हैदराबाद: ‘भारत माता फाउंडेशन’ की ओर से भारत माता की महाआरती’ कार्यक्रम का आयोजन हुसैन सागर में किया गया। इस ‘महाआरती’ के दौरान किये गये आतिशबाजी के कारण विस्फोट हो गया। इस विस्फोट में दो नाव पूरी तरह से जल गये। इस विस्फोट में सात लोग घायल हो गये। घायलों को इलाज के लिए गांधी अस्पताल, यशोदा और सरोजिनी देवी अस्पतालों में भर्ती किया गया।
इनमें से तीन लोग गंभीर रूप से घायल हो गए। खबर है कि उनकी आंखों को मार लगी है। नावों में लगी आग को बुझाने के लिए अग्निशमन कर्मी घटनास्थल पर पहुंचे और आग पर काबू पा लिया है। केंद्रीय मंत्री जी किशन रेड्डी के नेतृत्व में ‘भारत माता फाउंडेशन’ की ओर से आयोजित ‘भारत माता की महाआरती’ कार्यक्रम में तेलंगाना के राज्यपाल जिष्णु देव वर्मा और प्रसिद्ध संगीत निर्देशक एम एम केरवणी, नागफनी शर्मा और अन्य उपस्थित थे।
Also Read-
భరతమాత ‘మహా హారతి’లో బాణాసంచా ప్రమాదం, ముగ్గురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్: హుస్సేన్ సాగర్లో జరిగిన బాణాసంచా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్న గాంధీ ఆసుపత్రితో పాటు యశోద, సరోజినీ దేవి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో ‘భారత మాత పౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘భరత మాత మహా హారతి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాణాసంచా పేలుళ్లలో అపశృతి చోటుచేసుకుంది.
బోటులో జరిగిన బాణాసంచా ప్రమాదంలో ఏడు మంది నిర్వాహకులు చిక్కుకోగా వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు వ్యక్తులకు బాణాసంచా పేలుడు ధాటికి తీవ్ర గాయాలు కాగా కళ్లకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. బోట్లలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలోని ‘భారత మాత ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాణాసంచా పేలుళ్లు ప్రమాదానికి కారణమయ్యాయి. ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి, నాగఫణిశర్మ తదితరులు హాజరయ్యారు. (ఏజెన్సీలు)