लंबित बिल पर केसीआर सरकार क्रोधित, राज्यपाल के खिलाफ सुप्रीम कोर्ट में याचिका दायर

हैदराबाद : केसीआरक सरकार ने राज्यपाल द्वारा सरकार की ओर से भेजे गए कई विधेयकों के लंबे समय से लंबित रहने को चुनौती देते हुए सर्वोच्च न्यायालय का दरवाजा खटखटाया है। राजभवन के खिलाफ मुख्य सचिव शांतिकुमारी ने सुप्रीम कोर्ट में सिविल याचिका दायर की। यह याचिका संविधान के अनुच्छेद 32 के आधार पर दायर की गई थी। याचिका में राज्यपाल के सचिव और केंद्रीय विधि सचिव को प्रतिवादी बनाया गया था।

याचिका में कहा गया है कि अगर विधान सभा और विधान परिषद की मंजूरी के बाद राज्यपाल को विधेयक भेजे जाते हैं। ऐसे भेजे गये बिलों को पांच महीने में सात और पिछले महीने के तीन विधेयकों को राजभवन से मंजूरी नहीं मिली है। 194 पेज की याचिका में कहा गया है कि राजभवन की एस रवैये के कारण सरकार विधायिकाओं द्वारा लिए गए फैसलों को लागू नहीं कर पा रही है और जन कल्याणकारी कार्यक्रम पंगु हो गए हैं।

तेलंगाना सरकार ने सुप्रीम कोर्ट के संज्ञान में यह बात लाई है कि तेलंगाना विधानसभा द्वारा 8वें, चौथे और 5वें सत्र में पास किए गए सभी 10 बिल राज्यपाल के पास भेजे गए। राज्यपाल ने इन बिलों को बिना मंजूरी दिए या लौटाए लंबित रखा। राज्यपाल के अनुमोदन के लिए आदेश जारी करने को कहा गया। बताया गया कि सितंबर 2022 में 7 बिल और इस साल फरवरी में 3 बिल राज्यपाल के पास लंबित हैं। ये विधेयक विधानसभा द्वारा पारित होने की तारीख और राज्यपाल के कार्यालय में लंबित रहने की अवधि दर्ज की हैं।

గవర్నర్‌ తమిళిసైపై సుప్రీంకోర్టులో దావా.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్‌ సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్‌చేస్తూ KCR ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్‌భవన్‌ తీరును వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సుప్రీంకోర్టులో సివిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 32వ అధికరణం ఆధారంగా ఈ పిటిషన్‌ వేశారు.

పిటిషన్‌లో గవర్నర్‌ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేశారు. శాసనసభ, శాసనమండలి బిల్లులను ఆమోదించిన తర్వాత గవర్నర్‌కు పంపితే గత ఐదు నెలలుగా ఏడు బిల్లులు, గత నెల రోజుల నుంచి మూడు కలిపి మొత్తం పది బిల్లులకు రాజ్‌భవన్‌ ఆమోదం తెలుపలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ తీరువల్ల ప్రజా ప్రభుత్వం చట్టసభల ద్వారా తీసుకొన్న నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని 194 పేజీల పిటిషన్‌లో తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ 8వ సమావేశాలు, 4వ, 5వ సమావేశాల్లో ఆమోదించిన మొత్తం 10 బిల్లులను గవర్నర్‌కు పంపితే… వాటిని ఆమోదించకుండా, తిప్పిపంపకుండా గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. వాటిని గవర్నర్‌ ఆమోదించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. 2022 సెప్టెంబర్‌లో 7 బిల్లులు, ఈ ఏడాది ఫిబ్రవరిలో 3 బిల్లులు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. ఈ బిల్లులకు అసెంబ్లీ ఆమోదించిన తేదీ, గవర్నర్‌ ఆఫీసులో పెండింగ్‌లో ఉన్న కాలాన్ని నివేదించింది.

బిల్లులను ఆమోదించకుండా, తిప్పి పంపకుండా పెండింగ్‌లో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరింది. బిల్లుల ఆమోదం ఆలస్యం అవ్వడం వల్ల వాటి ద్వారా ప్రజలకు లభించాల్సిన ప్రయోజనాలు కుంటుపడుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగ రూపకల్పన సందర్భంగా నాటి రాజ్యాంగ సభలో నిర్వహించిన చర్చలను ప్రభుత్వం తన పిటిషన్‌లో ప్రస్తావించింది. ప్రజా ప్రభుత్వాల అభీష్టానికి అనుగుణంగా గవర్నర్లు వ్యవహరించాలని పేర్కొన్నది. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం చట్టసభల్లో చర్చించి, ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించకపోవటం రాజ్యాంగ వ్యతిరేకమని ఆక్షేపించింది.

