హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే రిక్రియేషన్ గ్రౌండ్స్లో జాతీయ క్రీడా దినోత్సవం-2025 సందర్భంగా యువ జిమ్నాస్ట్ల ప్రత్యక్ష ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిమ్నాస్ట్ కోచ్ విజయ్కుమార్ ఆధ్వర్యంలో, రాష్ట్ర జిమ్నాస్ట్ కోచ్ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా దక్షిణ మధ్య రైల్వే క్రీడా సాధారణ కార్యదర్శి కోటేశ్వరరావు విచ్చేశారు. అలాగే స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీమతి జె. జె. శోభా కూడా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు, అధికారులు, క్రీడాకారులు ఈ వేడుకలో పాల్గొని కార్యక్రమాన్ని అభినందించారు.

Also Read-

యువ జిమ్నాస్ట్లు తమ ప్రతిభను వివిధ విన్యాసాల ద్వారా అద్భుతంగా ప్రదర్శించారు. ప్రేక్షకులందరూ వీరి ప్రదర్శనలను ప్రశంసించారు మరియు అభినందించారు.
