हैदराबाद: तेलंगाना सरकार ने संविधान निर्माता डॉ बीआर अंबेडकर की 134वीं जयंती के अवसर पर सोमवार शाम को तेलंगाना भू भारती (भूमि अधिकार अभिलेख) अधिनियम-2024 को शुभारंभ करने का फैसला लिया है। मुख्यमंत्री रेवंत रेड्डी मौजूदा धरणी पोर्टल की जगह भू भारती पोर्टल – एक एकीकृत ऑनलाइन राजस्व अभिलेख प्रबंधन प्रणाली – का उद्घाटन करेंगे। इसी क्रम में मुख्यमंत्री ने लॉन्च की तैयारियों की निगरानी के लिए लगातार एक उच्च स्तरीय बैठक की।
सीएम ने अधिकारियों को पोर्टल को उपयोगकर्ता के अनुकूल और आम आदमी के लिए सुलभ बनाने का निर्देश दिया, ताकि इसे अगले 100 वर्षों तक बनाए रखा जा सके।संभावित साइबर हमलों से पोर्टल की सुरक्षा के लिए फायरवॉल सहित मजबूत साइबर सुरक्षा उपायों की आवश्यकता पर भी जोर दिया। पोर्टल के रखरखाव का काम एक विश्वसनीय संगठन को सौंपा जाएगा। भू भारती को शुरुआत में तीन मंडलों में पेश किया जाएगा। पोर्टल पर पंजीकरण, म्यूटेशन, अपील और संशोधन, आरओआर सुधार, गैर-कृषि भूमि में रूपांतरण और बहुत कुछ सहित सेवाएँ प्रदान की जाएँगी। यह ई-चालान, भार विवरण, निषिद्ध भूमि, भूमि अधिकार, भूमि बाजार मूल्य और पंजीकृत दस्तावेज़ विवरण के बारे में भी जानकारी प्रदान करेगा।
मुख्यमंत्री ने आगे कहा कि जैसा कि लोगों की सरकार ने वादा किया था, भू भारती पोर्टल के माध्यम से गुणवत्तापूर्ण सेवाएँ प्रदान करने के लिए एक नया रिकॉर्ड ऑफ़ राइट्स (आरओआर) अधिनियम बनाया गया है, जो कई मुद्दों की जड़ धरणी की जगह लेगा। किसान अब पंजीकरण और म्यूटेशन जैसी सेवाओं का उपयोग कर सकते हैं और मुझे यह कहते हुए खुशी हो रही है कि भू भारती लंबे समय से चली आ रही भूमि समस्याओं का स्थायी समाधान प्रदान करेगा।”
जैसे-जैसे सरकार धरणी पोर्टल को समाप्त कर रही है, उसने भूमि अभिलेखों का “फोरेंसिक ऑडिट” शुरू करने के प्रस्तावों को गति दी है। उच्च पदस्थ सूत्रों ने पुष्टि की है कि एक केंद्रीय सरकारी एजेंसी को ऑडिट करने का काम सौंपा जाएगा। हालाँकि धरणी को मूल रूप से भूमि लेनदेन को सुव्यवस्थित करने और पारदर्शिता बढ़ाने के लिए पेश किया गया था, लेकिन परिचालन संबंधी मुद्दों के कारण इसे व्यापक आलोचना का सामना करना पड़ा।
किसानों ने बताया कि धरणी आवेदन को मामूली कारणों से खारिज कर दिया गया, जैसे कि गलत मॉड्यूल का चयन करना और लेनदेन विफल होने के बाद रिफंड में देरी। भूमि अभिलेखों में ‘कब्जाधारी’ कॉलम को हटाने से और भी अव्यवस्था फैल गई, क्योंकि इससे पिछले मालिकों को भूमि पर दावा करने का मौका मिल गया, जिससे भूमि विवाद और मुकदमेबाजी बढ़ गई।
