు. అక్కడ సాయికృష్ణ కారులో కూర్చోని ఉండగా పోలీసులు సీన్ టు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ సందర్భంగా పలు కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు.

కస్టడీలో భాగంగా పెళ్లి చేసుకోవాల్సిందిగా అప్సర చేస్తున్న వేధింపులు భరించలేకనే హత్య చేసినట్లు సాయి తెలిపాడు.పెళ్లి చేసుకోకపోతే తన పరువును బజారుకు ఈడుస్తానని బెదిరించినట్లు చెప్పాడు. ఆమె వివాహేతర సంబంధం గురించి బయటపెడితే తన ప్రతిష్ట దెబ్బతింటుందనే ఉద్దేశంతో అప్సరను హత్య చేసినట్లు చెప్పుకొచ్చాడు. పథకం ప్రకారమే అప్సరను హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేసినట్లు సాయికృష్ణ కస్టడీలో పోలీసులకు చెప్పాడు.

15 రోజుల ముందుగానే హత్యకు ప్లాన్ చేయగా మృతదేహాన్ని కప్పి పెట్టేందుకు బంగారు మైసమ్మ గుడి వెనుక ఉన్న హాస్పిటల్ వద్ద 20 అడుగుల గుంత తీయించాడు. కానీ గుంత ఎందుకు తీస్తున్నారని ఆస్పత్రి సిబ్బంది ప్రశ్నించడంతో ఆ గుంతను మళ్లీ పూడ్చివేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కస్టడీ రిపోర్టును త్వరలో కోర్టుకు సమర్పించనున్నారు.

అప్సర హత్య కేసు రాష్ట్రంలో కలకలం రేపింది. ఏపీకి చెందిన పూజారి సాయికృష్ణ కుటుంబం కొద్ది సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడింది. సాయికృష్ణకు భార్య, కుమారుడు ఉన్నాడు. స్థానికంగా ఉన్న బంగారు మైసమ్మ గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడు. చెన్నైకు చెందిన అప్సర సినిమా అవకాశాల కోసం తన తల్లితో కలిసి ఏడాది కిందట హైదరాబాద్ వచ్చింది. సరూర్‌నగర్‌లోని ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది.

అప్సర అప్పుడప్పుడు గుడికి వెళుతూ ఉండేది. ఈ సమయంలో పూజారి సాయికృష్ణతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కలిసి కారులో బయట తిరుగుతుండేవారు. చివరికి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా సాయికృష్ణను అప్సర ప్రశ్నించడం మొదలుపెట్టింది. దీంతో ఆమెను అడ్డు తొలగించుకునేందుకు సాయికృష్ణ హత్యకు పాల్పడ్డాడు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X