గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు

హైదరాబాద్ : ఈ రోజు గాంధీభవన్లో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు ఆధ్వర్యంలో ఆషాడ మాసం బోనాల పండుగ అంగరంగ వైభవంగా గాంధీభవన్లో నిర్వహించడం జరిగింది. అన్ని జిల్లాల నుండి మహిళా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున గాంధీభవన్లో బోనాలు తయారుచేసి గాంధీభవన్ నుండి భూ లక్ష్మమ్మ గుడి వరకు పెద్ద డప్పు వాయిద్యాల మధ్య శివశతులతో ఎత్తున బోనాలు తీసుకెళ్లి బోనాలు సమర్పించి వడి బియ్యం పోయడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరు సుఖసంతోషాలతో పాడిపంటలతో అష్టైశ్వర్యాలు తులతూగాలని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని మహిళలకు తగిన ప్రాధాన్యత ఇస్తారని సునీత రావు అన్నారు.

Also Read-

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మహిళ చైర్మన్ లు బండ్రు శోభారాణి కల్వ సుజాత భవాని రెడ్డి ఇందిరా రావు మహిళా కాంగ్రెస్ ఇంచార్జి కోఆర్డినేటర్ నీలం పద్మ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సదాలక్ష్మి టిపిసిసి అధికార ప్రతినిధులు జిల్లా ప్రెసిడెం ట్స్ ఆర్ లక్ష్మి, జయమ్మ అనురాధ ఇందిరా ఎం లక్ష్మి వనిత జ్ఞానేశ్వరి సుజాత కవిత ఉషశ్రీ సుజాత శ్రీలత పెంట రజిత పుష్ప రెడ్డి, సుభాషిని శైలజ, శోభ జిలాని రమాదేవి కృపా రెడ్డి బ్లాక్ ప్రెసిడెంట్స్, మండల ప్రెసిడెంట్లు డివిజన్ ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లు విలేజి ప్రెసిడెంట్స్ మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X