हैदराबाद: तेलंगाना में तीन एमएलसी सीटों के लिए हुए स्नातक एमएलसी चुनाव शांतिपूर्ण ढंग से संपन्न हो गए। अंतिम घंटे में मतदान केंद्रों के बाहर लंबी कतारें देखी गईं। अधिकारियों ने चार घंटे तक कतार में खड़े रहने वालों को मतदान का अवसर दिया। पेद्दपल्ली में सबसे अधिक 77.95 प्रतिशत मतदान हुआ। उल्लेखनीय है कि नलगोंडा शिक्षक एमएलसी सीट के लिए 90 प्रतिशत मतदान हुआ। सुबह से ही शिक्षक मतदान में बढ़-चढ़कर हिस्सा लिया। संयुक्त वरंगल जिले में मतदान 80 प्रतिशत को पार कर गया है।
संयुक्त खम्मम जिले में भी यह 80 प्रतिशत को पार कर गया है। नलगोंडा, खम्मम और वरंगल में मतदान शांतिपूर्ण ढंग से समाप्त हो गया। मतपेटियों को नलगोंडा में अर्जाला बावी के पास स्थित स्ट्रांग रूम में ले गये। हालांकि, दोपहर तक मतदान की गति धीमी थी, लेकिन दोपहर बाद मतदाता मतदान केंद्रों पर वोटर कतारों में खड़े हो गए। शिक्षक एवं स्नातक कोटे की तीन एमएलसी सीटों के लिए मतदान एक-दो घटनाओं को छोड़कर शांतिपूर्ण ढंग से संपन्न हो गया।
मेदक, निजामाबाद, करीमनगर और आदिलाबाद में स्नातक और शिक्षक एमएलसी चुनावों के लिए चार संयुक्त जिलों के अंतर्गत 15 जिलों में कुल 680 मतदान केंद्र बनाए गए हैं। इसमें 406 स्नातक मतदान केन्द्र, 181 शिक्षक मतदान केन्द्र तथा शिक्षक एवं स्नातक मतदाताओं के लिए 93 सामान्य मतदान केन्द्र शामिल हैं। बुधवार को करीमनगर के डॉ बी आर अंबेडकर स्टेडियम में 15 जिलों को चुनाव सामग्री और मतपेटियां वितरित की गईं। मतदान समाप्त होने के बाद, सभी जिलों से मतपेटियों को कड़ी सुरक्षा के बीच करीमनगर के अंबेडकर स्टेडियम स्थित स्वागत केंद्र में ले गये।
स्नातक एवं शिक्षक एमएलसी चुनाव के लिए मतदाता के रूप में पंजीकृत केंद्र एवं राज्य सरकार के कर्मचारियों को अपने मत का प्रयोग करने के लिए विशेष आकस्मिक अवकाश लेने की सुविधा प्रदान की गई है। उल्लेखनीय है कि संबंधित प्रबंधनों ने व्यवसाय, वाणिज्यिक, औद्योगिक संस्थानों या अन्य सभी निजी प्रबंधन एवं प्राधिकरणों में कार्यरत स्नातक मताधिकार प्राप्त कर्मचारियों एवं श्रमिकों को भी अपने मताधिकार का प्रयोग करने की अनुमति प्रदान किया है।
यह भी पढ़ें-
ముగిసిన 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు, అత్యధికంగా పెద్దపల్లిలో పోలింగ్
హైదరాబాద్: తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి గంటలో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా క్యూలు కనిపించాయి. 4 గంటల లోపు క్యూలో ఉన్నవారికి అధికారులు ఓటేసే అవకాశం ఇచ్చారు. పెద్దపల్లిలో అత్యధికంగా 77.95 శాతం పోలింగ్ నమోదైంది. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 90 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఉదయం నుంచి పోలింగ్లో టీచర్లు భారీగా పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ 80 శాతం దాటింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా 80 శాతం దాటింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నల్గొండ అర్జాల బావి దగ్గర స్ట్రాంగ్ రూంలకు బ్యాలెట్ బాక్సులు తరలించారు. మధ్యాహ్నం వరకూ పోలింగ్ మందగొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఒకట్రెండు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 15 జిల్లాల్లో మొత్తం 680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 406 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు, 181 టీచర్స్ పోలింగ్ స్టేషన్లతో పాటు టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు కలిపి 93 కామన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో 15 జిల్లాలకు ఎన్నికల మెటీరియల్, బ్యాలెట్ బాక్సులను బుధవారం డిస్ట్రిబ్యూట్ చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం అన్ని జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలోని రిసెప్షన్ సెంటర్కు తరలించారు.
గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు తమ ఓటు వినియోగించుకునేందుకు స్పెషల్ క్యాజువల్ లీవ్ వర్తించే విధంగా వెసులుబాటు కల్పించారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్, అథారిటీల్లో పని చేస్తూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు సైతం వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా యాజమాన్యాలు అనుమతి, వెసులుబాటు ఇవ్వడం గమనార్హం.
(ఏజెన్సీలు)