हैदराबाद : चलती ट्रेन के शौचालय में नाबालिग (12) के साथ दुष्कर्म का मामला सामने आया है। खबर है कि ट्रेन में उसके साथ यात्रा कर रहे एक व्यक्ति ने उसके साथ दुष्कर्म किया। यह घटना रक्सेल-सिकंदराबाद सुपरफास्ट एक्सप्रेस में घटी है।
मिली जानकारी के अनुसार, नाबालिग अपने परिवार के साथ यात्रा कर रही थी। उसी ट्रेन में एक युवक भी यात्रा कर रहा था। आरोपी ने काफी देर तक नाबालिग का पीछा किया। इसी क्रम में जब वह शौचालय गई तो आरोपी ने ट्रेन के शौचालय में उसके पीछे गया और नाबालिग के साथ दुष्कर्म किया। फिलहाल आरोपी के खिलाफ मामला दर्ज कर लिया गया है। रेलवे पुलिस ने घटना की जानकारी दी।
खबर है कि यह घटना 3 अप्रैल की सुबह की है। उस समय पीड़िता अपने परिवार के सदस्यों के साथ ट्रेन में यात्रा कर रही थी। पुलिस ने बताया कि जब नाबालिग शौचालय गई तो आरोपी ने उसका पीछा किया और उसके साथ यौन उत्पीड़न किया। पीड़िता के शिकायत के आधार पर सिकंदराबाद रेलवे थाने में मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है।
కదులుతున్న రైలులో మైనర్ బాలికపై లైంగికదాడి
హైదరాబాద్ : తెలంగాణంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులో ఓ కామాంధుడు మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అర్దరాత్రి వాష్ రూమ్ కు వెళ్లిన అమ్మాయిని గమనించి ఆమె వెనకాలే వాష్ రూమ్ లోకి వెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాలికను లైంగికంగా వేధిస్తూ వీడియోలు తీశాడు. ఈ సంఘటన రక్సెల్–సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి రక్సెల్–సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్కు బయలు దేరాడు. అర్దరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆయన పెద్ద కుమార్తయిన మైనర్ బాలిక (12) వాష్ రూమ్ కి వెళ్లింది. ఆ సమయంలో ఆ బాలిక కుటుంబంతో పాటు బోగీలోని ఇతర ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. అదే బోగీలో తలుపు దగ్గర ఉన్న ఓ కామాంధుడు ఆ బాలిక వాష్ రూమ్ కి వెళ్తున్న క్రమంలో ఆమె నోరు నొక్కి వాష్ రూమ్లోకి తీసుకెళ్లి గడియ పెట్టాడు.
అనంతరం లైంగిక దాడి చేశాడు. విషయాన్ని బయట పెడితే చంపేస్తానంటూ ఆమెను బెదిరించి వదిలేశాడు. బాలిక వాష్ రూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. ఘటన జరిగిన తరువాత కూడా నిందితుడు అదే బోగీలో డోరు వద్ద నిలబడి ఉండగా బాలిక తండ్రి అతన్ని పట్టుకున్నాడు. సెల్ఫోన్ లాక్కొని పరిశీలించగా అందులో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ తీసిన వీడియోలు బయట పడ్డాయి. నిందితుడిని పట్టుకున్న బాలిక కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని రైలులోని టీసీకి, పోలీసులకు సైతం సమాచారం అందించారు.
అనంతరం రైల్వే టోల్ ఫ్రీ నంబరు 139 కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. గురువారం ఉదయం రైలు సికింద్రాబాద్ కు చేరుకున్నాక బాలిక తండ్రి సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన కేల్జార్ రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలో జరిగినట్లు బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. (ఏజెన్సీలు)