T20 World Cup 2024 : सबकी धड़कने तेज, कमेंटेटर की घोषणा- कम दिलवाले न देखें मैच, आखिर 30 गेंदों पर 30 रन का सफर

हैदराबाद : टी20 वर्ल्ड कप 2024 का खिताब जीतने के लिए साउथ अफ्रीका को आखिरी 36 गेंदों पर 54 रन चाहिए थे। भारतीय कप्तान रोहित शर्मा ने अपने भरोसेमंद गेंदबाज अक्षर पटेल को बॉलिंग दी। पूरे टूर्नामेंट में कमाल कर रहे अक्षर ने ओवर में 24 रन खर्च कर दिए। यहां से साउथ अफ्रीका को आखिरी 5 ओवर यानी 30 गेंदों पर वर्ल्ड चैंपियन बनने के लिए सिर्फ 30 रनों की दरकार थी। हेनरिच क्लासेन के साथ डेविड मिलर क्रीज पर थे। टीम के 6 विकेट बचे हुए थे। यहां से कमबैक करते हुए भारत ने खिताब जीत लिया। जानिए आखिरी 5 ओवर में क्या क्या हुआ। कमेंटेटर सिद्धु ने मैच के दौरान चेतावनी दी कि कम दिल वाले मैच न देंखे। इससे अंदाजा लगाया जा सकता है कि मैच कितना रोमांचक मोड़ पर पहुंच चुका था।

16वां ओवर

रोहित शर्मा को मजबूरी में जसप्रीत बुमराह को 16वां ओवर देना पड़ा। उनके आते ही साउथ अफ्रीकी बल्लेबाज बैकफुट पर चले गए। उन्होंने अटैक करने की जगह विकेट बचाने पर फोकस कियाा। यही वजह रही कि 22 गेंद पर फिफ्टी लगाने वाले क्लासेन दो डॉट बॉल खेल गए। इस ओवर में सिर्फ चार रन बने।

​17वां ओवर

हार्दिक पंड्या ने अपनी पहली ही गेंद पर हेनरिच क्लासेन को आउट कर दिया। इसने साउथ अफ्रीका को को दबाव में ला दिया। इसके मिलर का साथ निभाने मार्को यानसेन आए। हार्दिक के इस ओवर में डेविड मिलर और यानसेन ने चार रन भागकर लिए। अब मार्करम की टीम को 18 गेंद पर 22 रन चाहिए थे।

​18वां ओवर

दो ओवर बाकी होने के बाद भी रोहित शर्मा ने बुमराह को 18वां ओवर दिया। उन्होंने दो डॉट बॉल खेलने के बाद मिलर सिंगल ले पाए। फिर बुमराह ने यानसेन को बोल्ड कर दिया। केशव महाराज ने एक गेंद डॉट खेलने के बाद आखिरी गेंद पर सिंगल लिया। यहीं साउथ अफ्रीका से गलती हो गई।

​19वां ओवर

किसी भी टी20 मैच में 19वां ओवर सबसे महत्वपूर्ण होता है। रोहित अर्शदीप सिंह को लेकर आए। स्ट्राइक पर केशव महाराज थे। वह पहली दो गेंद डॉट खेल गए। फिर एक रन लिया। मिलर ने फिर डबल और सिंगल भागा। महाराज आखिरी गेंद पर कुछ नहीं कर पाए। इस ओवर में चार रन बने और साउथ अफ्रीका के लिए टारगेट एक ओवर में 16 रन का हो गया।

​20वां ओवर

हार्दिक के सामने डेविड मिलर थे और साउथ अफ्रीका को 16 रन चाहिए थे। पहली ही गेंद पर मिलर आउट हो गए। फुलटॉस गेंद पर सूर्यकुमार यादव ने लॉन्ग ऑफ पर बेहतरीन कैच लिया। फिर क्रीज पर आए रबाडा के बल्ले का किनारा लेकर अगली गेंद चौके के लिए चली गई। अगली दो गेंद पर बाई और लेग बाई से एक-एक रन बने। (एजेंसियां)

यह भी पढ़ें-

T20 World Cup Final: 30 బంతుల్లో 30 పరుగులు…

హైదరాబాద్ : తొలిసారి వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన సౌతాఫ్రికా ఒక వైపు వరుసగా రెండుసార్లు ఐసీసీ ఫైనల్లో ఓడి మూడోసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉన్న టీమిండియా మరోవైపు. కోహ్లి, అక్షర్ పటేల్ రాణించడంతో దక్షిణాఫ్రికా ముంగిట 177 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది భారత్. క్లాసేన్ విజృంభణతో 15 ఓవర్లు ముగిసే సరికే 147/4తో విజయానికి చేరువైంది సౌతాఫ్రికా. 15వ ఓవర్లో 24 పరుగులు పిండుకున్న దక్షిణాఫ్రికా మరో 5 ఓవర్లలో 30 రన్స్ చేస్తే చాలు తొలిసారి వరల్డ్ కప్ గెలిచే అవకాశం. కానీ ఈ దశలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. చూస్తున్నది కలా నిజమా అనేలా అర్ధరాత్రి పూట టీవీల ముందు అతుక్కుపోయిన కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ప్రదర్శనతో జట్టును గెలిపించారు.

అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో 24 పరుగులు ఇవ్వడంతో కాదు కాదు క్లాసేన్ రాబట్టుకోవడంతో బుమ్రాను బరిలోకి దింపక తప్పలేదు రోహిత్ శర్మకు. కెప్టెన్ అంచనాలను నిలబెడుతూ కట్టుదిట్టంగా బౌలింగ్ బౌలింగ్ చేసిన బుమ్రా ఆ ఓవర్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్ బాల్ మిల్లర్ సింగిల్ తీయగా తర్వాతి బాల్ టూ రన్స్ తీసిన క్లాసేన్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత వరుసగా రెండు డాట్ బాల్స్ వేసిన బుమ్రా ఐదో బంతికి సింగిల్ ఇవ్వగా ఆరో బంతికి కూడా పరుగులేమీ రాలేదు. ఆ తర్వాతి ఓవర్ బౌలింగ్‌కు దిగిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తెలివిగా ఆఫ్ స్టంప్‌కు దూరంగా బంతిని వేసి తొలి బంతికే క్లాసేన్‌ను ఔట్ చేశాడు. దీంతో టీమిండియాకు బిగ్ బ్రేక్ లభించింది. అయితే అప్పటికీ మిల్లర్‌కు తోడుగా జాన్‌సెన్ క్రీజ్‌లో ఉండటం, 23 బంతుల్లో 26 పరుగులే చేయాల్సి ఉండటంతో సౌతాఫ్రికా విజయంపై ధీమాతో ఉంది. క్లాసేన్‌ను ఔట్ చేశాక రెండో బంతిని డాట్ బాల్ వేసిన హార్దిక్ చివరి 4 బంతుల్లో 4 సింగిల్స్ ఇచ్చాడు.

దీంతో 18 బంతుల్లో 22 పరుగులుగా సమీకరణం మారింది. 18వ ఓవర్ బౌలింగ్‌కు దిగిన బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మిల్లర్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. మూడో బంతికి మిల్లర్ సింగిల్ తీయగా తర్వాతి బాల్‌కు జాన్‌సెన్ బౌల్డయ్యాడు. దీంతో భారత సంతతికి చెందిన కేశవ్ మహారాజ్ క్రీజ్‌‌లోకి వచ్చాడు. ఐదో బంతిని బుమ్రా డాట్ బాల్ వేయగా చివరి బంతికి మహారాజ్ సింగిల్ తీయగలిగాడు. బుమ్రా రెండు పరుగులే ఇచ్చి వికెట్ తీయడంతో చివరి రెండు ఓవర్లలో సౌతాఫ్రికా విజయానికి 20 పరుగులు అవసరం అయ్యాయి. 19 ఓవర్ బౌలింగ్ చేసే బాధ్యతను అర్షదీప్ సింగ్‌‌కు అప్పగించాడు రోహిత్ శర్మ. ఆ ఓవర్లో అర్షదీప్ 0, 0, 1, 2, 1, 0 చొప్పున 4 పరుగులే ఇవ్వడంతో చివరి ఓవర్లో సౌతాఫ్రికా లక్ష్యం 16 రన్స్‌గా మారింది.

కానీ మిల్లర్ స్ట్రైక్‌లో ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్ వేసేందుకు సిద్ధమైన హార్దిక్ పాండ్య అటు డేంజరస్ మిల్లర్ స్ట్రయికింగ్‌లో ఉండటంతో తనను తాను ప్రశాంతంగా ఉంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. తొలి బంతిని వికెట్లకు దూరంగా తక్కువ ఎత్తులో ఫుల్ టాస్ వేశాడు. బంతిని బలంగా బాదిన మిల్లర్ సిక్స్‌గా మలిచే ప్రయత్నం చేశాడు. కానీ బౌండరీ లైన్ దగ్గర సూర్య అద్భుతమే చేశాడు. క్యాచ్ అందుకొని తనను తాను నియంత్రించుకోలేని స్థితిలో బంతిని గాల్లోకి విసిరిన సూర్య బౌండరీ లైన్ దాటాడు. మళ్లీ వెంటనే బౌండరీ లైన్ లోపలికి వచ్చి క్యాచ్ అందుకున్నాడు. నమ్మశక్యం కాని రీతిలో సూర్య క్యాచ్ పట్టడంతో మిల్లర్ పెవిలియన్ చేరాడు.

మిల్లర్ ఔట్ కావడంతో భారత ఆటగాళ్లు, అభిమానుల్లో గెలుపు ధీమా కనిపించింది. కానీ తర్వాతి బంతి రబాడ బ్యాట్ అంచును తాకుతూ థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ లైన్‌ను చేరుకుంది. ఆ తర్వాత సన్నని చిరు జల్లు మొదలైంది. తర్వాతి రెండు బంతులకు రెండు పరుగులు రాగా ఐదో బంతిని పాండ్య వైడ్ వేశాడు. చివరి రెండు బంతుల్లో 9 పరుగులు ఓ సిక్స్, ఓ ఫోర్ కొడితే సౌతాఫ్రికా గెలిచే ఛాన్స్. దీంతో సిక్స్ కొట్టడం కోసం రబాడ బంతిని గాల్లోకి లేపగా మళ్లీ సూర్య క్యాచ్ పట్టాడు. అంతే సంబరాలు మొదలైపోయాయి. చివరి బంతికి నోకియా సింగిల్ మాత్రమే తీయగా 7 పరుగుల తేడాతో గెలిచిన భారత్ 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో భావోద్వేగంతో ఆటగాళ్లతోపాటు అభిమానులు కంటతడిపెట్టారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X