“యువతలో మార్పు మొదలైంది…బీజేపీ పతనం ప్రారంభమైంది”

బిజెపి వల్ల వైషమ్యాలు తప్పా…అభివృద్ది లేదని యువత గ్రహిస్తున్నది

కేసిఆర్ అభివృద్ది కోసం పని చేస్తుంటే…బీజేపీ విద్వేష, కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తోంది

ఒక్క ఓటు తక్కువైందని ప్రధాని పదవికి రాజీనామా చేసిన వాజ్ పాయ్ బిజెపి ఎక్కడ..?ఎమ్మెల్యేలను కొంటూ ప్రభుత్వాలను కూలుస్తున్న మోడీ,అమిత్ షా బీజేపీ ఎక్కడ..?

ఇప్పుడున్న బీజేపీ నేతలు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారు

పసుపు బోర్డు పేరుతో ఇక్కడి రైతులను మోసం చేశారు… మళ్లీ కర్ణాటక ఎన్నికల్లో అదే హామీ ఇచ్చి ఓట్లు అడిగారు

ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతూ,అన్ని రకాల ధరలు పెంచుతూ సామాన్యులను అరిగోస పెడుతున్నారు

కుకునూర్ గ్రామ యువకులు చూపిన ఈ చైతన్యం యువతలో రాబోతున్న మార్పుకు నాంది

నీచ,అవినీతి రాజకీయాలకు..అభివృద్ధి కి మధ్య జరిగే పోరాటంలో యువత అభివృద్ధి వైపే

స్వచ్ఛందంగా బిఆర్ఎస్ లో చేరాలనే యువత నిర్ణయం గొప్ప శుభపరిణామం

  • బిఆర్ఎస్ పార్టీలో చేరికల సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జనరంజకపాలన,అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి వెంట నడవడానికి నిర్ణయించుకొని వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన బీజేపీ,బిఎస్పీ పార్టీకి చెందిన పలువురు యువకులు స్వచ్చందంగా వచ్చి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీలో చేరిక సందర్భంగా వారి మనసులో మాట మంత్రితో పంచుకున్నారు..

“దేశం కోసం పనిచేస్తున్న బీజేపీ వైపు ఉందామని యువకులం అంతా గతంలో పని చేశామని కానీ ఇప్పుడు వాస్తవాలు గమనిస్తున్నామని,మా గ్రామంలో,బాల్కొండ నియోజకవర్గంలో కేసిఆర్ సర్, మీవల్లే అభివృద్ది జరిగింది. మాకు కేసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది చూసుకుంటూ..ఇంకా బీజేపీ వెంట తిరగడం మా అమ్మను మోసం చేసినట్టే అవుతుందని” రంజిత్ అనే యువకుడు భావోద్వేగంతో తెలిపాడు.

“కేసిఆర్ గారు మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవని,కేసిఆర్ గారు ప్రధాని అయితే దేశ వ్యాప్తంగా రైతు బంధు,రైతు భీమా,దళిత బంధు ఇస్తారు. దేశం అంతటా అభివృద్ది జరుగుతుంది. కేసిఆర్ గారికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రజలు మద్దతుగా వస్తున్నారు.” అని శరత్ అనే యువకుడు తన మనోగతాన్ని చెప్పాడు.

బీజేపీ వల్ల దేశానికి నష్టం జరుగుతుందని,వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి,అసత్యాలు మా లాంటి యువకులతో సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని యువకులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. ఇవన్నీ గమనించే అభివృద్ది చేసే బిఆర్ఎస్ వైపే ఉందామని నిర్ణయించుకొని స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ అవుతున్నామని వారు పేర్కొన్నారు.

అభివృద్ది కోసం తపన పడుతున్న యువకుల మాటలు,బిఆర్ఎస్ లో చేరాలనే వారి నిర్ణయం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. యువతలో మార్పు మొదలైంది..బీజేపీ పతనం ప్రారంభమైందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బిజెపి వల్ల దేశంలో వైషమ్యాలు తప్పా…అభివృద్ది లేదని మెల్లమెల్లగా యువత గ్రహిస్తున్నదని చెప్పారు. కేసిఆర్ అభివృద్ది కోసం పని చేస్తుంటే…బీజేపీ విద్వేష, కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కేసిఆర్ దార్శనికత వల్ల తెలంగాణ రాష్ట్రం కేవలం 8ఏళ్లలో అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగిందని గుర్తు చేశారు.

