హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూమిని పరిశీలించడానికి వచ్చిన సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ మెంబర్ వినెయ్ లిమాయి గారిని కలిసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి,
సర్వే నెం 25, కంచ గచ్చిబౌలి గ్రామం, సెరిలింగంపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా (Acs 2,324-05 Gnts)లోని భూమి పూర్తిగా ప్రభుత్వ భూమి అని. రెవెన్యూ రికార్డుల ప్రకారం, కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నెం.25లోని భూమి “కంచ అస్తబల్ పోరంబోకే సర్కారీ” అంటే ప్రభుత్వ భూమిగా నమోదైంది.

1975లో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH)కి కంచ గచ్చిబౌలి గ్రామంలోని Sy No 25 మరియు ఇతర సర్వే నంబర్లలో ఉన్న మొత్తం భూమిని స్వాధీనం చేసుకున్నారు. పైన పేర్కొన్న భూమి అప్పుడూ అన్యాక్రాంతమైంది మరియు యాజమాన్యం UoHకి అనుకూలంగా బదిలీ చేయబడలేదు.
ఇది కూడ చదవండి-
రెవెన్యూ రికార్డు ప్రకారం మరియు అటవీ శాఖ ప్రకారం, Sy No 25లోని భూమిని “అటవీ”గా వర్గీకరించలేదని లిమాయి గారికి ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి రఘురాం రెడ్డి గారు మెమోరండం సమర్పించారు.