బిల్లులను ఆమోదించకపోవటానికి గల కారణాలను కూడా గవర్నర్‌ కార్యాలయం చెప్పలేదని తెలిపింది. హేతుబద్ధ కారణాలు కూడా చెప్పకుండా నెలల తరబడి బిల్లులను పెండింగ్‌లో పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నది. బిల్లులపై సంబంధిత మంత్రులు గవర్నర్‌ను కలిసి వివరణ కూడా ఇచ్చారని, ఉన్నతాధికారులు కూడా కలిసి సందేహాలను నివృత్తి చేసిన తర్వాత కూడా బిల్లులకు మోక్షం రాలేదని వివరించింది. ఆర్టికల్‌ 163 ప్రకారం మంత్రిమండలి సలహాకు అనుగుణంగా గవర్నర్‌ విధులు నిర్వర్తించాలని స్పష్టం చేసింది. గవర్నర్‌ స్వతంత్రంగా వ్యవహరించరాదని తెలిపింది. బిల్లుల పెండింగ్‌, ఆమోదం, గవర్నర్‌ అధికారాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉదహరించింది.

రాజ్యాంగంలోని 32వ అధికరణం కింద రాజ్‌భవన్‌ బిల్లులకు ఆమోదం చెప్పకపోవడంపై న్యాయ పోరాటం చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గత సంవత్సరం సెప్టెంబర్‌ 14 నుంచి ఇప్పటివరకు గవర్నర్‌ బిల్లలను ఆమోదించకుండా తన వద్దనే పెట్టుకొన్నారు. రాజ్యాంగంలోని 200వ అధికరణం ప్రకారం శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్‌కు నివేదించాలి. ఆ బిల్లులను గవర్నర్‌ ఆమోదించడమో లేక ఏవైనా మార్పులు సూచిస్తూ వెనకి పంపడమో, లేనిపక్షంలో రాష్ట్రపతి పరిశీలనకు నివేదించటమో చేయాలి.

సవరణలు సూచిస్తూ తిప్పి పంపితే చట్టసభలు దానిని పునఃపరిశీలించి ఆ మేరకు మార్పులు చేయవచ్చు. మార్పులు అవసరం లేదని భావిస్తే యథాతథంగా ఆమోదించి తిరిగి గవర్నర్‌కు పంపవచ్చు. రెండోసారి తనవద్దకు వచ్చిన బిల్లును గవర్నర్‌ విధిగా ఆమోదించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని 163వ అధికరణం కింద గవర్నర్‌ బిల్లులకు ఆమోదం చెప్పాలి. సీఎం అధ్యక్షతన మంత్రిమండలి తీసుకొనే నిర్ణయాలను విధిగా అమలు చేయాలి. ప్రభుత్వ నిర్ణయాలను విస్మరించి గవర్నర్‌ స్వతంత్రంగా వ్యవహరించరాదని షంషేర్‌సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ స్టేట్‌ కేసులో సుప్రీంకోర్టు గతంలోనే తేల్చి చెప్పింది.

మంత్రివర్గం, చట్టసభలు చేసే సిఫారసులను గవర్నర్‌ అమలు చేయాల్సిందే. చట్టాల విషయంలో రాష్ట్రపతి లేదా గవర్నర్లకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదు. రాష్ట్రంలో రాజ్యాంగాధినేతగా మంత్రివర్గ తీర్మానాలను గవర్నర్‌ ఆమోదించి తీరాలి. రాష్ట్రపతి, గవర్నర్‌ రాజ్యాంగానికి లోబడే విధులు నిర్వహించాలి. వారేమీ రాజ్యాంగానికి అతీతులు కాదు. గవర్నర్‌ వ్యక్తిగత అభిప్రాయాలు ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలపై ఉండకూడదు. అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నప్పుడు గవర్నర్‌ ఆమోదించాలి.

ప్రజాశ్రేయస్సు కోసమే ప్రభుత్వం పలు బిల్లులను చట్ట సభల్లో ఆమోదించి గవర్నర్‌కు పంపింది. రాజ్యాంగంలోని 200 అధికరణం కింద గవర్నర్‌ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనేందుకు వీల్లేదు. ఆ అధికరణలో ‘షల్‌ ’అనే ఇంగ్లిష్‌ పదానికి ‘విధిగా’ అని అర్ధం. గవర్నర్‌కు విచక్షణాధికారం కూడా లేదు. ఒకసారి బిల్లును గవర్నర్‌ వెనకి పంపిన తర్వాత అదే బిల్లును యథాతథంగా ఆమోదించి తిరిగి పంపితే దానిని గవర్నర్‌ ఆమోదించి తీరాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ నేతృత్వంలోని రాజ్యంగ కమిటీ స్పష్టంచేసింది. గవర్నర్‌ తన విచక్షణాధికారాన్ని వినియోగించేందుకు వీల్లేదు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమం. ప్రజాప్రభుత్వ నిర్ణయాలకు అవరోధం ఏర్పడకూడదు. గవర్నర్‌ సమాంతర ప్రభుత్వానికి అధిపతి కాదు. ప్రభుత్వంతో కలిసి గవర్నర్‌ పనిచేయాలి. బిల్లుల విషయంలో గవర్నర్‌ లేవనెత్తిన సందేహాలను ప్రభుత్వ అధికారులు స్వయంగా వెళ్లి నివృత్తి చేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు లేదు. గవర్నర్‌ పాలనాపరమైన నిర్ణయాల్లో జాప్యం చేస్తున్న కోణంలో ఈ సమస్యను సుప్రీంకోర్టు చూడాలి. పిటిషన్‌ను విచారించి గవర్నర్‌కు తగిన సూచనలు చేయాలి. ఇలాంటి సమస్యను పరిషరించేందుకు రాజ్యాంగం సర్వాధికారాలను సుప్రీంకోర్టుకు కల్పించింది అని సీఎస్‌ తన పిటిషన్‌లో వివరించారు.

