“అక్బరుద్దీన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు, నిజంగా నీవు ప్రజాప్రతినిధి అయితే స్వచ్ఛందంగా మీ కట్టడాలు మీరే కూల్చండి”

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతుూ…రాష్ట్రంలోని సమస్యలను పక్కదోవ పట్టించడానికి, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక హైడ్రా పేరుతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే సామాన్య ప్రజల మీద ప్రతాపం చూపించడం కాదు.. నిజంగా మీకు దమ్ము, ధైర్యం ఉంటే పాతబస్తీ చెరువుల కబ్జాల నుంచి విముక్తి చేయండని అడుగుతున్నా..?

కేవలం వారం, పది రోజుల్లోనే 49 ఎకరాలు రికవరీ చేసామని చెప్తున్నారు. రాష్ట్రంలోని లక్షల ఎకరాల్లో భూమి అన్యాక్రాంతం అయ్యిందని, కోట్ల బిల్డింగులు నిర్మాణం అయ్యాయని లెక్కలు చెప్తున్నారు. ఎప్పుడు రికవరీ చెస్తారో చెప్పాలి..? కొంతమంది టార్గెట్‌గా హైడ్రా పని చేస్తుందనే అనుమానం వస్తోంది. ఇంత హంగామా చేస్తున్న హైడ్రా అధికారులకు సల్కం చెరువులో ఉన్న ఓవైసీ భూములను కూల్చే దమ్ముందా.? ఆ అక్రమ కట్టడాలు కమీషనర్ గారికి కనిపిస్తలేవా..?

కమిషనర్‌కు కనిపించకుంటే నేను వచ్చి చూపిస్తా. మీ దగ్గర తగిన జేసీబీలు లేకుంటే నేనే పక్క రాష్ట్రం నుంచి తెప్పించి ఇస్తా. పాతబస్తీ చెరువుల కబ్జాల గురించి కమీషనర్ గారికి అవగాహన ఉందా..? పాతబస్తీ గుర్రం చెరువు, జల్ పల్లి చెరువు అక్రమ నిర్మాణాల వివరాలు ఉన్నాయా? పంపించలా? ఓల్డ్ సిటీలో ఇష్టానుసారంగా చెరువు గుట్టలను కబ్జా చేశారు. గత 20సంవత్సరాలుగా ప్రభుత్వాలు కళ్ళు మూసుకుంటే ఇష్టానుసారంగా భూములు, చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు.

Also Read-

హైడ్రాకు, రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీ నుంచి కూల్చివేతలు ప్రారంభించాలి. మీ బుల్డోజర్లకు పాతబస్తీ వెళ్లడానికి డీజీల్ లేదా..? గండిపేటలో ఎఫ్ టీ ఎల్ ఎంత..? జలమండలి లెక్కల ప్రకారం మ్యాపులో 1772 అడుగులు, మరొక్క మ్యాపులో 1790అడుగులని రెండు రకాల లెక్కలు పేర్కొంటున్నాయి. గడిచిన 20ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన అక్రమాలలో జరిగిన నిర్మాణాల మీద చర్యలు తీసుకుంటారా..?

అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకుంటారా,..? 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అయ్యప్ప సొసైటీ విషయంలో హైడ్రామా చేసింది. అదే మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పని చేస్తోందా.?? హైదారాబాద్ నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి..? ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో అన్యాక్రాంతం అయిన భూముల లెక్కపై శ్వేత పత్రం విడుదల చేయాలి. మీ దగ్గర లెక్క ఏమైనా ఉందా? ఎండోమెంట్ భూముల మీద దృష్టి పెట్టాలి. హైడ్రా కమీషనర్ రంగనాధ్‌ పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల పట్ల చర్యలేవీ?

నిజంగా రాష్ట్ర ప్రభుత్వాని చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ నగరంలో అన్యాక్రాంతం అయిన భూములపైన శ్వేతపత్రం విడుదల చేయాలి. జీఎచ్ఎంసీ పరిధిలోనే 185 చెరువులు ఉన్నట్టు, దాదాపు 300చెరువులు కబ్జాకు గురైనట్టు లెక్కలు చెప్తున్నాయి. 2022-23 ప్రభుత్వ లెక్కల ప్రకారం రాజధాని చెరువుల అక్రమణల్లో నేషనల్ గ్రిడ్ లో జరిగిన నివేదిక ప్రకారం హైదరాబాద్ లో అక్రమణకు గురైన 134చెరువుల మీద ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం 8,718 నిర్మాణాలు జరగ్గా, బఫర్ జోన్ పరిధిలో 5343 నిర్మాణాలు జరిగినట్టు అధికారులు నివేదిక ఇచ్చారు.

ఈ నివేదిక ప్రకారం మొత్తం 13వేల నిర్మాణాలను కూలగొట్టే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా..? రాష్ట్రంలోని 14లక్షల ఎకరాల అసైండ్ భూమి, 6లక్షల ఎకరాలు అటవీ భూమి, దేవాదాయ భూములు మొత్తం లక్షల ఎకరాల్లో అన్యాక్రాంతం అయ్యి ఇతరుల చెరలో ఉన్నాయి. ఆ భూములను స్వాధీనం చేసుకునే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా.? కూకట్ పల్లి మైసమ్మ చెరువు, బహదూర్ పుర లోని మేలారం చెరువు, జీడిమెట్ల చెరువు, నాచారం చెరువు, సరూర్ నగర్ పెద్ద చెరువు, రామాంతపూర్ చిన్న చెరువు ఇలా చాలా చెరువులు కబ్జాకు గురైనాయి.

కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం అయినాయి. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు. నిజంగా నీవు ప్రజాప్రతినిధి అయితే స్వచ్ఛందంగా మీ కట్టడాలు మీరే కూల్చండి. చెరువును కబ్జా చేసి ఒవైసీ కాలేజీని నిర్మించారని పేర్కొన్నారు. ఆ కాలేజీని కూల్చేస్తారా?. కావాలంటే వఖ్ఫ్ బోర్డులో భూములుంటే లీజుకు తీసుకొని కాలేజీలు కట్టుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X