తక్షణమే డీఎస్సీ వాయిదా వేయండి : బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు

హైదరాబాద్ : తెలంగాణలో డీఎస్సీ నిరుద్యోగులు రెండు నెలలు వాయిదా కోసం చేపడుతున్న ధర్నా న్యాయబద్దమైనదని బీఆర్ఎస్వీ తుంగ బాలు తెలిపారు.60 రోజుల్లో 3 రకాల పరీక్షలు, 120 పుస్తకాలు చదివి, 30 రోజులు పరీక్షలు రాయడం రోబోకు కూడా సాధ్యం కాదు.అలాంటిది గడిచిన 7 నెలల్లో ఎన్నికలు, ఉద్యోగాల కోసం ఉద్యమాలు మరియు వెనువెంటనే పరీక్షలు అనే సంకట స్థితిలో డీఎస్సీ నిరుద్యోగులు విపరీత మానసిక ఒత్తిడితో ఉన్నారు. మొన్నటికి మొన్న టెట్ వారం రోజులు, హాస్టల్ వెల్ఫేర్ వారం రోజులు పరీక్షలు నిర్వహించి ఇపుడు వెంటనే డీఎస్సీ పరీక్షలు అనడం ఎంత దారుణమని తుంగ బాలు ప్రభుత్వం అసహనం వ్యక్తం చేశారు. 

విద్యా వాలంటీర్లు పెట్టి వెంటనే డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు 2 నెలల ప్రిపరేషన్ సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డైమండ్ చేశారు.ప్రభుత్వ ఉద్యోగం అంటే దొడ్డి దారిలో సీఎం కావడం కాదని రేవంత్ రెడ్డికి చురకలంటించారు.కాంగ్రెస్ నాయకులకు ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యమాల అని ప్రశ్నించారు. 

सीएम रेवंत रेड्डी का पुतला जलाते हुए डीएससी उम्मीदवार

బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన గురుకుల జాబులకు ఉద్యోగాలునిచ్చి, పోస్టింగులు ఇవ్వలేదు. కానీ ఏదో ప్రపంచం మునిగిపోయే పరిస్థితి ఉంది అన్నట్లు డీఎస్సీ వారికి వెంటనే పరీక్షలు పెట్టడం చూస్తే, పరిపాలన నేర్వని పిల్లాడు (రేవంత్ రెడ్డి) ప్రపంచాన్ని ఏలినట్లు ఉందని తుంగ బాలు తూర్పార బట్టారు. ఇప్పటికైనా మేల్కొని రేవంత్ రెడ్డి డీఎస్సీ అభ్యర్థుల కోరిక మేర 2నెలలు వాయిదా వేసి మంచి ముఖ్యమంత్రి అనిపించుకో లేకుంటే తెలంగాణ పిచ్చి తుగ్లక్ లా చరిత్రలో నిలిచిపోతావని హెచ్చరించారు.

ఇది కూడ చదవండి-

డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థుల అరెస్ట్ లు, అక్రమ కేసులపై కేటీఆర్ ఆగ్రహం

కాంగ్రెస్ చేతకాని తనాన్ని ప్రశ్నించటమే వాళ్లు చేసిన నేరమా?

ముఖ్యమంత్రి గారు మీకు మోకా వస్తే…డీఎస్సీ అభ్యర్థులను ఇంత ధోకా చేస్తారా?

కాంగ్రెస్ ను భుజాన మోసిన సోకాల్డ్ మేధావులు ఇప్పడేమయ్యారు?

డీఎస్సీ వాయిదా, పోస్టుల పెంపు వెంటనే చేపట్టాలి. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని హెచ్చరిక.

డీఎస్సీ వాయిదా వేయాలంటూ, పోస్ట్ లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న అభ్యర్థుల పై అక్రమ కేసులు, నిర్భంధం, అరెస్ట్ చేయటాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అని చెప్పి ఇప్పుడు వారిని దగా చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి కేబినెట్ లోనే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని ఇచ్చిన మాట తొమ్మిది నెలలు కావస్తోన్న ఏమైదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా అని నిలదీశారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి మీరు కొలువుదీరితే సరిపోతుందా? యువతకు కొలువులు అక్కర్లేదా ? అని కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించారు. ఉస్మానియా విద్యార్థులన్నా…అక్కడ నిరసనలు తెలిపుతున్న అభ్యర్థులన్నా సీఎం కు ఎందుకంతా కోపమో చెప్పాలన్నారు.

గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా విద్యార్థులు అడ్డమీద కూలీల్లాంటి వారని… తిన్నది అరిగేదాకా అరిచే బీరు బిర్యానీ బ్యాచ్ అని బద్నాం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. సిద్ధాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని వారి అవహేళన చేసిన మీరే…అదే విద్యార్థులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారన్న సంగతి మర్చిపోవద్దన్నారు. అధికారంలోకి రాగానే నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చి… డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని… వందల మందిని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో ఉందా? అక్కడికి అన్ని బలగాలను తెచ్చి ఎందుకంతా నిర్భందాన్ని విధిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. మళ్లీ ఉస్మానియా లో ఉద్యమం నాటి పరిస్థితులను రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొస్తుందంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చేతకానితనాన్ని ప్రశ్నించడమే వాళ్లు చేసిన నేరమా? ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే పాపమా ? అని రేవంత్ సర్కార్ ను కేటీఆర్ నిలదీశారు.

ముఖ్యమంత్రిగా మీకు మోకా వస్తే.. డీఎస్సీ అభ్యర్ధులకు ఇంత ధోకా చేస్తారని ఊహించలేదన్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీ అని.. నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారు. ఇప్పుడు ప్రిపరేషన్ కు కూడా టైమ్ ఇవ్వకుండా.. వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడటం ఎంత వరకు కరెక్ట్ అన్నారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ డీఎస్సీ అభ్యర్థులు కోరుతుంటే వారి డిమాండ్ ను పరిశీలించటంలో ఎందుకింత మొండి వైఖరో చెప్పాలన్నారు. న్యాయమైన డిమాండ్లను ఆడబిడ్డలు అడిగినంత మాత్రాన అర్థరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా ? ఇదేనా మహిళలంటే.. ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు.. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామన్నారు. ఇప్పుడు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదు. నిరుద్యోగులంతా ఈ ప్రభుత్వం వైఖరిని గమనించాలని కోరారు. పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి.. పోరుబాట పట్టిన నిరుద్యోగులపై లేకపోవడంపై కాంగ్రెస్ సిగ్గుపడాలన్నారు.

సోకాల్డ్ మేధావులెక్కడ?

ఇన్నాళ్లు కాంగ్రెస్ సర్కార్ ను భుజాన మోసిన సోకాల్డ్ మేధావులు ఇప్పుడు ఎక్కడున్నారని… ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగబోయాయో చెప్పాలన్నారు. ఇప్పటికైనా డీఎస్సీ పరీక్షల వాయిదా, పోస్టుల పెంపు డిమాండ్లు నెరవేర్చాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు BRS జెండా వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరి ప్రదర్శిస్తే నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X