रविवार को राजस्व मंत्री पोंगुलेटी श्रीनिवास रेड्डी ने घोषणा की कि भू भारती को शुरू में तीन मंडलों – तिरुमालागिरी (नलगोंडा), सदाशिवपेट (मेदक) और कीसरा (रंगारेड्डी) में शुरू किया जाएगा और 2 जून को तेलंगाना स्थापना दिवस तक चरणबद्ध तरीके से पूरे राज्य में लागू किया जाएगा। सरकार शुरुआती कमियों से सीखने के लिए तैयार है और राज्यव्यापी रोलआउट से पहले उन्हें सुधारेगी। मंत्री यह भी ने कहा कि कांग्रेस ने धरणी पोर्टल को बंगाल की खाड़ी में फेंकने का वादा किया था और हमने भूमि सुधार लाकर उस वादे को पूरा किया है। धरणी को बंगाल की खाड़ी में फेंकने का मतलब है कि हम भूमि प्रशासन की दोषपूर्ण अवधारणा को त्याग रहे हैं।
मौजूदा भूमि रिकॉर्ड नए पोर्टल में दिखाई देंगे और सरकार लगभग चार साल के पहानी (भूमि स्वामित्व) विवरणों को एकीकृत करने के लिए काम कर रही है। नई प्रणाली धरणी की तुलना में कहीं अधिक मजबूत है और सरकार 2029 के विधानसभा चुनावों में भू भारती और संबंधित भूमि सुधार कानून पर जनमत संग्रह कराएगी। मई तक सभी 10,956 गांवों में ग्राम राजस्व अधिकारी (वीआरओ) तैनात कर दिए जाएंगे। वीआरओ का चयन अन्य विभागों से किया जाएगा। राजस्व विभाग में सर्वेक्षणकर्ताओं की संख्या 480 से बढ़ाकर 1,000 की जाएगी और 6,000 निजी सर्वेक्षणकर्ताओं को लाइसेंस दिया जाएगा और उन्हें उचित प्रशिक्षण दिया जाएगा।
ఇది కూడ చదవండి-
భూ భారతి పోర్టల్
హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం సాయంత్రం తెలంగాణ భూ భారతి (భూమి హక్కుల రికార్డు) చట్టం-2024ను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్న ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి పోర్టల్ – ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ రెవెన్యూ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ – ను ప్రారంభిస్తారు. ఈ క్రమంలో, ప్రయోగానికి సంబంధించిన సన్నాహాలను పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి నిరంతరం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఇదే క్రమంలో భూ భారతి వెబ్సైట్ను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టల్లో వాడే భాషకు సంబంధించిన ఫాంట్ అందరికీ అర్థమయ్యేలా.. ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని సూచించారు. ధరణి స్థానంలో తీసుకురానున్న భూభారతి చట్టం, పోర్టల్, లోగో విషయాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం.. శని, ఆదివారాల్లో జరిగిన సమీక్షల సందర్భంగా కీలక సూచనలు చేశారు. భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక నాణ్యమైన వనరులున్న సర్వర్ను వినియోగించాలని, ఏకకాలంలో కోటి మంది బ్రౌజ్ చేసినా.. సవ్యంగా పనిచేయాలని ఆదేశించారు. ‘‘అంతేకాదు.. సాంకేతికత, అవసరమైన బ్యాక్పను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం వివిధ రాష్ట్రాలు వినియోగిస్తున్న సాంకేతికతపై అధ్యయనం చేయాలి’’ అని పేర్కొన్నారు. సైబర్ దాడులను ధీటుగా ఎదుర్కొనేలా పోర్టల్ను సన్నద్ధం చేయాలన్నారు.
