“మళ్ళీ కెసిఆర్ కావాలి… రావాలంటున్నారు… “

తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న జెండా గులాబీ జెండా..

కఎంత స్పీడ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో.. అంతే స్పీడ్ గా పడిపోయింది…

ప్రతి ఒక్కరి నోట… ప్రతి ఒక్కరి మాట కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అనే మాట నె..

రేవంత్ రెడ్డి పాలన ఆగం ఆగం… సగం.. సగం..

24 గంటల కరెంట్ కు, రైతు బందు కు, 2వెల పెన్షన్ కు, మిషన్ భగీరథ కు కెసిఆర్ బ్రాండ్ అంబాసిడర్…
ఓట్ ఫర్ నోట్ కు బూతులకు, లగచర్ల రైతులను జైల్లో పెట్టిన, హైడ్రా తో పేదోళ్ల ఇల్లు కూల్చిన, అడవులు నరికిన బ్రాండ్ అంబా సిడర్ రేవంత్ రెడ్డి…

ఎన్నికల ముందు వాగ్దానాలు.. ఎన్నికల తరవాత ఎగవెతల రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబా సిడర్.

అబద్దాల అంబాసిడర్ రేవంత్ రెడ్డి…

గులాబీ జెండా కు ఘన కీర్తి ఉన్న గడ్డ సిద్దిపేట..

25 ఏళ్ల కీర్తి సిద్దిపేట మట్టి బిడ్డలకే ఘనతే..

రజతొత్సవం మహా సభకు పెద్ద ఎత్తున తరలుదాం..

27న పల్లె పల్లె నా.. వార్డ్ వార్డ్ నా గులాబీ జెండా ఎగరాలి…

సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో సిద్దిపేట పట్టణ, చిన్నకోడూరు మండలం పార్టీ సమావేశ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

హైదరాబాద్ : 14 ఏళ్ల పోరాటం… ఉద్యమ పంథా చరిత్ర ఉన్న గులాబీ జెండా కు పురుడు పోసిన గడ్డ సిద్దిపేట అని సిద్దిపేట 25ఏళ్ల కీర్తి ఈ మట్టి బిడ్డలకె ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో 27 న జరిగే పార్టీ రజతోత్సవం సందర్బంగా జన సమీకరణ ఫై సిద్దిపేట పట్టణ, చిన్న కోడూరు మండల పార్టీ సమావేశం లో పాల్గొన్నారు.. 27న పెద్ద ఎత్తునా తరలాలి అని చెప్పారు. పల్లె పల్లె నా జెండా ఎగరవేయాలి.. పెద్ద ఎత్తున తరలాలి అని కోరారు..

తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న జెండా గులాబీ జెండా…

మళ్ళీ కెసిఆర్ కావాలి… రావాలి అంటున్నారు..

రైతు బందు, 2వెల పెన్షన్, మిషన్ భగీరథ, 24 గంటల కరెంట్, చెట్ల పెంపకం లో కెసిఆర్ బ్రాండ్ అంబాసిడర్..

తెలంగాణ ప్రజల గుండెల్లో ముమ్మాటికీ గులాబీ జెండా నె గుడి కట్టుకుంది అని హరీష్ రావు గారు అన్నారు.. కెసిఆర్ మళ్ళీ కావాలి రావాలి అని ప్రజలుకోరుకుంటున్నారన్నారు కెసిఆర్ హయాంలో పెట్టు బడులు వచ్చాయని తెలంగాణ ధనిక రాష్ట్రం గా ఆదర్శం గా నిలిచిందని చెప్పారు.. కెసిఆర్ తెలంగాణ జాతిపిత అని.. 24 గంటల కరెంట్ కు, 200 ఉన్న పెన్షన్ 2వేలు చేసిన, రైతు బందు ఇచ్చి, కాళేశ్వరం కట్టిన, 3వెల ఎకరాలు అడవులను కాపాడిన, మిషన్ భగీరథ తెచ్చిన కెసిఆర్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అని అన్నాడు… వచ్చేది మల్లి కెసిఆర్ బి ఆర్ ఎస్ ప్రభుత్వం అని చెప్పారు..

ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అంతే స్పీడ్ గా పడిపోయింది..

ఓట్ ఫర్ నోట్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి..

ఎన్నికల్లో వాగ్దానాలు, ఎన్నికల తరవాత ఎగవేతల రేవంత్ రెడ్డి..

చెట్లను పెట్టింది కెసిఆర్.. చెట్లను నరికింది రేవంత్ రెడ్డి..

