హైదరాబాద్: అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు మాట్లాడుతుంటే ప్రజలను తప్పుద్రోవ పట్టించాలని ఉద్ధేశంతో ప్రజాపాలనకు వస్తున్న ఆదరణ చూడలేక కొందరి ప్రజాప్రతినిధుల మాటలను వక్రీకరించి అసభ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ప్రజా ప్రతినిధులపై తప్పుడు ప్రచారాలు చేసే కార్యక్రమం జరుగుతుంది.అలాగే దళిత గిరిజన ఎమ్మెల్యేలను కలవానే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. అట్టి కార్యక్రమాలను చేపడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ ఏసిపికి ఫిర్యాదు చేసిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్.
Also Read-
ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఏసిపి మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల మీద సోషల్ మీడియాలో కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,తప్పుడు ప్రచారాలను వారిని గుర్తించి వారు కావాలని చేస్తున్నారా లేక ఏదైనా సంస్థలు చేస్తున్నాయా అనేది విచారణ చేస్తున్నాం.అలాగే రాబోయే రోజులో ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామని రాష్ట్ర పోలీసు పూర్తి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ ఏసిపి తెలిపారు.