జాతీయ రైతు దినోత్సవం: లక్షన్నర మంది రైతులతో సంభాషించిన కేటీఆర్, తెలుసుకోవడానికి చదవండి ఈ వార్త

• రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులతో టెలి కాన్ఫరెన్స్  ద్వారా మాట్లాడిన కేటీఆర్

• రైతన్నల సమగ్ర సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేటీఆర్

• తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయింది.

• కరువు నేలలను హరిత నేలలుగా మార్చాము.

• కటిక చీకట్ల తొలగిపోయి 24 గంటల కరెంటు వెలుగులు కనిపిస్తున్నాయి.

• ఆత్మహత్యలు నుంచి దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారింది.

• దేశ చరిత్రలో ఎవరూ ఊహించని రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి విప్లవాత్మక పథకాలను కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు.

• రైతు సంక్షేమానికి వ్యవసాయ రంగ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది.

• ప్రతీసారి రైతన్నలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంట నిలబడ్డారు.

• భవిష్యత్తులోనూ రైతన్నల ఇలానే మద్దతుగా ఉంటారన్న  విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్.

• రైతన్నల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి

హైద‌రాబాద్ : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా లక్షన్నర మంది రైతులతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారక రామారావు సంభాషించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులతో టెలి కాన్ఫరెన్స్  ద్వారా మాట్లాడిన కేటీఆర్, రైతన్నల కోసం, వ్యవసాయ రంగం బలోపేతం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించి, అన్నదాతల కోసం పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి ఎప్పటిలాగానే అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైతులతో మాట్లాడిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక వ్యవసాయ కార్యక్రమాల గురించి కేటీఆర్ మాట్లాడారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతన్నల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం వినూత్నమైన కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకువచ్చామన్నారు కేటీఆర్. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని నమ్మే కేసీఆర్… దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఊహించేందుకు కూడా సాహసించని రైతుబంధు కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. రైతుబంధుతో అన్నదాతకు ఆత్మబంధువుగా నిలుస్తూ ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుందని కేటీఆర్ తెలిపారు. రైతుబంధుతో ఇప్పటి వరకు 9 విడతల్లో ₹57,882 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేశామన్నారు.10వ విడత నిధులు ₹7,600 కోట్లు ఈ నెలాఖరు నుండి పంపిణీ చేస్తామన్నారు. రైతుబంధు సుమారు 66 లక్షల మంది తెలంగాణ రైతులకు లబ్ది కలుగుతుందన్నారు కేటీఆర్. అప్పురూపంలో కాకుండా పెట్టుబడి రూపంలో తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా అన్నదాతలకు ఆర్థిక సహాయం చేసిన తొలి ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరే అన్నారు. రైతుబంధు విజయంతో కేంద్ర ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ స్ఫూర్తిగా రైతుబంధు లాంటి పథకాన్ని చేపట్టిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 

రైతు బీమాతో రైతన్నలకు ఒక గొప్ప భరోసాను అందించిన మానవీయ సర్కారు తమదన్నారు. రైతుల తరుపున ప్రభుత్వమే బీమా ప్రీమియంను చెల్లించి దురదృష్టవశాత్తు చనిపోయిన రైతు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల భరోసాను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్ దే అన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు 94 వేల రైతు కుటుంబాలకు రూ. 4700 కోట్ల బీమా పరిహారం చెల్లించామన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతన్నలు,వ్యవసాయ రంగ పరిస్థితులు ఘోరంగా ఉండేవన్న కేటీఆర్, సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాయకల్ప చికిత్స చేశారని చెప్పారు. తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు ఆదరువు చెరువే అన్న సత్యాన్ని గుర్తించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆరే అన్న కేటీఆర్… సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురయిన చెరువులకు స్వరాష్ట్రంలో “మిషన్ కాకతీయ”తో ప్రాణంపోశారని చెప్పారు. మిషన్ కాకతీయతో తెలంగాణలోని 27,625 చెరువులకు పునర్వైభవం వచ్చిందన్నారు. ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పారు. 

