రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు కేసిఆర్ గారి మానస పుత్రికలు: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

పేద పిల్లలకు ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్య అందాలనేది ఆయన ఆశయం

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు హైదరాబాద్ లో జరుగుతున్న “హైదరాబాద్ బుక్ ఫెయిర్” ఎగ్జిబిషన్ లో 38వ నంబర్ స్టాల్ లో తాము రచించిన పుస్తకాలను సందర్శనార్థం ఉంచారు. అది తెలిసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి… నవలా రచన చేసిన 12 మంది విద్యార్థినిలను తన అధికారిక నివాసంలో మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారు రాసిన పుస్తకాలు చూసి వారి ప్రతిభను మెచ్చుకున్నారు.

రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు కేసిఆర్ గారి మానస పుత్రికలన్నారు. 1000 రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు నెలకొల్పారని అన్నారు. ఆడపిల్లలు చదువుకు ఇబ్బంది కాకూడదని ఇంటర్, డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు కొత్తగా నెలకొల్పారని విద్యార్థులతో చెప్పారు.

పేద పిల్లలకు ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్య అందాలనేది ఆయన ఆశయమని తెలిపారు. వారికి కాలేజీలో అందుతున్న విద్య, వసతిపై ఆరా తీశారు. భవిష్యత్ లో మరింత రాణించాలని వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినిల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించిన ఇంగ్లీష్ లెక్చరర్ సంధ్య దీప్తిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్బంగా మంత్రి ఇంట్లోనే విద్యార్థినులకు ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి రాజేశ్వర్ రావు,డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X