हैदराबाद : तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी के सामने करीब 130 माओवादी ने शनिवार शाम को आत्मसमर्पण किया। तेलंगाना सरकार के आह्वान पर माओवादियों ने हिंसा का रास्ता छोड़कर मुख्यधारा में लौटने का फैसला किया। आत्मसमर्पण के दौरान इन माओवादियों ने कुल 124 हथियार और 5205 जिंदा कारतूस सुरक्षा बलों के सामने जमा किए। अधिकारियों के अनुसार हाल के वर्षों में पीएलजीए के हथियारों की गुणवत्ता और संख्या के लिहाज से यह सबसे बड़ी बरामदगी मानी जा रही है।
मुख्यमंत्री रेवंत रेड्डी की मौजूदगी में माओवादियों ने अपनी पीपुल्स लिबरेशन गोरिल्ला आर्मी (पीएलजीए) के साथ औपचारिक रूप से आत्मसमर्पण किया। इस दौरान कुल 134 हथियार और बड़ी मात्रा में जिंदा कारतूस सौंपे गए, जिनमें 31 एके-47 राइफलें भी शामिल हैं। एओबी क्षेत्र के प्रमुख नेता चलसानी नवाथा ने भी अपने साथियों के साथ हथियार डालकर आत्मसमर्पण किया। इस कदम को माओवादी संगठन के लिए बड़ा झटका माना जा रहा है, क्योंकि इससे उनकी लड़ाकू क्षमता पर असर पड़ा है और क्षेत्र में जारी नक्सली गतिविधियों को भी कमजोर करने में मदद मिलेगी।

सरकार की ओर से आत्मसमर्पण करने वाले माओवादी और जमा कराए गए हथियारों के लिए पुनर्वास योजना के तहत आर्थिक सहायता और अन्य सुविधाएं उपलब्ध कराई जाएंगी। इस दौरान माओवादियों ने कुल 124 हथियार, 222 मैगजीन और 5205 जिंदा कारतूस सुरक्षा बलों को सौंपे। बताया जा रहा है कि माओवादी का यह सामूहिक समर्पण मुख्यमंत्री की 21 अक्टूबर 2025 को की गई उस अपील के बाद हुआ, जिसमें उन्होंने माओवादियों से हिंसा का रास्ता छोड़कर मुख्यधारा में लौटने और राज्य व समाज के विकास में योगदान देने का आह्वान किया था।
इस अवसर पर आत्मसमर्पण करने वाले माओवादियों ने बताया कि उन्होंने यह फैसला अपने बेहतर भविष्य, परिवार की भलाई और व्यक्तिगत सम्मान को ध्यान में रखते हुए लिया है। वे अब शांतिपूर्ण और कानून का पालन करने वाला जीवन जीना चाहते हैं। तेलंगाना सरकार की पुनर्वास नीति के तहत आत्मसमर्पण करने वाले कैडरों को आर्थिक सहायता और अन्य जरूरी सुविधाएं उपलब्ध कराई जाएंगी।
तेलंगाना पुलिस के डीजीपी शिवधर रड्डी ने इस सफलता के लिए विशेष खुफिया शाखा की कड़ी मेहनत और रणनीति की सराहना की। अधिकारियों के मुताबिक इस आत्मसमर्पण से राज्य में पीएलजीए की लड़ाकू क्षमता काफी कमजोर हो गई है और लंबे समय से जारी नक्सली हिंसा पर भी बड़ा प्रभाव पड़ा है। बताया जा रहा है कि माओवादी की सबसे अहम इकाई पीपुल्स लिबरेशन गोरिल्ला आर्मी अब लगभग समाप्त हो चुकी है। इसे माओवादी आंदोलन के लिए बड़ा झटका माना जा रहा है।
गौरतलब है कि सुबह से ही यह खबरें मीडिया में प्रसारित और प्रकाशित हो चुके थे कि माओवादी के वरिष्ठ नेता मुप्पाला लक्ष्मणराव उर्फ गणपति अपने साथियों के साथ आत्मसमर्पण करने वाले हैं। तेलंगाना समाचार में भी इस खबर को प्रमुखता से प्रकाशित किया गया था। हालांकि, ऐसा कुछ भी नहीं हुआ है।
Also Read-
130 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు
హైదరాబాద్ : మావోయిస్టుల లొంగుబాటు అంశంలో తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏకంగా 130 మంది మావోయిస్టులు ఒకేసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట శనివారం లొంగిపోయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో తమ ఆయుధాలను అప్పగించారు. మరోవైపు లొంగిపోయిన మావోయిస్టులకు వారి కేడర్ ఆధారంగా ప్రభుత్వం రివార్డు అందించే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లొంగిపోయినవారికి ఎంతమేరకు నగదు బహుమతి లభించే అవకాశం ఉందో చూద్దాం.
తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఈ క్రమంలోనే శనివారం రోజున 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ ఆయుధాలను సరెండర్ చేశారు. తాజాగా లొంగిపోయినవారితో కలిపి ఇప్పటి వరకూ తెలంగాణలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వారి నుంచి 266 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు చెందిన ఏడుగురు మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేత గణపతి సహా అజ్ఞాతంలో ఉన్నవారు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల భద్రతతో పాటుగా ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పారు.
మరోవైపు లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి అందించనున్న సంగతి తెలిసిందే. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత.. వారు జీవించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించనుంది. తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం.. లొంగిపోయిన మావోయిస్టులకు వారి కేడర్ ఆధారంగా రివార్డు అందిస్తారు. డివిజనల్ కమిటీ సభ్యులు అయితే రూ.5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులు అయితే రూ.4 లక్షలు, మావోయిస్టు పార్టీ సభ్యులకు రూ.లక్ష నగదు బహుమతి అందిస్తారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయుధాలతో సహా లొంగిపోయేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందిస్తారు.
మరోవైపు శనివారం రోజున లొంగిపోయిన వారిలో స్టేట్ కమిటీకి చెందిన మావోయిస్టులు ముగ్గురు ఉన్నారు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 40మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. మరోవైపు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవటం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
గణపతి కూడా వీలైనంత త్వరగా లొంగిపోవాలని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులకు మెరుగైన పరిహారంతో పాటుగా ఆరోగ్య భద్రత, ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తామన్నారు.నగదు బహుమతిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని.. చట్టపరంగా ఎత్తివేసేందుకు అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఉదయం నుండి, సీనియర్ మావోయిస్టు నాయకుడు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి తన సహచరులతో కలిసి లొంగిపోబోతున్నారని మీడియాలో వార్తలు వ్యాపించాయి. ఈ వార్త తెలంగాణ సమాచార్లో కూడా ప్రముఖంగానే వచ్చింది. అయితే, అలాంటిదేమీ జరగలేదు. (ఏజెన్సీలు)
