हैदराबाद : कर्नाटक में भीषण सड़क हादसा हुआ। हसन तालुका के मोसलीहोसहल्ली के पास गणेश विसर्जन जुलूस के दौरान एक तेज रफ्तार लॉरी श्रद्धालुओं पर से गुजर गई। इस हादसे में 8 लोगों की मौके पर ही मौत हो गई और 20 से अधिक लोग घायल हो गये।

Also Read-
सभी घायलों को नजदीकी अस्पताल में भर्ती किया गया। मरने वालों की संख्या बढ़ने की संभावनाएं व्यक्त की जा रही है। हसन-मैसूर हाई वे पर गणेश विसर्जन में शामिल सैकड़ों पर भक्तों पर लॉरी कुचलते हुए चली गई। पुलिस मामले की छानबीन कर रही है। हादसे का वीडियो सोशल मीडिया पर वायरल हो रही हैं, जो इस घटना की गंभीरता को दर्शाती हैं।

హైదరాబాద్ : కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హసన జిల్లా హొళెనరసీపుర తాలూకా మొసళె సహళ్లిలో జాతీయ రహదారిపై వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళుతున్న భక్తులపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయాలయ్యాయి.
హసన నుంచి.. హొళెనరసీపురానికి వస్తున్న ట్రక్కుకు ఎదురుగా ఒక ద్విచక్ర వాహనం వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ ట్రక్కుపై నియంత్రణ కోల్పోయాడు. ఊరేగింపుగా వస్తున్న వారిపైకి వాహనం దూసుకువెళ్లింది. గాయపడిన వారిలో పలువురి స్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి ఎస్పీ మహ్మద్ సుజేతా, మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ తదితరులు చేరుకుని సహాయక చర్యల్లో చేపట్టారు. (ఏజెన్సీలు)
