हैदराबाद : देश में माओवादियों को खत्म करने के लिए केंद्र की तरफ से तय की गई डेडलाइन कुछ ही दिनों में खत्म हो जाएगी। इसी क्रम में माओवादियों को एक और बड़ा झटका लगा है। झारखंड के सिंहभूम जिले के किरीभूम पुलिस स्टेशन की सीमा में गुरुवार को हुए एनकाउंटर में 10 माओवादी मारे गए।
ओडिशा और झारखंड के माओवादी प्रभावित इलाकों के साथ-साथ छत्तीसगढ़-तेलंगाना बॉर्डर इलाके में भी गहन कॉम्बिंग के कारण इलाके में माओवादियों का मूवमेंट लगभग कम हो गया है। दूसरी ओर, छत्तीसगढ़ में दंडकारण्यम इलाके पर सुरक्षा बलों ने पहले ही कब्जा कर लिया है। हालांकि, माओवादी सेंट्रल कमेटी में कई टॉप लीडर अभी बुजुर्ग हो चुके हैं। सुरक्षा बलों ने छत्तीसगढ़ के जंगली इलाकों समेत बॉर्डर वाले राज्यों में कॉम्बिंग तेज कर दी है और उन्हें अपना टारगेट बनाया है। केंद्र तय लक्ष्य को पाने की दिशा में कदम बढ़ा रहा है।

गौरतलब है कि केंद्र सरकार इस साल 31 मार्च तक देश से माओवादियों को पूरी तरह खत्म करने के मकसद से ऑपरेशन कगार चला रही है। इसके साथ ही देश के माओवाद प्रभावित राज्यों में कॉम्बिंग तेज कर दी गई है। इसी के तहत हाल ही में छत्तीसगढ़ में हुए कई एनकाउंटर में सैकड़ों माओवादी मारे गए हैं। कुछ ने सरकार के सामने सरेंडर भी किया है। खास बात यह है कि इनमें बड़े नेता भी शामिल हैं।
यह भी पढ़ें-
భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టుల మృతి
హైదరాబాద్ : దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం విధించిన గడువు మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. జార్ఖండ్ సింగ్భూమ్ జిల్లాలోని కిరిభూమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మరణించారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఒడిశా, జార్ఖండ్లతో పాటు ఛత్తీస్గఢ్ – తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఇప్పటికే కూంబింగ్ను తీవ్ర తరం చేయడంతో ఆ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం దాదాపుగా తగ్గిపోయింది. మరోవైపు ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం ప్రాంతాన్ని ఇప్పటికే భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీలో ఉన్న పలువురు అగ్రనేతలు వయో భారంతో ఉన్నారు. వారే లక్ష్యంగా ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం సహా సరిహద్దు రాష్ట్రాల్లో కూంబింగ్ను తీవ్రతరం చేశాయి భద్రతా బలగాలు. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది.
ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో దేశంలో మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల్లో కూంబింగ్ తీవ్రతరం చేసింది. అందులో భాగంగా ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో వందాలది మంది మావోయిస్టులు మరణించారు. మరికొందరు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. వారిలో అగ్రనేతలు సైతం ఉండటం గమనార్హం. (ఏజెన్సీలు)
