CM KCR ఆదేశానుసారం రాష్ట్రంలో అద్దంలా ఆర్ అండ్ బి రోడ్లు ఉండాలి

రాష్ట్ర వ్యాప్తంగా పీరియాడికల్ రెన్యువల్ పనుల్లో వేగం పెంచాలి

కేసిఆర్ గారి ఆదేశాల మేరకు 45 రోజుల్లో రోడ్ రెన్యువల్ పనులు పూర్తి కావాలి

  • మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

సెక్రటేరియట్ : ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్లు అద్దంలా తయారవుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు సోమవారం నాడు డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ 5వ అంతస్థులోని ఆర్ అండ్ బి శాఖ కాన్ఫరెన్స్ హాల్లో ఆ శాఖపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నతాధికారులతో తన మొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆర్ అండ్ బి సెక్రెటరీ శ్రీనివాస రాజు,ఈఎన్సి రవీందర్ రావు,డి.సి దివాకర్,ఎస్.ఈ వసంత్ నాయక్ ఇతర ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాల వల్ల డ్యామేజ్ అయిన 1172 పీరియాడికల్ రెన్యువల్ రోడ్ల మరమ్మతుల పనుల కోసం 2858 కోట్లు ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ మంజూరు చేశారని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని వారు విధించిన నిర్ణీత గడువులోగా ప్రణాళిక ప్రకారం పనులు శరవేగంగా పూర్తి కావాలన్నారు.

ఇప్పటికే 518 కోట్లతో 1393 కి. మి పొడవు గల రోడ్ల మరమ్మతులు పూర్తి చేశామని,1,223 కోట్ల రూపాయల విలువగల 455 రోడ్ వర్క్స్ మొత్తం 2,700 కి. మీ వచ్చే 45 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు పనులు 60 వర్క్ ఏజెన్సీలు పని చేస్తున్నాయని,ప్రతీ ఏజన్సీతో క్షేత్ర స్థాయిలో సమీక్షించి నిర్ణీత గడువులోగా ప్రణాళిక ప్రకారం 45 రోజుల్లో అన్ని పనులు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ప్రతీవారం తానే స్వయంగా రోడ్ల వర్క్ ప్రోగ్రెస్ పరిశీలిస్తానని మంత్రి అధికారులతో అన్నారు.

ఈ సమీక్షలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X