సమైక్య రాష్ట్రంలో పెండింగ్ లో పడ్డ ప్రాజెక్టులన్నింటిని పూర్తిచేసి కాళేశ్వరం లాంటి నూతన ప్రాజెక్టులతో తెలంగాణను ఒక సజీవ సాగునీటి క్షేత్రంగా మార్చిన ఘనత కేసిఆర్ గారికే దక్కుతుందన్నారు కేటీఆర్. తెలంగాణ సాగునీటి రంగ విజయాలతో కెసిఆర్ అంటే కాలువలు చెరువులు రిజర్వాయర్లు అన్న తీరుగా అర్థం మారిందన్నారు. ఒకప్పుడు కరువుకు కేరాఫ్ అడ్రస్ గా వలసలతో వలపోసిన మహబూబ్ నగర్ జిల్లా ఇవాళ పచ్చగా మారి కేసీఆర్ సంకల్ప సిద్ధికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందన్నారు. కేసీఆర్ గారి పట్టుదల, చిత్తశుద్దితో సమైక్య రాష్ట్రంలో దండుగలా ఉన్న వ్యవసాయం తెలంగాణలో పండగగా మారిందన్నారు.విద్యుత్, సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడంతో లక్షలాది అదనపు ఎకరాలు సాగులోకి వచ్చి తాగు, సాగునీటికి కొరత లేకుండా కడుపునిండా నీళ్లు దొరుకుతున్నాయన్నారు కేటీఆర్. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న తిండిగింజల ఉత్పత్తి ఇవాళ రికార్డ్ స్థాయిలో మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. కెసిఆర్ నాయకత్వంలోని రైతు సర్కార్ కే ఈ ఘనత సాధ్యమైందన్నారు. పండించిన ధాన్యాన్ని కొనమని కేంద్రం మొండికేస్తే…వేలాది కోట్ల రూపాయలతో పండిన ప్రతీ గింజను కొన్న రైతుపక్షపాతి ప్రభుత్వం తమదని కేటీఆర్ తెలిపారు. 

వ్యవసాయ సంక్షోభాన్ని తట్టుకోలేక పంట పొలాల్లోనే రైతులు  ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నుంచి ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఆహారధాన్యాలను పండిస్తూ అన్నపూర్ణగా తెలంగాణ మారిందన్నారు కేటీఆర్. సాలీనా పెరుగుతున్న ఆహార ధాన్యాల ఉత్పత్తికి అనుగుణంగా నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచామన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న గోదాముల సామర్థ్యాన్ని 24 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. 2014కు ముందు కరెంటు కోతలు, దొంగ రాత్రి కరెంటు సరఫరాతో రైతన్నలు బోరు బావుల దగ్గర ప్రాణాలు పోగొట్టుకున్న దుస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటుతో రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తుందన్నారు.నాణ్యమైన కరెంటు ఇవ్వడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి కోతలు ఏర్పడడం లేదన్న కేటీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ తో పాటు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ 24 గంటలు వ్యవసాయ విద్యుత్తు ఎక్కడ లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు గంటల కరెంటుతో అరిగోస పడ్డ రైతన్నకు సీఎం కేసీఆర్ గారు 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంటును అందిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. రూ. 36,703 కోట్లతో విద్యుత్ రంగంలో మౌలిక వసతులను కల్పించి సాలీనా దాదాపు రూ 10,500 కోట్ల వ్యయంతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటు అందిస్తుందన్నారు కేటీఆర్.

తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయిందన్నారు కేటీఆర్. అన్నదాతలను సంఘటితపరిచి,వారిని చైతన్యపరచడానికి ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేసి, ఒక్కో క్లస్టర్‌కు ఒక రైతువేదిక లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 572 కోట్లతో 2601 రైతువేదికలను తమ ప్రభుత్వం నిర్మించిందన్నారు. రైతు సంక్షేమం విషయంలో ఇదొక అపూర్వ విజయం అన్నారు. రైతన్నల సమగ్ర సంక్షేమం, అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేటీఆర్, తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలోనూ రైతాంగం తమకు మద్దతుగా నిలిచిందన్నారు. భవిష్యత్తులోనూ రైతన్నల ఆశీర్వాదం తమకు ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. రైతే ముఖ్యమంత్రిగా ఉన్న తమ ప్రభుత్వానికి అన్నదాతలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైతన్నల మద్దతుతో భవిష్యత్తులోనూ వ్యవసాయ రంగాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కేటీఆర్ చెప్పారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X