1. ప్రభుత్వం ఏదైనా చట్టం చేయాలని భావించినప్పుడు, సంబంధిత శాఖ అందుకు సంబంధించిన వివరణాత్మక నోట్‌ను సిద్ధం చేస్తుంది. ఆ నోట్‌ను ఆ శాఖ మంత్రి ద్వారా ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపిస్తారు.

2. సీఎం ఆమోదం పొందిన తర్వాత, ముసాయిదా బిల్లు రూపకల్పనకై శాఖకు ఆదేశాలు ఇస్తారు.

3. సంబంధిత శాఖ న్యాయ శాఖతో సంప్రదించి బిల్లుకు సంబంధించి విషయాలతో ముసాయిదా బిల్లును బుక్‌లెట్‌ రూపంలో ముద్రిస్తుంది. దీన్ని క్యాబినెట్‌ ఆమోదం కోసం పంపిస్తారు.

4. క్యాబినెట్‌ ఆమోదం తర్వాత, శాసనసభలో బిల్లును పెట్టేందుకు సంబంధిత శాఖ మంత్రి ‘నోటీస్‌ ఆఫ్‌ మోషన్‌’ అందజేస్తారు.

5. ముసాయిదా బిల్లుకు స్పీకర్‌ ఆమోదం తెలిపి ఏజెండాలో ఈ అంశాన్ని చేర్చాలని శాసన సభ కార్యదర్శికి నిర్దేశిస్తారు. ఎజెండా ప్రకారం ఆ రోజు సంబంధిత మంత్రి బిల్లును ప్రవేశపెడతారు. ఆ బిల్లుపై సభలో చర్చ అనంతరం మంత్రి సమాధానమిస్తారు. ఆ తర్వాత శాసనసభ ఆ బిల్లుకు ఆమోదం తెలుపుతుంది.

6. రాష్ట్రంలో ద్విసభా విధానం అమలులో ఉంటే శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును శాసన మండలికి పంపిస్తారు. బిల్లుకు మండలి ఆమోదం తెలుపుతుంది.

7. ఉభయ సభలు ఆమోదించిన తర్వాత బిల్లు బ్లూ కాపీపై సంతకం కోసం ప్రిసైడింగ్‌ ఆఫీసర్స్‌ ముందు ఉంచుతారు. తదుపరి ప్రక్రియకు కోసం బిల్లును గవర్నర్‌ కార్యదర్శికి పంపిస్తారు.

8. బిల్లుకు సంబంధించి తదుపరి చర్యల కోసం గవర్నర్‌ కార్యదర్శి న్యాయ శాఖకు పంపిస్తారు. ఆ బిల్లును న్యాయశాఖ క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవని నిర్ధారిస్తూ సంబంధిత శాఖ కార్యదర్శులకు, మంత్రికి, న్యాయ శాఖ మంత్రికి పంపిస్తుంది.

9. న్యాయ శాఖ మంత్రి సదరు బిల్లుపై సంతకం చేసి ముఖ్యమంత్రికి పంపిస్తారు. బిల్లును పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఆ బిల్లు ఆమోదం కోసం గవర్నర్‌కు పంపిస్తారు.

10. గవర్నర్‌ ఆమోదం పొందిన తర్వాత, అవసరమైన చర్యల కోసం గవర్నర్‌ కార్యదర్శి బిల్లును న్యాయ శాఖ కార్యదర్శికి పంపిస్తారు.

గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు     

1. ఆజమాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు-2022    
2. పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లు                               
3. పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ బిల్లు                              
4. అటవీ యూనివర్సిటీ బిల్లు                                                          
5. యూనివర్సిటీల్లో ఉమ్మడి నియామక బోర్డు బిల్లు                 
6. మోటర్‌ వెహికిల్‌ ట్యాక్సేషన్‌ సవరణ బిల్లు                          
7. ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు                       
8. వ్యవసాయ వర్సిటీ చట్ట సవరణ బిల్లు                                  
9. పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు                                        
10. మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు             

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X