హైడ్రా తో పేదోళ్ల జీవితాలు ధ్వంసం… మూగ జీవాల విధ్వంసం…

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి ఎంత స్పీడ్ గా వచ్చిందో.. ఎన్నికల తరవాత ఎగవేతల తో అంతే స్పీడ్ గా పడిపోయిందన్నారు.. నాది యంగ్ ఇండియా బ్రాండ్ అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి నువ్ ఎందులో బ్రాండ్ అంబాసిడర్ ప్రజలు చెప్పుతారు అని హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి ఫై మండిపడ్డారు.. ” నువ్ ఓట్ ఫర్ నోట్ కు బ్రాండ్ అంబా సిడర్, పేగులు మేడల వేసుకుంటా అనడం లో… బూతులు మాట్లాడడం లో.. లగ చెర్ల రైతు లను జైల్లో పెట్టడం లో హైడ్రా తో ఇల్లు కూర్చడం లో… అడవులను నరికేయడం లో.. రేవంత్ రెడ్డి అంబా సిడర్ అని ఏద్దేవా చేశారు.. పాలనా అంత ఆగం.. ఆగం.. సగం సగం అని, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణ మాఫీ సగం చేసాడు.. గ్యాస్ సిలెండర్ సగం మందికే.. ఉచిత కరెంట్ సగం సగం నె.. నాడు నొ ఎల్ ఆర్ ఎస్.. నొ బి ఆర్ ఎస్ అని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు మాట్లాడారు.. నేడు ఎల్ ఆర్ ఎస్ ను ముక్కు పిండి వసులు చేస్తున్నారు.. హోడింగ్స్ పెట్టి కట్టాలి అని ప్రజల మీద భారం వేస్తున్నారని మండిపడ్డారు.. బి ఆర్ ఎస్ చేస్తే తప్పు.. కాంగ్రెస్ చేస్తే ఒప్పా… రేవంత్ రెడ్డి ఉద్దెర మాటలు.. ఉల్టా పాలన..

బి ఆర్ ఎస్ వాళ్లు కాళ్ళ ల్లో కట్టే పెడుతున్నారు అని మాట్లాడుతుండు.. ఎందుకు మహిలలకు 2500 ఇస్తా అంటే నా.., 4వేల పెన్షన్ చేస్తా అంటె నా.. తులం బంగారం కెసిఆర్ కిట్ రైతు బందు 15000 ఇస్తా అని ఇవ్వకుంటే కట్టే పెట్టామా.. పాలన చేత కాక ఉద్దెర మాటలు మాట్లాడుతుండు అబద్దాలు మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి… కెసిఆర్ చెట్లకు ప్రాధాన్యత ఇస్తే రేవంత్ రెడ్డి చెట్లను నరికేస్తుండు.. Hcu లో 400ఎకరాలు చెట్లను నరికి వేసిండు.. కెసిఆర్ జంగిల్ కాపాడిండు.. రేవంత్ రెడ్డి జంగిల్ ను ధ్వంసం చేస్తుండు.. రామగుండం లో 3వేల ఎకరాలు కెసిఆర్ కాపాడితే నేడు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం కు అప్పగించి మీలాటరీ వాళ్లు అడవులను చదును చేస్తున్నారు… కెసిఆర్ చెట్లను పెడితే రేవంత్ రెడ్డి కెసిఆర్ నరికేస్తుండు.. హైడ్రా పెరితో పేదోళ్లు ఇల్లు ధ్వంసం చేసిండు.. మూగ జీవాలను విధ్వంసం చేసిండన్నారు.. కెసిఆర్ పెట్టిన బతుకమ్మ చీరలు బందు చేసిండు.. కెసిఆర్ కిట్ బందు చేసిండు.. అందుకే ప్రజల కెసిఆర్ మల్లి రావాలి కావాలి అని కోరుకుంటున్నారు అని అంటున్నారు..

Also Read-

నూకలు మిరే తినుండ్రి అన్న కేంద్ర మంత్రి పియుష్ గొయల్ నాటి మాటలు నేడు రేవంత్ రెడ్డి సన్న బియ్యం పేరుతో 40% నూకలు ఇచ్చి ప్రజల కు తినిపిస్తన్నాడు.. ప్రజలకు సన్న బియ్యం ఇస్థా అని మోసం చేసి సగం నూకలు ఇస్తున్నాడన్నాడు..

కొడంగల్ నుండి వెటర్నరీ కళాశాల తెచ్చుకునుడే…

సిద్దిపేట అభివృద్ధి ఫై కక్ష సాధింపు..

సిద్దిపేట అభివృద్ధి కక్ష సాధింపు ఫై అసెంబ్లీ లో మాట్లాడిన… నిధులు వచ్చే వరకు కొట్లాడుతా..

సిద్దిపేట నియోజకవర్గం లో 15 నెలలుగా అభివృద్ధి గ్రహణం పట్టిందని ఆగిపోయిన పనులు తెచ్చే వరకు నిద్ర పోను అని హరీష్ రావు అన్నారు.. సిద్దిపేట అభివృద్ధి పనులు ఆపడం ఫై అగ్రహం వ్యక్తం చేసారు.. సిద్దిపేట లో వెటర్నరీ కళాశాల మంజూరు అయితే కొండగల్ కి తరలించుక పోయారని మళ్ళీ ప్రభుత్వం రాదా.. వచ్చిన రోజు నె అదే కొడంగల్ నుండి మల్లి సిద్దిపేట కు వెటర్నరీ కళాశాల తెస్తాన్నారు.. సిద్దిపేట లో శిల్పా రామం, నర్సింగ్ కళాశాల.. పూర్తి దశకు వచ్చిన వెయ్యి పడకల హాస్పిటల్ లో క్యాన్సర్,గుండె కు సంబదించిన పనులు ఆపారు క్యాన్సల్ చేశారన్నారు.. మున్సిపల్ లో 20కోట్ల రోడ్డు పనులు అపారని చెప్పారు.. సిద్దిపేట మీద కక్ష సాదిస్తున్నారని ఎప్పటికైనా తిరిగి తగులుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X