ఆదిలాబాద్ లో రైతులపై లాఠీచార్జి, తీవ్రంగా ఖండించిన కేటీఆర్

రైతన్నలపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి

రాష్ట్రంలో రైతన్నల పైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు అన్న కేటీఆర్

రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలని ముఖ్యమంత్రి కి సూచన

ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే

రాష్ట్రంలో రైతన్నల సమస్యల పైన ముఖ్యమంత్రి వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్

రైతన్నల పైన లాఠీ చార్జ్ చేసిన అధికారుల పైన కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్

రైతన్నలపైన ప్రభుత్వ దాడులు బిఆర్ఎస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించిన కేటీఆర్

హైదరాబాద్‌ : విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ అత్యంత దారుణం అన్న కేటీఆర్, ఇది రైతన్నలపైన ప్రభుత్వ దాడి అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో రాష్ట్ర వ్యవసాయాలను ముఖ్యంగా రైతన్నల పరిస్థితి పూర్తిగా దిగజారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలకు కావాల్సిన సాగునీటి నుంచి మొదలుకొని, రైతుబంధు పెట్టుబడి సహాయం వరకు, చివరికి కనీసం విత్తనాలు అందించలేని దుర్మార్గపూరిత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మార్పు తెస్తాం, ప్రజా పాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతన్నలపైన లాఠీఛార్జ్ పేరుతో దాడులు చేయడమే కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తామన్న మార్ప అని కేటీఆర్ ప్రశ్నించారు.

గత పది సంవత్సరాలుగా రాష్ట్ర రైతాంగం ఎలాంటి ఆందోళన పడకుండానే విత్తనాలు, ఎరువులు, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇలా తమకు కావాల్సిన అన్నింటిని సాఫీగా అందుకున్నదని, కేవలం 5 నెలల్లోనే పరిస్థితి పూర్తిగా తారుమార అయిందన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ పరిపాలన వైఫల్యం అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతన్నలు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది, మరోవైపు విత్తనాలు కూడా అందించలేని నిస్సహాయ స్థితికి చేరుకుందని కేటీఆర్ విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలపై చేసిన లాఠీ చార్జ్ పట్ల వెంటనే క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, వ్యవసాయ వ్యవసాయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ సందర్భంలో, ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం పేరిట, ఢిల్లీ పర్యటన పేరిట రైతాంగాన్ని పట్టించుకోకపోవడం పైన కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి రైతు సమస్యల పైన దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలో విత్తనాల కొరత, పంపిణీ, ప్రభుత్వ వైఫల్యంపైన వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతన్నల కష్టాలు తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈరోజు రైతన్నల పైన లాఠీ చార్జ్ చేసిన పోలీస్ అధికారుల పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి-

రైతన్నలపైన ప్రభుత్వం ఇలా లాఠీ చార్జీల పేరుతో దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని… రాష్ట్ర రైతన్నలకు అండగా ఉంటామని, అవసరమైతే పార్టీ తరఫున విస్తృతమైన నిరసనగా కార్యక్రమాలకు పిలుపునిస్తామని కేటీఆర్ ప్రభుత్వానికి హెచ్చరించారు.

రైతులపై లాఠీఛార్జ్ ను ఖండించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మరోవైపు ఆదిలాబాద్ లో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీఛార్జ్ ను ఒక ప్రకటనలో ఖండించిన మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ తెచ్చిన మార్పు లాఠీఛార్జేనా?ఆలాబాద్ లో పత్తి విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీఛార్జ్ చేయడం అమానుషం. పాలన గాలికి వదిలేసి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల ప్రచారానికి వెళ్తారా ఇదెక్కడి అమానుషం.

పత్తి విత్తనాలే కాదు .. ఎరువు కింద ఉపయోగించే జీలుగ విత్తనాల కోసం కూడా రైతులు ఆందోళనలు చేయాల్సి రావడం దురదృష్టకరం. జీలుగ విత్తనాలకే దిక్కులేదు .. ఇక అసలు విత్తనాలు ఇస్తారన్న నమ్మకం రైతులలో ఎలా కలిగిస్తారు. రైతులకు విత్తనాలు ఇవ్వలేని అసమర్ద కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వ అసమర్దత, నిర్లక్ష్యం కారణంగా మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చి రాష్ట్రంలో పాతరోజులు మళ్లీ తెచ్చింది .. విత్తనాలు, ఎరువుల కోసం ఈ మద్యకాలంలో మళ్లీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి .. తాజాగా లాఠీఛార్జీలు మొదలయ్యాయి.

రైతులు అడుగుతున్నది రేషన్ బియ్యం కాదు .. మనిషికి రెండు విత్తన ప్యాకెట్లు మాత్రమే ఇవ్వడానికి రైతులు అడుగుతున్నది పంట పండించడానికి కావాల్సిన విత్తనాలు. ఆరునెలలలో వ్యవసాయ తిరోగమనం మొదలయింది. ఒకవైపు అకాలవర్షాలు, ఈదురుగాలులు, పిడుగుపాటుకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని విడిచిపెట్టి కేరళ, పంజాబ్ లలో పర్యటిస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానిక విడిచిపెట్టి పంజాబ్ లో ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్రంలోని మంత్రులంతా రాయ్ బరేలీ ప్రచారానికి వెళ్తున్నారు. విత్తనాల కొరత గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. వానాకాలం సాగుకు సాగునీటి విడుదలపై ఇంతవరకు సమీక్ష లేదు.

రాష్ట్రంలో ప్రచారం ఫుల్లు .. పాలన నిల్లు అన్నట్లు సాగుతున్నది. వెంటనే రైతాంగానికి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి. ఏఏ జిల్లాలలో ఎంతెంత ఎరువులు, విత్తనాలు ఉన్నది శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆదిలాబాద్ లో రైతులపై లాఠీఛార్జ్ ను ఒక ప్రకటనలో ఖండించిన మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X