తలసరి ఆదాయం,తలసరి విద్యుత్ వినియోగం,వ్యవసాయం,సాగునీటిరంగం,విద్యా వైద్య రంగం,సంక్షేమం, ఇన్ఫ్రాస్ట్రక్చర్,ఐ.టి ఇలా ఏ రంగం చూసుకున్నా తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. యువ నాయకుడు,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్ వల్ల రాష్ట్రానికి వేలాది పరిశ్రమలు వచ్చాయని సుమారు 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. కేటిఆర్ గారి చొరవ వల్ల ఐ.టి ఎగుమతులు పెరిగాయని,నూతన ఆవిష్కరణలకు తెలంగాణ నేడు వేదికైందని తెలిపారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ నేతలు అభివృద్ధిలో సహకారం అందించకుండా మాటలు చెప్తూ..పైగా విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో నిమగ్నం అయ్యారని దుయ్యబట్టారు.

ఇప్పటి బీజేపీ నేతలకు కనీస రాజకీయ విలువలు లేవని,ఒకప్పటి బీజేపీ ఇప్పటి బీజేపీ కి నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. ఒక్క ఓటు తక్కువైందని ప్రధాని పదవికి రాజీనామా చేసిన వాజ్ పాయ్ బిజెపి ఎక్కడ..?ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలుస్తున్న మోడీ,అమిత్ షా బీజేపీ ఎక్కడ..?అంటూ మంత్రి నిలదీశారు. ఇప్పుడున్న బీజేపీ నేతలు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారనీ ఎన్ని అసత్యాలు, అబద్ధాలకైన తెగిస్తారని అన్నారు. యువత వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పసుపు బోర్డు ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరి నిజామాబాద్ రైతులను మోసం చేశారు…ఇప్పటి వరకు పసుపు బోర్డు ఊసే లేదని మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. మళ్లీ కర్ణాటక ఎన్నికల్లో అదే హామీ ఇచ్చి ఓట్లు అడిగారని తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం కానిది,కర్ణాటకలో ఎలా సాధ్యం అవుతుందని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ రైతులను వంచిస్తుందనెందుకు కర్ణాటక ఎన్నికల్లో ప్రకటించిన పసుపు బోర్డు హామీనే ఉదాహరణ అన్నారు.

ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతూ,అన్ని రకాల ధరలు పెంచుతూ సామాన్యులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ అసమర్థ ప్రధాని అని ఆయన వల్ల ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని తేల్చి చెప్పారు. పైగా తన కార్పొరేట్ మిత్రులకు ప్రభుత్వ ఆస్తులు దారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవడబ్బ సొమ్మని ప్రజల డబ్బులు ప్రైవేటు పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటిపై ప్రజలు, యువకులు గ్రామాల్లో చర్చ చేయాలని కోరారు. కేసిఆర్ ఏం చేస్తున్నారు.

బీజేపీ ఏం చేసింది అనేది చర్చ జరగాలన్నారు. బీజేపీ నిజస్వరూపం తెలుసుకొని కుకునూర్ గ్రామ యువకులు చూపిన ఈ చైతన్యం యువతలో రాబోతున్న మార్పుకు నాంది అని పేర్కొన్నారు.నీచ,అవినీతి రాజకీయాలకు..అభివృద్ధి కి మధ్య జరిగే పోరాటంలో యువత అభివృద్ధి వైపే ఉంటామని,స్వచ్ఛందంగా బిఆర్ఎస్ లో చేరాలనే యువత నిర్ణయం గొప్ప శుభపరిణామమని మంత్రి వేముల పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో,ఆపదలో అండగా ఉంటానని మరోమారు స్పష్టం చేశారు.

బీజేపీ,బిఎస్పీ పార్టీల నుండి భారత రాష్ట్ర సమితిలో చేరిన వారిలో… ఎద్దండి రంజిత్,ర్యాడ ప్రణయ్,బక్కయ్యగారి వినేశ్,బాసర భరత్,ఒరగంటి వినయ్,మోర్తాడ్ గణేష్ ,మర్రి వినోద్,పుప్పాల సత్యనారాయణ,గోల్కొండ శరత్,దాసరి నితీష్,బి.శ్రీనివాస్ గౌడ్,పందేన శంకర్,మర్రి చిన్నారెడ్డి,సిరుప అజయ్,దాసరి సాయికిరణ్,బోజపల్లి శ్రీకర్,బండి ఉదయ్,బాలిశెట్టి సాగర్,బక్కయ్యగారి నితిన్,గోల్కొండ మల్లేష్,జి.అక్షయ్,ర్యాడా రాకేష్,కె.విజ్ఞేష్,పి.సుశాంత్ తదితరులు…

ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి,డాక్టర్ మధుశేఖర్, సురేష్ వైస్ ఎంపిపి,సర్పంచ్ లింబాద్రి,రాజశేఖర్ గౌడ్ ఎక్స్ సర్పంచ్,PACS డైరెక్టర్ అశోక్,ఎస్.సి మండల ప్రెసిడెంట్ తలారి ప్రభాకర్,మోర్తాడ్ నర్సయ్య,యువ నాయకులు నిమిష్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X