‘‘రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేనివాళ్లు.. సాంకేతికంగా కృత్రిమ మేధ(ఏఐ)ని వినియోగించి, పోర్టల్లో బగ్స్ని సృష్టించే ప్రమాదాలున్నాయి. అధికారులు కూడా సైబర్ సెక్యూరిటీపై దృష్టిసారించాలి. ఏఐని వినియోగించుకుని, సర్వర్కు, పోర్టల్కు భద్రత కల్పించాలి. ఏఐ సాయంతో ఎప్పటికప్పుడు సైబర్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించేలా నిఘా ఉంచాలి. పటిష్ఠమైన ఫైర్వాల్స్ను వినియోగించాలి. అవసరమైతే సైబర్క్రైమ్ విభాగం సహకారం తీసుకోవాలి. వందేళ్లు పనిచేసేలా పోర్టల్ ఉండాలి. పోర్టల్ రియల్-టైమ్ అనుభవంలో ఊహించని సమస్యలు తలెత్తే ప్రమాదముంది. అలాంటి సమస్యలు వచ్చిన వెంటనే సరిచేయగలగాలి. అందుకే.. ఈ పోర్టల్ నిర్వహణను విశ్వసనీయత ఉన్న సంస్థకు అప్పగించాలి’’ అని మార్గనిర్దేశనం చేశారు.
ధరణితో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను భూభారతి పోర్టల్ పరిష్కరించేలా ఉండాలన్నారు. ఇందుకోసం పోర్టల్ అందుబాటులోకి రాగానే.. ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు. ‘‘భూభారతి విషయంలో అలసత్వం వద్దు. అధికారులు, కలెక్టర్లు నిర్లక్ష్యం వహించినా.. ఏవైనా తప్పులు దొర్లినా ఉపేక్షించేది లేదు’’ అని సున్నితంగా హెచ్చరించారు. జిల్లాల కలెక్టర్లు ప్రతి మండలంలో భూభారతిపై అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. భూభారతి లోగోపైనా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిసారించారు.
గతంలో డిజైన్ అయిన పలు లోగోలను అధికారులు సీఎంకు చూపించారు. వాటన్నింటినీ ఆయన తిరస్కరిస్తూ.. లోగో విషయంలో కీలక సూచన చేశారు. ‘‘పంటలకు సంకేతంగా ఆకుపచ్చ రంగు.. సాగునీటికి సంకేతంగా నీలం రంగును వాడాలి. అందులో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిబింబించేలా లోగోను తీర్చిదిద్దాలి’’ అని అప్పట్లో ఆదేశించారు. ఆ మేరకు చూడముచ్చటైన లోగోను రూపొందించినట్లు తెలిసింది. భూభారతి పోర్టల్లో ‘తెలంగాణ రైజింగ్’ లోగోను కూడా అప్లోడ్ చేస్తారని సమాచారం. భూభారతితోపాటు.. హౌసింగ్, వేసవి నేపథ్యంలో తాగునీటిపై సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఎంసీఆర్హెచ్ఆర్డీలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు.
భూ భారతి చట్టం, దరఖాస్తు విధానం లేదా పోర్టల్కు సంబంధించి రైతులకు ఏవైనా సందేహాలు వ్యక్తమైతే.. వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాన్ని తీసుకురానుంది. ఏఐ చాట్బోట్ సాయంతో పనిచేసే ఈ వ్యవస్థకు ‘భూమిత్ర’ లేదా ‘భూరక్షక్’ అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. భూభారతిని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న మండలాల్లో ఈ చాట్బోట్ను అందుబాటులోకి తీసుకువస్తారని సమాచారం. దీని నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తారని, టోల్ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకువస్తారని తెలుస్తోంది.
సోమవారం ఆవిష్కరించే భూ భారతి పోర్టల్ను తొలుత మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. నల్లగొండ జిల్లాలోని సాగర్, తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లాలోని కీసర మండలాలను ఫైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టు సందర్భంగా గుర్తించే సమస్యలను అధ్యయనం చేసి, వాటిని పరిష్కరించిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా భూభారతిని అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(జూన్ 2) నుంచి పూర్తిస్థాయిలో భూభారతి చట్టం అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.
కాగా.. భూభారతి పోర్టల్ ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారానికి వ్యవసాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 566 రైతువేదికలలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి వివిధ రైతు వేదికల ద్వారా లక్షల మంది అన్నదాతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారని వ్యవసాయ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. (ఏజెన్సీలు)
