टीम इंडिया के खिलाड़ियों ने जुबली हिल्स पेद्दम्मातल्ली के किये दर्शन, माता से मांगा यह वरदान

हैदराबाद: टीम इंडिया के खिलाड़ी तिलक वर्मा और नीतीश कुमार रेड्डी ने दशहरे के मौके पर जुबली हिल्स पेद्दम्मा तल्ली के दर्शन किये। बांग्लादेश के खिलाफ टी20 मैच के लिए हैदराबाद आए इन भारतीय खिलाड़ियों ने शनिवार को पेद्दम्मातल्ली मंदिर में विशेष पूजा की। वहीं टीम इंडिया और बांग्लादेश के बीच तीसरा और आखिरी टी20 मैच हैदराबाद के उप्पल स्टेडियम में शाम 7 बजे से खेला जाएगा। इस मैच के लिए सभी तैयारियां पूरी कर ली गई हैं।

हालाँकि भारत पहले ही सीरीज़ 2-0 से जीत चुका है, लेकिन दोनों टीमें अधिक सतर्क होंगी क्योंकि यह आखिरी मैच भी महत्वपूर्ण है। सीरीज जीत चुकी टीम इंडिया आखिरी मैच भी जीतकर सीरीज 3-0 से खत्म करने को बेताब है. दूसरी ओर, पहले ही दो मैच हार चुकी बांग्लादेश इस मैच में अपना सम्मान बचाने के लिए कड़ा संघर्ष करना चाहेगी। टीम के प्रमुख खिलाड़ी अपनी क्षमता दिखाने और जीत के लिए कड़ी मेहनत कर रहे हैं।

इसी क्रम में मौसम विभाग ने हैदराबाद में बारिश होने की चेतावनी जारी की है। इसके चलते मैच को लेकर संदेह व्यक्त किया जा रहा है। शुक्रवार को भी बारिश हुई थी, इसके चलते खिलाड़ियों को अभ्यास करने में दिक्कतें पैदा हुई थी।

यह भी पढ़ें-

పెద్దమ్మతల్లిని దర్శించుకున్న టీమిండియా ప్లేయర్లు

హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని టీమిండియా ప్లేయర్లు తిలక్ వర్మ, నితీ ష్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన భారత ప్లేయర్లు శనివారం పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు టీమిండియా మరియు బంగ్లాదేశ్ మధ్య మూడో మరియు చివరి టీ20 మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సిరీస్‌ ఇప్పటికే భారత్ 2-0 తో గెలిచినప్పటికీ, ఈ చివరి మ్యాచ్‌కు కూడా ప్రాధాన్యత ఉండటంతో ఇరు జట్లు మరింత జాగ్రత్తగా బరిలోకి దిగనున్నాయి. సిరీస్ గెలిచిన భారత్, చివరి మ్యాచ్‌లో కూడా విజయాన్ని సాధించి సిరీస్‌ను 3-0తో ముగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు, ఇప్పటికే రెండు మ్యాచ్‌లను కోల్పోయిన బంగ్లాదేశ్ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ మ్యాచ్‌లో కఠినంగా పోరాడాలని చూస్తోంది. జట్టులోని కీలక ఆటగాళ్లు తమ శక్తిసామర్థ్యాలను చూపించి, విజయం సాధించాలని కసరత్తు చేస్తున్నారు.

హైదరాబాద్ లో వర్షం పడే ఛాన్స్

ఉప్పల్ స్టేడియంలో భారత్, బాంగ్లాదేశ్ మధ్య టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 7గంటలకు స్టార్ట్ కానున్న ఈ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది హెచ్.సీ.ఏ అయితే.. ఈ మ్యాచ్ కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు కురుస్తుండటం, ఇవాళ వాతావరణం మేఘావృతమై ఉండటంతో మ్యాచ్ పై అనుమానాలు నెలకొన్నాయి.

వర్షం కారణంగా శుక్రవారం కూడా బాంగ్లాదేశ్ టీం ప్రాక్టీస్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో బంగ్లా ప్లేయర్లు నెట్స్ కే పరిమితమయ్యారు. వర్షం కురిసే సూచనలున్న క్రమంలో పిచ్ ని, గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పేశారు స్టేడియం సిబ్బంది. మరి, శనివారం అక్కడక్కడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో భారత్ – బంగ్లా జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

కాగా.. ఈ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రత నడుమ భారీ ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. స్టేడియం చుట్టూ ప్రత్యేకంగా పార్కింగ్ సదూపాయలు ఏర్పాటు చేసింది.1400ల మంది పోలీస్ లు, ఆక్టోపస్, షీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ లతో పటిష్ట పహారా, 380 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసింది హెచ్.సీ.ఏ. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X